తొలిరోజు ముగిసిన చండీ మహాయాగం | ayuta chandi yagam day one pooja finished | Sakshi
Sakshi News home page

తొలిరోజు ముగిసిన చండీ మహాయాగం

Dec 23 2015 8:22 PM | Updated on Aug 14 2018 10:54 AM

తొలిరోజు ముగిసిన చండీ మహాయాగం - Sakshi

తొలిరోజు ముగిసిన చండీ మహాయాగం

మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన అయుత చండీ మహాయాగం తొలిరోజు ముగిసింది.

ఎర్రవల్లి: మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన అయుత చండీ మహాయాగం తొలిరోజు ముగిసింది. తిరిగి గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభమవుతుంది. బుధవారం ఉదయం 7.45 గంటలకు మొదలైన ఈ మహాక్రతువు రాత్రి 8 గంటల సమయంలో తొలిరోజు పూజలు ముగిశాయి. శృంగేరీ పండితులతోపాటు మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ నుంచి దాదాపు 2 వేల మంది రుత్వికులు ఈ సందర్భంగా గురుపూజ నిర్వహించారు. నేటి నుంచి ఆదివారం వరకు (ఐదు రోజుల పాటు) ఈ క్రతువు కొనసాగనుంది.

అయుత చండీ మహాయాగం తొలి రోజున జరిగిన పూజల్లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దంపతులతోపాటు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి బొసాలే, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హరీశ్ రావు తదితరులు హాజరయ్యారు. ఇప్పటివరకు ఖరారైన షెడ్యూల్ ప్రకారం గురువారం రెండో రోజు జరగనున్న కారక్రమంలో కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement