అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

Published Fri, Feb 20 2015 6:58 PM

man suicide due to heavy debts

వరంగల్ : మండలంలోని అందనాలపాడు కొత్తతండాలో అప్పుల బాధతో ధరావతు రాజేష్(25) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.... రాజేష్ తన తండ్రితో కలిసి 7 ఎకరాల్లో పత్తి, మిరప సాగు చేశారు. పంట సరిగా పండకపోయే సరికి సుమారు రూ.5 లక్షల అప్పు అయింది. అప్పు ఇచ్చినవాళ్లు ఒత్తిడి తేవడంతో తీవ్ర మనస్తాపం చెందిన రాజేష్ శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగాడు. వెంటనే బంధువులు రాజేష్‌ను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాజేష్ మరణించాడు. రాజేష్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.
(డొర్నకల్)

Advertisement

తప్పక చదవండి

Advertisement