ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ కు తృటిలో ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ సమీపంలో మంగళవారం జరిగిన
హైదరాబాద్: ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ కు తృటిలో ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జెడ్పీ చైర్ పర్సన్ శోభరాణి గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న ఇన్నోవాను డీసీఎం వ్యాను ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ఉన్న జెడ్పీ చైర్మన్ శోభారాణితో పాటు ఆమె భర్త సత్యనారాయణ గౌడ్ కు స్వల్పగాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.