బంట్వారం: భూమి మ్యుటేషన్ కోసం ఓ రైతు నుంచి రూ. 3 వేలు లంచం తీసుకుంటూ రొంపల్లి వీఆర్ఓ శివకుమార్ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఈ సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్, బాధితుడి కథనం ప్రకారం.. మండల పరిధిలోని రొంపల్లి గ్రామానికి చెందిన దరిపురం నర్సింలు గతేడాది మే నెలలో రెండెకరాల 32 గుంటాల పొలాన్ని ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేసి తన భార్య శశికళ పేరున రిజిస్ట్రేషన్ చేయించాడు.
భూమి మ్యుటేషన్(మార్పిడి) కోసం ఆయన అదే నెల 30న ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. దానికి సంబంధించిన పత్రాలను బంట్వారం తహశీల్దార్ కార్యాలయంలో సమర్పించా డు. దీనిపై విచారణ జరిపి మ్యుటేషన్ చేయాలని తహసీల్దార్ శ్రీనివాస్ రొంపల్లి వీఆర్ఓ శివకుమార్కు సూచించారు. వీఆర్ఓ శివకుమార్ 6 నెలలుగా రైతు నర్సింలును కార్యాలయానికి తిప్పించుకున్నాడు. దీంతో విసుగు చెందిన నర్సింలు ఈనెల 27న వీఆర్ఓను గట్టిగా ప్రశ్నించగా.. డబ్బులు ఇవ్వందే పనులు ఎలా చేస్తారు..? అంటూ సమాధానమిచ్చాడు.
రూ. 6 వేలు లంచంగా ఇస్తే పని అవుతుందని చెప్పాడు. అంత డబ్బు ఇచ్చుకోలేనని నర్సింలు వీఆర్ఓను బతిమాలాడు. చేసేది లేక చివరికి రూ.4 వేలు ఇస్తానని అంగీకరించాడు. వీఆర్ఓ తీరుతో విసుగు చెందిన రైతు రెండు రోజుల క్రితం నగరంలో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు గురువారం నర్సింలు వీఆర్వోకు డబ్బులిచ్చేందుకు బంట్వారం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు.
ఓ గదిలో ఉన్న వీఆర్ఓ శివకుమార్ దగ్గరకు వెళ్లగా జనాలు ఎక్కువగా కనిపించారు. కొద్దిసేపు నిరీక్షించమంటూ వీఆర్ఓ రైతు నర్సింలుకు కనుసైగ చేశాడు. అందరూ వెళ్లిపోయాక నర్సింలు రూ. 3 వేలు వీఆర్ఓ శివకుమార్ చేతికిచ్చాడు. రూ. 4 వేలు చెప్పాను కదా అంటూ వీఆర్ఓ నర్సింలును గద్దించాడు.
‘నా దగ్గర ఇంతే ఉన్నాయి సార్..’ అంటూ నర్సింలు ప్రాధేయపడడంతో వీఆర్ఓ డబ్బులు తీసుకొని తన జేబులో పెట్టుకున్నాడు. అప్పటికే మాటువేసిన హైదరాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్, ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి, సునీల్లు వీఆర్ఓ శివకుమార్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆయన వద్ద ఉన్న డబ్బును స్వాధీనం చేసుకున్నారు. వీఆర్వో చేతులను కెమిక ల్తో పరీక్షించగా డబ్బులు తీసుకున్నట్లుగా తేలింది.
కోర్టులో హాజరుపరుస్తాం..
వీఆర్ఓ శివకుమార్ రైతు నర్సింలు నుంచి రూ.3 వేలు తీసుకున్నట్లు నిర్ధారణ జరిగిందని ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. లంచగొండి వీఆర్ఓను శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. అవినీతి అధికారుల గురించి 9440446140 నంబర్లో సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. ఏసీబీ అధికారులకు వీఆర్వో పట్టుబడడం స్థానికంగా కలకలం రేగింది. ఎక్కడ చూసినా జనం ఈ విషయమే చర్చించుకుంటూ కనిపించారు.
ఏసీబీ వలలో రొంపల్లి వీఆర్ఓ
Published Fri, Jan 30 2015 2:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
Advertisement