జన జాతరకు అనుమతివ్వండి | High Court order to police for Jana jatara Permission | Sakshi
Sakshi News home page

జన జాతరకు అనుమతివ్వండి

Mar 30 2018 2:34 AM | Updated on Sep 4 2018 5:44 PM

High Court order to police for Jana jatara Permission - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 15న నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో తలపెట్టిన జన జాతరకు అనుమతివ్వాలని హైకోర్టు గురువారం హైదరాబాద్‌ పోలీసులను ఆదేశించింది. ఈ కార్యక్రమం వివరాలు..ఎంతమంది హాజరవుతారు తదితర అంశాలను పోలీసులకు అందజేయాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. వీటిని పరిశీలించి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కార్యక్రమ నిర్వహణకు అనుమతివ్వాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి ఆదేశాలు జారీ చేశారు. జన జాతర కార్యక్రమానికి పోలీసులు అనుమతివ్వకపోవడాన్ని సవాలు చేస్తూ నిర్వాహక సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement