ఉదయం 7 నుంచే పరీక్ష హాల్లోకి అనుమతి | Approval of the exam hall from 7 am | Sakshi
Sakshi News home page

ఉదయం 7 నుంచే పరీక్ష హాల్లోకి అనుమతి

Mar 24 2018 2:43 AM | Updated on Mar 24 2018 2:43 AM

Approval of the exam hall from 7 am - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ స్థాయి సాంకేతిక విద్యా సంస్థల్లో 2018–19 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఏప్రిల్‌ 8న జరగనున్న జేఈఈ మెయిన్‌ రాత పరీక్షల కోసం సీబీఎస్‌ఈ అన్ని ఏర్పాట్లు చేసింది. ఏప్రిల్‌ 15, 16 తేదీల్లో మెయిన్‌ ఆన్‌లైన్‌ పరీక్షలను రోజూ 2 దఫాలుగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఈ పరీక్షలకు సం బంధించిన పూర్తిస్థాయి టైంటేబుల్‌ను జారీ చేసింది. ఉదయం 9:30కు జరిగే పరీక్షకు విద్యార్థులను ఉదయం 7 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పేర్కొంది.

మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు మధ్యాహ్నం 12:45 గంటల నుంచే అనుమతిస్తామని వెల్లడించింది. నిర్ణీత పరీక్ష ప్రారంభ సమయం తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేసింది. 8న ఉదయం బీఈ/బీటెక్‌ కోసం పేపర్‌–1 పరీక్ష ఉంటుందని, బీఆర్క్‌/బీప్లానింగ్‌లో ప్రవేశాలకు మధ్యాహ్నం పేపర్‌–2 పరీక్ష ఉంటుందని వెల్లడించింది. 15, 16 తేదీల్లో ఆన్‌లైన్‌ పరీక్షలు ఉంటాయని, ఉదయం ఆఫ్‌లైన్‌ పరీక్ష టైంటేబులే వర్తిస్తుందని వివరించింది. అయితే 15వ తేదీ మధ్యాహ్నం రెండో విడత పేపర్‌–1 ఆన్‌లైన్‌ పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం అవుతుందని, విద్యార్థులను 12:45నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని చెప్పింది. మెయిన్‌ పరీక్షల సిలబస్, ప్రశ్నపత్రాల విధానంలో మార్పు లేదని, 2014, 2015, 2016, 2017ల్లో ఇచ్చినట్లే ఈసారీ ఉంటుందని చెప్పింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement