అంగన్వాడీలపై చర్యలు
వేతనంతో పాటు బాధ్యతలను పెంచిన ప్రభుత్వం
జోగిపేట : చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు పునాదులు వేసి, వారు ఆరోగ్యంగా ఉండేలా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది నిర్లక్ష్యం వహించినా విధులు సక్రమంగా నిర్వహించకపోయినా గతంలో మాదిరిగా ఊరుకునే పరిస్థితిలేదు. సిబ్బంది ప్రవర్తన, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వ పథకాలను పక్కాగా అమలు చేయడానికి అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి ప్రత్యేక విధానాలను అమలు చేయనుంది. కేంద్రాల నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు చేపట్టనుంది. సిబ్బంది పనితీరుపైనే కేంద్రాల నిర్వహణ ఆధారపడి ఉంటుందని భావిస్తున్న ప్రభుత్వం పలు నిబంధనలను అమలు చేస్తొంది. జీఓ ఎంఎస్ నంబరు 14 ప్రకారం నిబంధనల్లో ఏ ఒక్కటి పాటించకున్నా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మార్గదర్శకాలు ఇవే..
ఆహర నిల్వల్లో వ్యత్యాసం, మళ్లింపు, దుర్వినియోగం, నిల్వ పత్రాలు సక్రమంగా లేకపోతే సిబ్బందిని తక్షణమే విధుల నుంచి తొలగిస్తారు.
ఆహారం శుభ్రంగా ఉండకపోయినా తప్పుదోవ పట్టించినా ఇంటికే..
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కేంద్రాలను నిర్వహించాలి.
అనుమతి లేకుండా కేంద్రాలు తెరవకున్నా ఇతర ప్రాంతాలకు వెళ్లినా, సమయపాలన పాటించకపోయినా రెండు సార్లు మెమోలు జారీ చేస్తారు. అయినా తీరు మారకుంటే విధుల నుంచి తొలగిస్తారు.
మూడు నుంచి ఆరు సంవత్సరాల చిన్నారుల హజరు 90 శాతం ఉండకపోతే మూడు మెమోలు జారీ చేస్తారు. అయినా నిబంధనల మేరకు హాజరు శాతం ఉండేలా జాగ్రత్తలు తీసుకోకపోతే విధుల నుంచి తొలగిస్తారు.
రిజిష్టర్లు సక్రమంగా వినియోగించకపోయినా, తప్పుడు సమాచారం పొందుపరిచినా మూడు మెమోలు జారీ చేస్తారు. తీరు మారకుంటే చర్యలు తీసుకుంటారు.
-అంగన్వాడీ కార్యకర్తలు ముందస్తు అనుమతి లేకుండా 15 రోజుల పాటు సెలవులు తీసుకుంటే వేతనంలో అయిదు శాతం కోత విధిస్తారు.
సెక్టారు, ప్రాజెక్టు సమావేశాలకు గైర్హాజరైతే అయిదు శాతం కోత విధిస్తారు.
నెలలో 15 రోజులు గృహ సందర్శన చేయకపోతే వేతనంలో 10 శాతం కోత విధిస్తారు.
బరువు, పోషక విలువలు తక్కువ ఉన్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ వహించకపోతే వేతనంలో 10 శాతం కోత.
ఆహర భద్రత పరిశుభ్రత పాటించకపోతే ఒక మెమో జారీ చేస్తారు. తీరు మారనట్లయితే విధులు నుంచి తొలగిస్తారు.
ఆయాలకు....
కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచడంలో నిర్లక్ష్యం వహిస్తే రెండు మెమోలు జారీ చేస్తారు. అయినా వినకుంటే వేతనంలో అయిదు శాతం కోత విధిస్తారు.
ఆహారపదార్థాలను పరిశుభ్రమైన చోట ఉంచకపోతే వేతనంలో అయిదు శాతం కోత.
సమయపాలన ప్రకారం కేంద్రాలను తెరవాలి.
అనుమతి లేకుండా 15 రోజులు సెలవు పెడితే విధుల నుంచి తొలగిస్తారు.
నిబంధనలను సవరించాలి
జీఓ 14లోని నిబంధనలను సవరించాలి. ప్రతిదానికి మెమోలు జారీ చేయడం వల్ల మానసికంగా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. అంగన్వాడీ ఉద్యోగులపై అంక్షలు ఎత్తివేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే రాయితీలు కల్పించాలి.
- ఇందిర, జోగిపేట ప్రాజెక్టు కార్యకర్తలు, ఆయాల యూనియన్ అధ్యక్షురాలు
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
విధులను నిర్లక్ష్యం చేస్తే సహించేదిలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంగన్వాడీ సిబ్బంది నడచుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. మండలాల్లో సూపర్వైజర్లు అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించాలి. నిబంధనల ప్రకారం కార్యకర్తలు, ఆయాల వల్ల తప్పులు జరిగితే మెమోలు జారీ చేస్తాం. మెమోలు జారీ చేసినా వారిలో మార్పులేనట్లయితే శాఖపరమైన చర్యలుంటాయి. - ఎల్లయ్య, జోగిపేట ఐసీడీఎస్ సీడీపీఓ
విధులు నిర్లక్ష్యం చేస్తే ఇంటికే..
Published Thu, Aug 13 2015 1:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement