కందుకూరు: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పులిమామిడి-మహేశ్వరం రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారు జామున ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. మహేశ్వరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టింది. పొగ మంచు కారణంగా ముందు వెళ్తున్న వాహనం కనిపించక పోవడంతో ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ తెలిపాడు. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని హైదరాబాద్ తరలించారు. మిగతా ఇద్దరికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Related news
-
ప్రచారంపై ఫోకస్ పెంచిన ప్రధాన పార్టీలు..
సాక్షి,ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల సంగ్రామంలో ఆయాపార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నా యి. సీఎం రేవంత్రెడ్డి ఈ సెగ్మెంట్ పరిధిలో ఆది లాబాద్, ఆసిఫాబాద్లలో జరిగిన సభల్లో వ్యూహా త్మకంగా బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు గొడం నగేశ్, ఆత్రం సక్కును విమర్శించడం ద్వారా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.ఎంపీ సోయం బాపూరావు ప్రస్తావన కూ డా ఇందులో భాగమేనని చర్చించుకుంటున్నారు. మరోపక్క బీజేపీలో ఇటీవల ఎమ్మెల్యేలకు ఆయా పార్లమెంట్ ఇన్చార్జి బాధ్యతలు తొలగించిన తర్వాత వారంతా తమ నియోజకవర్గాల్లో ప్రచారంలో దూకుడు పెంచారు. ఒక విధంగా ఈ నిర్ణయం విభేదాలకు చెక్తో పాటు ప్రచారంలో స్పీడ్ పెంచేందుకు ఉపయోగపడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ మైనార్టీ ఓట్లపై దృష్టి సారించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.సీఎం ప్రసంగంలో ఎంపీ సోయం ప్రస్తావన..సీఎం రేవంత్రెడ్డి ఆసిఫాబాద్ బహిరంగ సభలో ఎంపీ సోయం బాపూరావు ప్రస్తావన తీసుకురావడం వ్యూహాత్మకమేనన్న చర్చ సాగుతుంది. సిట్టింగ్ ఎంపీ సోయంకు టికెట్ ఇవ్వకుండా బీజేపీ ఆయనను అవమానించిందన్నారు. అంతేకాకుండా పార్లమెంట్ నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలని కేంద్ర మంత్రుల చుట్టూ సోయం తిరిగినా వారు పట్టించుకోలేదని చెప్పారు. ప్రధానంగా సోయంకు ఆదివాసీ ఓటర్లలో పట్టు ఉంది.ఈ నేపథ్యంలో సీఎం వ్యూహాత్మకంగానే సోయం ప్రస్తావన తీసుకువచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంతేకాకుండా బీజేపీ అభ్యర్థి నగేశ్, బీఆర్ఎస్ అభ్యర్థి సక్కు ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ జిల్లా అభివృద్ధికి పాటుపడింది లేదని చెప్పడం ద్వారా విమర్శలు ఎక్కుపెట్టారు. ఇదిలా ఉంటే ఇటీవల మంత్రి సీతక్క, ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ నార్నూర్ మండలం కొత్తపల్లి–హెచ్లో బంజారా దీక్షభూమి వేదిక వద్ద ప్రసంగిస్తూ తాము లంబాడాలకు వ్యతిరేకం కాదని చెప్పడం ద్వారా ఆ ఓటర్లను ఆకట్టునే ప్రయత్నం చేశారు.అంతే కాకుండా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి పార్టీ పరంగా కో ఇన్చార్జీలను నియమించారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్తో పాటు ఏఐసీసీ సభ్యుడు నరేశ్ జాదవ్ నియామకం ఇందులో భాగమేనని తెలుస్తోంది. తద్వారా ఆ సామాజిక వర్గ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నమే ఈ చర్య అన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతుంది.బీజేపీలో విభేదాలు సమసినట్టేనా..బీజేపీలో ఎంపీ అభ్యర్థిగా నగేశ్ను ప్రకటించిన త ర్వాత పార్టీ ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదన్న విమర్శలు జోరుగా సాగాయి. ఎమ్మెల్యేలకు పార్లమెంట్ ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చిన తర్వాత వారి నియోజకవర్గాల్లో ఇతర నేతల జోక్యం పెరిగిందన్న భావం వ్యక్తమైందన్న ప్రచారం జరిగింది. పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లడంతో నష్ట నివారణ చర్యలకు దిగింది.ఇందులో భాగంగానే పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఆయా పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి బా ధ్యతల నుంచి తొలగించారు. ఈ పరిణామం తర్వా త ఆయా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రచార స్పీడ్ పెంచారు. ఒకవిధంగా ఇది పార్టీకి మంచి జరిగిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంతేకాకుండా నగేశ్ ఇటీవల ఖానాపూర్ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్తో కలిసి విస్తృతంగా తిరిగారు. ఇది లంబాడా ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాత్మక చర్య అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.ఎంఐఎం నేతను కలిసిన బీఆర్ఎస్ నాయకులు..బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుకు సంబంధించి ఈ పార్లమెంట్ సెగ్మెంట్లోని నియోజకవర్గాల్లో ఆయా నేతలు, కార్యకర్తలు విస్తృతంగా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.ఇటీవల మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్సీ దండే విఠల్తో కలిసి భైంసాలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ జాబిర్ అహ్మద్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా మైనార్టీ ఓటర్లను రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఆదివాసీ, లంబాడా ఓటర్లతో పాటు గిరిజనేతర ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. -
ఆ ముగ్గురి చేరిక నిలిపివేత!
ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆరేళ్లపాటు పార్టీ బహిష్కరణకు గురైన జిల్లా కేంద్రానికి చెందిన పీసీసీ మాజీ జనరల్ సెక్రెటరీ గండ్రత్ సుజాత, డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజీద్ఖాన్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లూరి సంజీవ్రెడ్డిల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.ఇటీవల జగ్గారెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న ఈ ముగ్గురు ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్రెడ్డిని కూడా కలిశారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించి పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన ఈ ముగ్గురు నాయకులను తిరిగి పార్టీలో చేర్చుకోవద్దంటూ కంది శ్రీనివాసరెడ్డి మద్దతుదారులు ఆందోళన చేపట్టారు.వెంటనే వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముగ్గురు నాయకుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీ దహనం చేయడంతో పాటు నోటికి నల్లగుడ్డలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను గమనించిన పార్టీ నాయకత్వం వారి చేరికలను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. దీంతో కంది వర్గీయుల పోరాటం ఫలించినట్లైందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షి ఆదేశాల మేరకు ఆ నాయకుల చేరికలను నిలిపివేస్తున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, చేరికల కమిటీమెంబర్ జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా నాయకత్వంతో చర్చించి త్వరలోనే తగు నిర్ణయం తీసుకుంటామని అప్పటి వరకు వారి చేరిక నిలిపివేస్తున్నట్లుగా అందులో పేర్కొన్నారు.ఇవి చదవండి: ప్రచారంపై ఫోకస్ పెంచిన ప్రధాన పార్టీలు.. -
‘ముందు రాయ్బరేలీ నుంచి గెలవండి’
లోక్సభ ఎన్నికల్లో ఎట్టకేలకు కాంగ్రెస్ కంచుకోట స్థానాలైన రాయ్బరేలీ, అమేథీ పార్లమెంట్ సెగ్మెంట్లలో ఆ పార్టీ తమ అభ్యర్థులు ప్రకటించింది. రాయ్బరేలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అమేథీలో కిషోర్ లాల్ శర్మను బరిలోకి దించింది. రాహుల్ గాంధీ తాను మూడు సార్లు గెలిచిన అమెథీని వదిలి రాయ్బరేలీ బరిలో దిగటంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. బీజేపీ నేతలే కాకుండా చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ సైతం రాహుల్గాంధీపై విమర్శలు చేశాడు. ‘గ్యారీ కాస్పరోవ్, విశ్వనాథ్ ఆనంద్ వంటి చెస్ ఆటగాళ్లు.. త్వరగా రిటైర్ అవటం మంచిదైంది. వారు.. ఒక చెస్ మెథావిని ఎదుర్కొవల్సిన అవసరం లేదు’ అని ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్కు.. ‘అగ్రస్థానం కోసం సవాల్ చేసే ముందు ముందు రాయ్బరేలీ నుంచి గెలివాలి’ అని రాహుల్ గాంధీని ఉద్దేశించి గ్యారీ కాస్పరోవ్ సెటైర్ వేశారు.Traditional dictates that you should first win from Raebareli before challenging for the top! 😂— Garry Kasparov (@Kasparov63) May 3, 2024మరోవైపు.. నటుడు రన్వీర్ షోరే స్పందిస్తూ.. ఈ పరిణామాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారని రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ వీడియోతో గ్యారీ కాస్పరోవ్ను ట్యాగ్ చేశారు. ‘భారత రాజకీయాల్లో నా చిన్న జోక్ ప్రభావితం చేయదని ఆశిస్తున్నా. అయితే నాకు నచ్చిన చెస్ ఆటలో మాత్రం రాజకీయ నాయకుడు (రాహల్ గాంధీ) ఆడటం చూడకుండా ఉండలేను!’ అని గ్యారీ కాస్పరోవ్ అన్నారు.Nice one, @Kasparov63, but can you handle this move? https://t.co/xrWFf3zLK9 pic.twitter.com/quuw4JGB43— Ranvir Shorey (@RanvirShorey) May 3, 2024రాహుల్ గాంధీ రాయ్బరేలీలో పోటీ చేయటంపై కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేష్ వివరణ ఇచ్చారు. ‘రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేయటంపై చాలా మందికి పలు అభిప్రాయాలు ఉంటాయి. అయితే అందరూ.. రాహుల్ గాంధీకి రాజకియాలతో పాటు చెస్ ఆట మీద చాలా పట్టుందని మర్చిపోవద్దు’ అని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. దీంతో ఆయన ట్వీట్పై బీజేపీ నేతలు, నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.Many people have many opinions on the news of @RahulGandhi contesting elections from Rae Bareli.Remember, he is an experienced player of politics and chess. The party leadership takes its decisions after much discussion, and as part of a larger strategy. This single decision…— Jairam Ramesh (@Jairam_Ramesh) May 3, 2024చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ను రష్యా ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. పుతిన్ ప్రభుత్వంపై ఆయన బహిరంగంగా విమర్శలు గుప్పించడమే దీనికి ప్రధాన కారణం. ప్రభుత్వ విధానాలను కాస్పరోవ్ వ్యతిరేకించడం వల్లే అధికారులు ఆయన్ను ఉగ్రవాదులు, తీవ్రవాదులు జాబితాలోకి చేర్చారు. చెస్లో పలుమార్లు వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన 60 ఏళ్ల గ్యారీ కాస్పరోవ్ చాలా కాలంగా పుతిన్ ప్రభుత్వంపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు. -
తాతా.. నీకు టాటా..
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు, తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయాలపై కాంగ్రెస్ పార్టీ తాజాగా మరో వీడియో విడుదల చేసింది. విభజన చట్టాల అమల్లో వైఫల్యం, వరంగల్, కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో నిర్లక్ష్యం, 2020లో హైదరాబా ద్లో వచ్చిన భారీ వరదలకు కేంద్రం ఎలాంటి సాయం చేయకపోవడం, ఐటీఐఆర్ లాంటి అనేక అంశాల్లో తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయాలను వీడియోలో పేర్కొంది. ‘పదేళ్ల తెలంగాణకు ద్రోహం చేసింది చాలు.. తాతా.. నీకు టాటా’ అంటూ రూపొందించిన వీడియోను శుక్రవారం విడుదల చేసింది. -
అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన కేంద్ర హోంమంత్రి అమిత్షా డీప్ఫేక్ వీడియో ఎక్కడ నుంచి వచ్చిందనే సందేహానికి తెరపడింది. ఆ ఫేక్ వీడియోను మొదట పోస్ట్ చేసినది తెలంగాణ నుంచేనంటూ ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ‘ఎక్స్’ (ట్విట్టర్) ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా ఢిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు. మొదట పోస్ట్ చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలని భావిస్తున్నారు. ఈ విషయంలో ‘ఎక్స్’ నుంచి మరింత సమాచారం కోసం వేచి చూస్తున్నారు.ల్యాండ్ లైన్ ఐపీ అడ్రస్ నుంచి..గత నెల 23న మెదక్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ గెలిస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ మాట్లాడినట్టు ఓ వీడియో ప్రత్యక్షమైంది. ఎక్స్, ఫేస్బుక్ ఖాతాల్లో అది వైరల్గా అయి దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు.. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దేశవ్యాప్తంగా నలుగురిని అరెస్టు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె సతీశ్, శివకుమార్ అంబాలా, నవీన్, ఆస్మా తస్లీంలకు నోటీసులు జారీ చేశారు.మరోవైపు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ముందు పోస్ట్ చేశారన్న దానిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎక్స్, ఫేస్బుక్లను స్పెషల్ సెల్ పోలీసులు ఆదేశించారు. ఈ మేరకు ప్రాథమిక నివేదిక ఇచ్చిన ‘ఎక్స్’ సంస్థ.. తొలుత ఆ వీడియో పోస్ట్ అయినది తెలంగాణ నుంచేనని వెల్లడించింది. ఒక ల్యాండ్లైన్ ఐపీ అడ్రస్ నుంచి ఈ వీడియో పోస్ట్ అయినట్టుగా పేర్కొంది. అయితే ఎవరు చేశారనేది ఇంకా వెల్లడించలేదు. దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు మళ్లీ ‘ఎక్స్’కు లేఖ రాశారు. కచ్చితంగా ఎవరి ఐపీ అడ్రస్ నుంచి వచ్చింది? ఎక్స్లో పోస్ట్ చేసిన తర్వాత ఎంతమంది వీక్షించారు? ఎవరెవరు షేర్ చేశారు? కామెంట్లు/లైకులు తదితర సమగ్ర వివరాలు ఇవ్వాలని కోరారు. ‘ఎక్స్’ సంస్థ ఒకట్రెండు రోజుల్లో సమగ్ర నివేదిక అందించే అవకాశం ఉంది.
Related News by category
-
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎస్ఐటీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావునే ప్రధాన నిందితుడిగా చేర్చుతూ కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారు.కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుతో పాటుగా మరో ప్రైవేటు వ్యక్తిని కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఇక, ప్రభాకర్ రావుతో పాటుగా సదరు ప్రైవేటు వ్యక్తి కూడా పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే జరిగిందని పోలీసులు తేల్చారు.మరోవైపు.. ఎస్ఐబీలో హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడంలో కూడా ప్రభాకర్ రావే ప్రధాని సూత్రధారి అని పోలీసులు వెల్లడించారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. అలాగే, ప్రభాకర్ రావు చెప్పిన నంబర్లను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్టు చెప్పారు. ఇక, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారని అన్నారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో ఇప్పటికే ప్రభాకర్ రావుకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
జగిత్యాలరూరల్: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ రాంబాబు ఆదేశించారు. శుక్రవారం జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయాధికారులు ధ్రువీకరించిన ధాన్యాన్ని వెనువెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.కార్యక్రమంలో సహకార సంఘం సీఈవో గాజంగి వేణు, సెంటర్ ఇన్చార్జి ప్రేమ్నాథ్ పాల్గొన్నారు.అంజన్న ఆదాయం రూ.88 లక్షలుకొండగట్టు(చొప్పదండి): కొండగట్టు అంజన్న ఆలయ హుండీలను శుక్రవారం ఈవో చంద్రశేఖర్ సమక్షంలో లెక్కించారు. ఈసందర్భంగా 36 రోజులకుగాను రూ.88,03,608 నగదు, 41 గ్రాముల మిశ్రమ బంగారం, 2.15 కిలోల వెండి, 27 విదేశీ కరెన్సీ నోట్లు సమకూరాయి. దేవాదాయ శాఖ వరంగల్ కార్యాలయ పరిశీలకులు ఎన్.కవిత, ఏఈవో అంజయ్య, సూపరింటెండెంట్లు సునీల్, శ్రీనివాసశర్మ తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ సిబ్బందికి వసతులు కల్పించండికోరుట్ల: వేసవి దృష్ట్యా పోలింగ్ సిబ్బందికి మెరుగైన వసతులు కల్పించాలని తపస్ నాయకులు శుక్రవారం ఆర్డీవో, కోరుట్ల నియోజకవర్గ సహాయ ఎన్నికల అధికారి ఆనంద్కుమార్కు వినతిపత్రం సమర్పించారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున వేడిని తట్టుకునేందుకు పోలింగ్ కేంద్రాల్లో కూలర్లు ఏర్పాటు చేయాలని, సరైన రవాణా సౌకర్యం కల్పించి, నిబంధనలకు అనుగునంగా రెమ్యునరేషన్ చెల్లించాలని కోరారు. ఎన్నికల హాజరు ధ్రువీకరణ పత్రాలు వెంటనే అందించాలని, పోలింగ్ సమయం పెంచినందున ఒక రోజు అదనపు జీతభత్యం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవయ్య, ఉపాధ్యక్షుడు చెరకు మహేశ్వరశర్మ, మండల నాయకులు కె.శ్రీనివాస్, అన్నల్దాస్, మురళి, మల్లికార్జున్, రాజేశ్వర్రావు, రమేశ్, రజనీకాంత్, సురేందర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇంటి వద్దే ఓటేశారుకథలాపూర్/ఇబ్రహీంపట్నం: కథలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచి ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకోగా, శుక్రవారం అధికారులు వారి ఇళ్ల వద్దకు వెళ్లారు. ఓటరు ఇళ్ల వద్ద ఓటు వేసేలా ఏర్పాట్లు చేసి పోస్టల్ బ్యాలెట్లను సేకరించారు. మండలంలో 30 మంది దరఖాస్తు చేసుకోగా రెండు రోజుల్లో ఓటు వేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ నాగేశ్, పోలింగ్ అధికారులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు పాల్గొన్నారు. అలాగే ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాల్లో 48 మంది నడవలేని స్థితిలో ఉన్న వికలాంగులు, 14 మంది 85 ఏళ్లు పైబడి నడవలేని స్థితిలో ఉన్నవారికి 3 బృందాలుగా వెళ్లి ఓటు హక్కు కల్పించినట్లు తహసీల్దార్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐ గంగాధర్, జూనియర్ అసిస్టెంట్ లావణ్య, బీఎల్వోలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
అదనపు ఈవీఎం అవసరమే..
● మొదట ఒకటే ఈవీఎం అంచనా ● అభ్యర్థుల సంఖ్య పెరగడంతో మరో ఓటింగ్ మిషన్ కోసం కసరత్తు కోరుట్ల: నిజామాబాద్ పార్లమెంట్ బరిలో ఉన్న అభ్యర్థులు 29 మంది కావడంతో ఒక్క ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్తో సరిపెట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. మొదట బరిలో ఉండే అభ్యర్థుల సంఖ్య 16 వరకు ఉంటుందని ఎన్నికల అధికార యంత్రాంగం అంచనా వేసి తమ తమ సెగ్మెంట్ల పరిధిలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక ఈవీఎం చొప్పున తెప్పించుకుని భద్రపరిచారు. ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పోటీ చేస్తున్న అభ్యర్థులు 29 మంది కావడంతో మరో ఈవీఎం అవసరమైంది. ఈవీఎంల సర్దుబాటు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల నియోజకవర్గంలో 254, కోరుట్ల నియోజకవర్గంలో 262 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక్కో ఈవీఎం చొప్పున అందుబాటులో ఉంచాలి. పోలింగ్ రోజు ఈవీఎంలో సాంకేతిక లోపాలతో పనిచేయని పరిస్థితి తలెత్తితే అక్కడ వేరే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అమర్చడానికి వీలుగా అదనంగా 20 శాతం లెక్కన జగిత్యాల సెగ్మెంట్లో 315, కోరుట్ల సెగ్మెంట్లలో 327 ఈవీఎంలు అందుబాటులో ఉంచారు. అభ్యర్థుల సంఖ్య 16 లోపు ఉంటే ప్రస్తుతం ఉన్న ఈవీఎంలు సరిపోయేవి. కానీ అభ్యర్థుల సంఖ్య 29 కావడంతో ఒక్కో పోలింగ్ బూత్లో 2 ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. రెట్టింపు ఈవీఎంలు పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య పెరగడంతో ఒక్కో పోలింగ్ కేంద్రంలో 2 ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఈ లెక్కన కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లో 654, జగిత్యాలలో 640 ఈవీఎంలు అవసరముంటాయి. దీంతో ఈవీఎంల ను జగిత్యాల, కోరుట్ల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు తరలించడానికి అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల అ ధికారులు పూర్తి చేశారు. వీటిలో పాటు కోరుట్ల సె గ్మెంట్లో 366 కంట్రోల్ యూనిట్లు (సీయూ), జగి త్యాల సెగ్మెంట్లో 350 కంట్రోల్ యూనిట్లను ఇప్పటికే భద్రపరిచారు. సాధారణంగా పోలింగ్ సమయంలో సాంకేతిక లోపాలు తలెత్తడానికి ఈవీఎంల కంటే కంట్రోల్ యూనిట్లకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలో పోలింగ్ బూత్కు ఒకటి సరిపోయే కంట్రోల్ యూనిట్లను 150 శాతం అదనంగా అందుబాటులో ఉంచుతున్నారు. -
ట్యాంకు ఉన్నా.. తాగు నీరేది?
● భగీరథ నీళ్లు ఎరుగని కలిగోట తండా ● ఏళ్లుగా విన్నవించినా ఫలితం లేదంటున్న గ్రామస్తులు కథలాపూర్(వేములవాడ): తలాపున గోదావరి ఉన్నా తాగేందుకు గుక్కెడు నీరు కరువు అన్న చందనంగా ఉంది కథలాపూర్ మండలం కలిగోట గిరిజన తండావాసుల పరిస్థితి. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ మంచినీళ్లు ఇస్తున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా పేర్కొంటున్నా కలిగోట గిరిజన తండాకు ఇప్పటి వరకు నీళ్లు రావడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. భగీరథ ద్వారా నల్లా నీళ్లు ఇవ్వాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు ఏళ్లుగా విన్నవించినా పట్టించుకునేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనెక్షన్లు ఇవ్వని అధికారులు వేములవాడ నియోజకవర్గం కథలాపూర్, మేడిపెల్లి, బీమారం మండలాల్లోని గ్రామాలకు భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నీరు సరఫరా చేసేందుకు కలిగోట తండాలోనే బ్యాలెన్స్ రిజర్వాయర్ ట్యాంక్ నిర్మించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆగ్రహారం నుంచి పైపులైన్ ద్వారా నీళ్లు వచ్చి ఈ ట్యాంకులోకి చేరేలా పైపులైన్ ఏర్పాటు చేశారు. కలిగోట తండాలో నిర్మించిన రిజర్వాయర్ ట్యాంక్ నుంచి 3 మండలాలకు తాగునీరు సరఫరా చేస్తారు. కానీ తండాలోని సుమారు 60 కుటుంబాలకు తాగునీరు ఇచ్చేందుకు ప్రత్యేకంగా పైపులైన్ వేయలేదు. దీంతో భగీరథ నీరు అందడం ఐదేళ్లుగా కలగానే మిగిలిందని వాపోతున్నారు. ఫలితంగా తండావాసులు తాగేందుకు బోరుబావుల నీరే దిక్కయింది. ఇప్పటికై నా పాలకులు చొరవచూపి భగీరథ నీళ్లు అందేలా చూడాలని కోరుతున్నారు. -
బోరుబావులే దిక్కు
మా తండాలో భగీరథ పథకం పైపులైన్ కనెక్షన్లు ఇవ్వలేదు. ఇంటి అవసరాలకు బోరుబావుల నీళ్లు వాడుతున్నాం. వేరే గ్రామాల్లో భగీరథ నీళ్లు అంటూ సంబరపడుతున్నారు. భగీరథ నీళ్లు ఎట్లుంటాయో మా తండావాసులు ఇప్పటికీ చూడలేదు. అన్ని పార్టీల నాయకులు మా తండా నుంచి వెళ్తుంటారు. కానీ నల్లా నీళ్ల సమస్యను ఏళ్లుగా పరిష్కరించలేదు. ఈ ప్రభుత్వం పట్టించుకోవాలి. – ధరావత్ అమ్మి, కలిగోట తండాఎవరూ పట్టించుకునేటోళ్లు లేరు కోరుట్ల– వేములవాడ రోడ్డు పక్కనే మా తండా ఉంది. పెద్ద ట్యాంక్ నిర్మించడానికి, పైపులు వేసేందుకు తండాకు చెందిన 20 గుంటల భూమి ఇచ్చాం. మాకు తాగునీళ్లు వస్తాయని అనుకున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేదు. ఇప్పుడైనా నల్లా నీళ్లు సరఫరా చేయాలి. – ధరావత్ సీతారాం, మాజీ వార్డుమెంబర్, కలిగోట తండా ప్రత్యేక ట్యాంక్ నిర్మిస్తేనే.. మూడు మండలాలకు నీళ్లు సరఫరా చేసే బ్యాలెన్స్ రిజర్వాయర్ ట్యాంక్ కలిగోట తండాలోనే నిర్మించాం. తండా కోసం ప్రత్యేకంగా ట్యాంక్ నిర్మిస్తే అందులో భగీరథ నీళ్లు నింపుతాం. ఆ ట్యాంక్ నుంచి ఇంటింటికీ నీరు సరఫరా చేసుకోవచ్చు. రిజర్వాయర్ ట్యాంక్ నుంచి నేరుగా నల్లా కనెక్షన్లు ఇవ్వరాదు. – అనిల్, మిషన్ భగీరథ గ్రిడ్ ఏఈ
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
మండుటెండను లెక్కచేయని అభిమానం..!
పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీ..ఎంతంటే..
మరోసారి పీఠమెక్కేదెవరో..?
విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు
వారెవ్వా... బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో నాని.. ఫ్యాన్స్ ఫిదా
ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!
హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు
అసలు ఇది చాలు! వీళ్లకు ఓటేయకుండా ఉండటానికి!
అంతా బాబే చేశారు
Photos
View allVideo
View allతప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement