తెలంగాణ వ్యాప్తంగా నడుస్తున్న ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలపై అవినీతి నిరోధక విభాగం అధికారులు దాడులు చేపట్టారు.
ప్రభుత్వ వసతి గృహాల్లో ఏసీబీ సోదాలు
Mar 1 2016 11:40 AM | Updated on Aug 17 2018 12:56 PM
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా నడుస్తున్న ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలపై అవినీతి నిరోధక విభాగం అధికారులు దాడులు చేపట్టారు. మంగళవారం ఉదయం నుంచి బృందాలుగా ఏర్పడ్డ అధికారులు సంక్షేమ గృహాలకు చేరుకుని రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. కొన్ని చోట్ల రికార్డుల్లో చూపిన సంఖ్యకు, విద్యార్థుల వాస్తవ సంఖ్యకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. కొన్ని హాస్టళ్ల వార్డెన్లు అందుబాటులో లేకపోవటంతో వారికి సమాచారం అందించారు.
Advertisement


