దక్షిణమధ్య రైల్వే శ్రీకారం
వికారాబాద్లో ఏటీవీఎం ప్రారంభం
వికారాబాద్ : ప్రయాణికులకు సులువుగా రైల్వే టికెట్లు లభించేలా దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ శ్రీకారం చుట్టింది. గతంలో కేవలం నగరాల్లోని రైల్వే స్టేషన్లకే పరిమితమైన ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మిషన్(ఏటీవీఎం)ను సికింద్రాబాద్ రైల్వే శాఖ ఉన్నతాధికారులు నిబంధనలను సడలించి ప్రయాణికులతో అనునిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 2 నుంచి లింగంపల్లి, శంకర్పల్లి, వికారాబాద్, తాండూరు, బీదర్ తదితర రైల్వే స్టేషన్లలో ఎనీ టైం టికెట్లు వచ్చే మిషన్ ప్రయాణికులకు రైల్వే అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ మేరకు శనివారం వికారాబాద్ రైల్వే జంక్షన్లో సీబీఎస్ చీఫ్ బుకింగ్ సూపర్వైజర్ లక్ష్మణ్ ఏటీవీఎం మిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు అతి తక్కువ సమయంలో క్యూలేకుండా రైలు రూట్ ఆధారంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకొని ఉన్న ఏటీవీఎం మిషన్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ మిషన్లో రైలు రూట్ మ్యాప్తో పాటు స్టేషన్లను గుర్తించే విధంగా సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా మిషన్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రయాణికులు తమకు ఇష్టమొచ్చిన భాషను ఎంపిక చేసి టికెట్లు పొందే సౌకర్యం ఉందని పేర్కొన్నారు.
టికెట్లు పొందాలంటే సంబంధిత ఏటీవీఎం ఉన్న స్టేషన్లలోని బుకింగ్ సెంటర్లలో కనీస రుసుం రూ.50 డిపాజిట్ చేసి ప్రయాణికులు పొందాలని సూచించారు. ఆ తరువాత వారు స్మార్టుకార్డులో ఎన్ని డబ్బులు రిచార్జీ చేసుకుంటే అంత డబ్బులు నిల్వ ఉంటాయని తెలిపారు. కనీసం రూ.100 రిచార్జి చేసుకుంటే 5 శాతం అదనపు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. రూ.1000 రిచార్జి చేసుకుంటే రూ.50, రూ. 10 వేల రిచార్జి చేసుకుంటే రూ.500 అదనంగా ఆదాయం వస్తుందని తెలిపారు. ఈ స్మార్టు కార్డులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకొని డబ్బు, సమయాన్ని ఆదా చేసుకోవాలని తెలిపారు. ఈకార్యక్రమంలో స్రవంతి, సవిత తదితరులు పాల్గొన్నారు.
సులువుగా రైల్వే టికె ట్లు
Published Sat, Sep 5 2015 11:36 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement