కోర్టులో బీజేపీ నేత కిషన్‌ రెడ్డికి ఊరట

Nampally Special Court Verdict On Kishan Reddy Protest Case In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ బీజేపీ నేత కిషన్‌ రెడ్డికి నాంపల్లి స్పెషల్‌ కోర్టులో ఊరట లభించింది. 2010లో విద్యార్థుల ఉపకార వేతనాల కోసం చేసిన ఆందోళనలో కిషన్‌ రెడ్డితో పాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కిషన్‌ రెడ్డిని నిర్దోషిగా తేలుస్తూ బుధవారం కోర్టు తీర్పు వెలువరించింది. అతనితో పాటు మరో ముగ్గురిని కూడా నిర్దోషులుగా కోర్టు తేల్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో, వివిధ ఆందోళనల సమయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులను విచారించడానికి కేం‍ద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top