-
‘అష్ట’కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నుంచి ఎమ్మెల్యేల ఫిరాయింపుల పర్వం కొనసాగుతోంది. గులాబీ ఎమ్మెల్యేలు వరుసగా అధికార కాంగ్రెస్లో చేరుతున్నారు. రాబోయే రోజుల్లో తమ పారీ్టలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు మరింత వేగవంతం అవుతాయని కాంగ్రెస్ శిబిరం ప్రచారం చేస్తోంది. మరోవైపు పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగినా వలసలకు అడ్డుకట్ట పడటం లేదని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.గతంలో చేసిన పనుల బిల్లుల కోసం, వ్యాపారాలపై దాడులు, కేసుల బెదిరింపులతోనే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని ఆరోపిస్తున్నాయి. దీనికితోడు ఈ అసెంబ్లీ సమావేశాల్లోగా బీఆర్ఎస్ శాసనసభాపక్షం కాంగ్రెస్లో విలీనం అవుతుందంటూ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపుతున్నాయి. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వలసల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వరుసగా వలసల బాట! గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున 39 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓటమితో ఈ సంఖ్య 38కి చేరింది. ఇక గత ఆరు నెలల్లో బీఆర్ఎస్ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. తాజాగా రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాం«దీ, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు చేరిక ఖరారు కాగా... హైదరాబాద్ నగరానికి చెందిన మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. శాసనసభాపక్షం విలీనంపై చర్చ నిబంధనల ప్రకారం.. బీఆర్ఎస్ సంఖ్యాబలంలో మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితే బీఆర్ఎస్ శాసనసభాపక్షం అందులో విలీనమైనట్టు పరిగణిస్తారు. 2014–18 మధ్యలో టీడీపీ శాసనసభాపక్షం, 2018–23 మధ్యలో కాంగ్రెస్ శాసనసభాపక్షం ఇదే తరహాలో బీఆర్ఎస్లో విలీనమయ్యాయి. ఈ నిబంధన ప్రకారం బీఆర్ఎస్ నుంచి కనీసం 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితే.. శాసనసభాపక్షం విలీనమైనట్టుగా పరిగణిస్తారు.ఇప్పటికే 9 మంది కాంగ్రెస్లో చేరడం, మరొకరు చేరికకు సిద్ధమైన నేపథ్యంలో.. ఇంకో 16 మంది బీఆర్ఎస్ నుంచి ఫిరాయించాల్సి ఉంటుంది. అయితే బీఆర్ఎస్కు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలోనే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఈ ఉమ్మడి జిల్లాల నుంచే ఫిరాయింపులు ఎక్కువగా ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. కట్టడి కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడంతో.. మిగతా వారిని కట్టడి చేసేందుకు గులాబీ పారీ్టలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ సర్కారులో అధికారం అనుభవించిన కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్రెడ్డిలతోపాటు కేసీఆర్కు సన్నిహితుడైన ఎం.సంజయ్ వంటి నేతలు కూడా వీడటంపై చర్చ జరుగుతోంది. దీంతో పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి.. పక్షం రోజుల క్రితం ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.వారికి విందు ఇచ్చి.. పారీ్టలో కొనసాగితే కలిగే ప్రయోజనాలు, భవిష్యత్తుపై భరోసా కలి్పంచే ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలు తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరగా.. కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఓ ఎమ్మెల్యే తన కారు మరమ్మతుకు అయ్యే ఖర్చులను తీసుకుని కూడా పార్టీ మారారని ప్రచారం జరుగుతోంది. మరింత మంది బీఆర్ఎస్ను వీడనున్నారన్న ప్రచారం నేపథ్యంలో.. పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మరోమారు వ్యక్తిగతంగా భేటీకానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రలోభాలు, బెదిరింపులను ప్రస్తావిస్తూ..!! పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు తమకు అధికార పార్టీ నుంచి వస్తున్న ఒత్తిళ్లు, బెదిరింపులను కేసీఆర్కు ఏకరువు పెడుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. గతంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడం, కుటుంబ సభ్యుల వ్యాపారాలపై దాడులు, కేసులు పెడతామనే బెదిరింపులు వంటి కారణాలతో పార్టీ మారక తప్పడం లేదని అంటున్నారని పేర్కొంటున్నాయి. నగర శివార్లలోని ఓ ఎమ్మెల్యే కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులను వారు గుర్తు చేస్తున్నారని వివరిస్తున్నాయి. న్యాయ పోరాటం.. ప్రజల మధ్యకు.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్.. అసెంబ్లీ వేదికగా కొట్లాడాలని నిర్ణయించింది. మరోవైపు రాష్ట్రపతి, గవర్నర్లను కలసి అసెంబ్లీ స్పీకర్, కాంగ్రెస్ వైఖరిని వివరించాలని.. అనర్హత వేటుపై స్పందించాల్సిందిగా కోరాలని భావిస్తోంది. రాష్ట్రపతి ఎదుట పార్టీ ఎమ్మెల్యేలతో పరేడ్ చేయించేందుకూ సన్నద్ధమవుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కేసీఆర్ స్వయంగా పర్యటించి.. ఆ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ తీరును ఎండగట్టాలనే వ్యూహాన్ని కూడా సిద్ధం చేస్తున్నట్టు బీఆర్ఎస్ కీలక నేత ఒకరు వెల్లడించారు. -
2028లో గెలుపు మనదే!
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ నంబర్వన్ పార్టీగా మారడం ఖాయమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై నిరంతర పోరాటాల ద్వారా కాంగ్రెస్, బీఅర్ఎస్కు నిద్ర పట్టకుండా చేసి.. ఆ పారీ్టల అక్రమాలపై పోరాటాలతో బీజేపీ తప్పకుండా నంబర్వన్ స్థానానికి చేరుతుందని ఆయన స్పష్టం చేశారు.రానున్న 1,500 రోజుల్లో (రివర్స్ ప్లానింగ్) ప్రజా పోరాటాల ద్వారా ఇక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. ఇందుకు అనుగుణంగా పార్టీ వద్ద 1,500 రోజుల ప్రణాళిక సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సామాన్య కార్యకర్త సీఎం అయ్యే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు.శుక్రవారం శంషాబాద్లో జరిగిన బీజేపీ రాష్ట్ర విస్తృత కార్యవర్గం ముగింపు సమావేశంలో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ విరోధిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పిన ధర్మేంద్ర.. నాడు ప్రత్యేక తెలంగాణ కోసం బీజేపీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. అదేవిధంగా గత పదేళ్లుగా తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తూనే ఉందన్నారు. దక్షిణాది సీట్లతోనే మూడోసారి మోదీ సర్కార్ తెలంగాణ, ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిన సీట్లతో మరింత బలం చేకూరడంతోనే మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పడిందని ధర్మేంద్ర చెప్పారు. ‘ఎనిమిది ఎంపీ స్థానాల్లో గెలిస్తేనే ప్రధాని కావాలని కొందరు కలలు కంటుంటారు. అలాంటిది తెలంగాణ నుంచి పార్టీ సొంతంగా 8 సీట్లను గెలవడం మామూలు విజయం కాదు.. ఇందుకు ఓటర్లకు కృతజ్ఞతలు. లోక్సభ ఎన్నికలతో బీజేపీ ఉత్తరాది పార్టీ అనే అపవాదు తొలగింది. దక్షిణ భారతంలో బీజేపీ మరింత బలపడింది. కొత్త శకం మొదలైంది. కేరళలో బీజేపీ ఖాతా తెరిచింది. తమిళనాడు లో మెరుగైన ఓటు బ్యాంక్ సాధించాం’’అని ఆయన అన్నారు. రాజ్యాంగం మార్చం.. రిజర్వేషన్లను ఎత్తివేయం ‘పార్లమెంట్ ఎన్నికల్లో మూడోసారి కూడా కాంగ్రెస్ పారీ్టకి వంద సీట్లు దాటలేదు. 13 రాష్ట్రాల్లో అసలు కాంగ్రెస్ ఖాతానే తెరవలేదు. అయినా కాంగ్రెస్ నాయకుల తీరు మారలేదు. అహంకారంగా మాట్లాడుతున్నారు. రాజ్యాంగాన్ని పదే పదే అవమానించే కాంగ్రెస్నేతలు, రాహుల్గాంధీ ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. బీజేపీపై దు్రష్పచారం చేస్తున్నారు.. ఎన్డీఏ అధికారంలో ఉన్నన్ని రోజులూ రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదు. రాజ్యాంగానికి ఎలాంటి హానీ జరగదని మేమంతా సామూహికంగా వాగ్దానం చేస్తున్నాం బీజేపీ అధికారంలో ఉండగా రిజర్వేషన్లకూ ఎటువంటి ఢోకా లేదు’అని ధర్మేంద్ర స్పష్టం చేశారు. -
కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ గూటికి చేరారు. సీఎం రేవంత్ సమక్షంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే హస్తం పార్టీలో చేరిపోయారు. దీంతో, కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంఖ్య ఎనిమిదికి చేరింది.కాగా, రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ హస్తం పార్టీలోకి ఆహ్వానించారు. ఇక, తాజాగా ప్రకాశ్ గౌడ్ చేరికతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన వారి సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. మరోవైపు.. రేపు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఇంకా పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. -
నా టార్గెట్ నెరవేరింది.. కానీ, కేసీఆర్ మాత్రం: రాజగోపాల్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తన ఏకైక లక్ష్యం నెరవేరిందన్నారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇదే సమయంలో తెలంగాణలో జైలుకు వెళ్లే నేతలను తాము కాంగ్రెస్లో పార్టీలో చేర్చుకోము అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.కాగా, నేడు(శుక్రవారం) కాంగ్రెస్ నేతలు కురియన్ కమిటీని కలిశారు. అనంతరం, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..‘కురియన్ కమిటీని కలిశాను. పార్లమెంట్ ఎన్నికలు ఏవిధంగా జరిగాయని అడిగారు. భువనగిరి ఇంఛార్జ్గా భారీ మెజార్టీతో గెలిపించానని చెప్పాను. భువనగిరిలో బీజేపీ గెలుస్తుందనే టాక్ ఉంది. కానీ, నేను ఇంఛార్జ్గా వెళ్లిన తర్వాత కాంగ్రెస్ విజయం సాధించింది. ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక అభ్యర్థి అందరం కలిసికట్టుగా పనిచేశాము. రెండు లక్షల మెజార్టీ వచ్చిందని చెప్పాను అని అన్నారు.ఇదే సమయంలో రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ.. తెలంగాణలో నా ఏకైక లక్ష్యం నెరవేరింది. నాకు ఇంకో లక్ష్యం ఉంది.. కేసీఆర్ను జైలుకు పంపడమే. బీఆర్ఎస్ సమాధి అయ్యింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. బీఆర్ఎస్ కుటుంబ పార్టీ. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్వైపు చూస్తున్నారు. కాంగ్రెస్లో అందరికీ స్వేచ్చ ఉంటుంది. బీఆర్ఎస్లో ఎవ్వరూ ఉండరు. హరీష్ రావు బీజేపీలోకి వెళ్లేందుకు రెడీగా ఉన్నాడు. జగదీష్ రెడ్డిని మేము కాంగ్రెస్లో చేర్చుకోము. ఆయన జైలుకు వెళ్లే వ్యక్తి. జైలుకు వెళ్లే వారిని ఎవరిని మేము కాంగ్రెస్లో చేర్చుకోము’ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
‘పంచాయతీ ఎన్నికల వాయిదా కోసం కాంగ్రెస్ కొత్త డ్రామాలు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంతో ఏమీ మార్పు లేదన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ప్రతిపక్షంలో ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను అరెస్ట్ చేయడం వెనుక ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు.కాగా, నేడు హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం, రఘునందన్ మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో చెప్పిన హామీల అమలులో వైఫల్యంపై పోరాటం చేయాలని రాజకీయ తీర్మానం చేశాం. రైతులకు రైతుభరోసా రూ.15వేలు ఇస్తామని చెప్పారు.. ఇప్పటి వరకు ఇవ్వలేదు. గ్రూప్-1 పోస్టుల్లో అదనంగా కేవలం 60 పోస్టులు మాత్రమే ఇచ్చారు. ఒక పరీక్షకు మరో పరీక్షకు 30 రోజుల గడువు ఇవ్వాలని కోరితే ప్రతిపక్షాలు పనిలేక చేస్తున్నాయని విమర్శించడం సిగ్గుచేటు.కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారు. డీఎస్సీ ఒక నెల రోజుల పాటు వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు. మేము వారికి మద్దతు ఇస్తున్నాము. నెలకు నాలుగు లక్షల నెల జీతం ఏడు మాసాలుగా రేవంత్ రెడ్డి తీసుకుంటున్నారు. నాలుగు వేల నిరుద్యోగ భృతి మాత్రం ఇవ్వడం లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ను అరెస్ట్ చేయడం వెనుక ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు?. అధికారులను అరెస్ట్ చేస్తున్నారు.. పనులు చేయించిన అప్పటి మంత్రులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?. ఒక్కో మంత్రి ఒక్కో ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.ధరణి పరిస్థితి ఏంటి?. ధరణి పేరు మీద లక్షల ఎకరాలు గత ప్రభుత్వ పెద్దలు తిన్నారు. ఈ ప్రభుత్వం కూడా అదే పనిచేస్తోంది. పీసీసీ అధ్యక్షుడు ఎవరో తేల్చడానికి, మంత్రి పదవులు భర్తీ కోసం ఢిల్లీకి వారం రోజులుగా వెళ్లున్నారు. పంచాయతీల కాల పరిమితి ముగిసింది. వెంటనే ఎన్నికలు జరపాలి. కులగణన త్వరితగతిన పూర్తి చేయాలి. ఎన్నికలు వాయిదా వేసేందుకు డ్రామాలు చేస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు నెలకు 1200 కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నారు. ఆ ఇళ్లను వెంటనే పేదలకు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. -
బీఆర్ఎస్లో మిగిలే ఆ నలుగురు ఎవరో వారే చెప్పాలి: మంత్రి శ్రీధర్ బాబు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ అయ్యింది. బీఆర్ఎస్కు చెందిన పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హస్తం పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు.. బీఆర్ఎస్కు కౌంటరిచ్చారు.ఇక, తాజాగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ..‘పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదు. పార్టీలోకి చేరుతాం అంటే ఎవరైనా వద్దంటారా?. ఫిరాయింపులను ప్రోత్సహించాలని మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. గతంలో బీఆర్ఎస్ వేరే రకంగా చేరికలకు పాల్పడింది. భయపెట్టి మా పార్టీ ఎమ్మెల్యేలను అప్పుడు బీఆర్ఎస్లో చేర్చుకున్నారు.కానీ, ఇప్పుడు మేము ఎవరిని బెదిరించడం లేదు. వారికి వారే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ప్రజలకు సేవ చేస్తున్న కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు వస్తున్నారు. నైతికంగా బీఆర్ఎస్కు ఇప్పుడు మమ్మల్ని అడిగే హక్కు, మా గురించి మాట్లాడే హక్కు లేదు. సంక్షేమం, అభివృద్ధిలో చెప్పిన పని చేస్తున్న కాంగ్రెస్ పార్టీలోకి పాత్రదారులుగా ఉండేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నారు. బీఆర్ఎస్లో మిగిలే ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరో ఆ పార్టీ నేతలే చెప్పాలి’ అని కామెంట్స్ చేశారు. -
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య లోకల్-నాన్ లోకల్ ఫైట్..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బోరబండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య లోకల్, నాన్ లోకల్ అంటూ మాటల యుద్ధం నెలకొంది. దీంతో, రాజకీయం వేడెక్కింది.వివరాల ప్రకారం.. బోరబండ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య లోకల్, నాన్ లోకల్ అంటూ మాటల యుద్ధం జరిగింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వర్గీయులు గొడవకు దిగారు. కాగా, బస్తీ ఎలక్షన్ విషయంలో ఈ ఘర్షణ చెలరేగినట్లు తెలుస్తోంది. ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకున్నట్టు సమాచారం. -
రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ''మనకు పనికిమాలిన ప్రభుత్వం అవగాహన లేని నాయకత్వం ఉన్నప్పుడు ఇదే జరుగుతుంది'' అంటూ ఎక్స్(ట్విటర్) వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.నల్లగండ్ల, గోపన్పల్లి, తెల్లాపూర్, చందానగర్ చుట్టుపక్కల వాసులకు ఉపశమనం కలిగించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన గోపన్పల్లి ఫ్లైఓవర్ కొన్ని నెలల క్రితం పూర్తయింది. కానీ నేటికీ, ఇది ప్రారంభోత్సవం కోసం వేచి ఉంది, ఎందుకంటే ఢిల్లీలోని ఉన్నతాధికారులు, బీఆర్ఎస్ శాసనసభ్యుల ఇళ్ల మధ్య సీఎం బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సౌలభ్యం కంటే తమ వ్యక్తిగత ప్రజాప్రతినిధులే ముఖ్యమని భావిస్తోంది'' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.సంబంధిత అధికారులు తక్షణమే ఈ ఫ్లై ఓవర్ను ప్రజల ఉపయోగం కోసం తెరవాలని నేను కోరుతున్నాను.. లేదంటే ప్రజలు స్వయంగా దానిని ప్రారంభిస్తారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్పై కిషన్రెడ్డి ఫైర్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని తప్పుడు ప్రచారం చేసి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లో శుక్రవారం(జులై 12) జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో కిషన్రెడ్డి మాట్లాడారు. ‘లోక్ సభ ఎన్నికల్లో అమిత్ షా వీడియో మార్ఫింగ్ చేసి కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసింది. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలనే నమ్ముకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పారు. రెండు వందల రోజులు గడుస్తున్నా హామీలను అమలు చేయడం లేదు. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. బీఆర్ఎస్ తరహాలోనే పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ ప్రోత్సహిస్తోంది. తెలంగాణను దోచుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి డబ్బులు పంపిస్తోంది. పాంచ్ న్యాయం పేరిట పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేది లేదని మేనిఫెస్టోలో పెట్టారు. చేతల్లో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో ఎప్పుడు లేనంతగా బీజేపీ ఓటింగ్ శాతం పెరిగింది. పదేళ్ల పాటు అధికారంలో అన్న బీఆర్ఎస్ ఒక్క లోక్ సభ సీటు కూడా గెలవలేకపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో 46 అసెంబ్లీ స్థానాల్లో మొదటి స్థానంలో బీజేపీ నిలిచింది. 44 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ పార్టీ కేవలం మూడు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే మొదటి స్థానంలో వచ్చింది.కాంగ్రెస్, బీఆర్ఎస్లది ఒకటే డీఎన్ఏ. నాణేనికి బొమ్మ, బొరుసులలా రెండూ అవినీతి పార్టీలే. మజ్లీస్ పార్టీ నేతలు కనిపిస్తే వంగి వంగి సలాంలు కొట్టే పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్. బీజేపీని విమర్శించే అర్హత కాంగ్రెస్, బీఆర్ఎస్లకు లేదు. ఎంఐఎం అధినేత పార్లమెంట్లో జై భారత్ మాతా అనకుండా.. జై పాలస్తీనా అనడం సిగ్గు చేటు. అలాంటి పార్టీతో కాంగ్రెస్ అంటకాగుతోంది. నీళ్ళు ఏవో... పాలు ఏవో .. ప్రజలు అర్థం చేసుకోవాలి’అని కిషన్రెడ్డి కోరారు. -
త్వరలో బీఆర్ఎస్ఎల్పీ విలీనం: దానం నాగేందర్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుస పెట్టి కాంగ్రెస్లో చేరుతుండటంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై శుక్రవారం(జులై 12) మీడియాతో దానం నాగేందర్ మాట్లాడారు. ‘రెండు రోజుల్లో మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కాంగ్రెస్లో చేరుతారు. పదిహేను రోజుల్లో బీఆర్ఎస్ శాసనసభాపక్షాన్ని కాంగ్రెస్లో విలీనం చేసుకుంటాం. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసిన అక్రమాలు వెలికి తీస్తాం. కేటీఆర్ ఫ్రెండ్స్ కథలన్నీ బయటపెడతా. గుండు శ్రీధర్, సత్యం రామలింగరాజు కొడుకుతో పాటు రాజేష్ రాజు లాంటి వాళ్ళు ఎన్ని వందల కోట్లు సంపాదించారు. లెక్కలన్నీ బయటకు తీస్తాం’అని హెచ్చరించారు. -
అసలు ఉన్నట్టా? లేనట్టా?.. సీఎం రేవంత్కి హరీష్ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆగమ్య గోచరంగా మారిందంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మాజీ మంత్రి హరీష్రావు బహిరంగ లేఖ రాశారు. ''రాష్ట్రంలోని పేద బ్రాహ్మణుల అభ్యున్నతికి ఆర్థిక మద్దతును అందించాలని సహృదయంతో కేసీఆర్ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ను ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిషత్ పరిస్థితి అగమ్యగోచరం కావడం బాధాకరం. విద్య, స్వయం ఉపాధి, వేద విద్యకు ప్రోత్సాహం కోసం అమలు చేసిన వివిధ పథకాలు ఆగిపోవడం విచారకరం. అసలు బ్రాహ్మణ పరిషత్ ఉన్నట్టా? లేనట్టా?'' అంటూ హరీష్రావు ప్రశ్నించారు.సీఎంగా కేసీఆర్.. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కోసం ఏటా రూ.100కోట్లు క్రమం తప్పకుండా కేటాయించారని లేఖలో పేర్కొన్న హరీష్రావు.. పలు డిమాండ్లను ప్రస్తావించారు. ‘‘బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు గతంలో లాగానే నిధులు విడుదల చేయాలి. వార్షిక బడ్జెట్ లో ఏటా వంద కోట్లు కేటాయించాలి. బ్రాహ్మణ పరిషత్ పాలకవర్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. విదేశీ విద్య పథకానికి దరఖాస్తు చేసుకొని, ఎంపికైన 300 మంది విద్యార్థులు ఇప్పటికే విదేశాల్లో చదువుతున్నారు. రూ.30 కోట్ల నిధులు తక్షణమే విడుదల చేయాలి'' అని కోరారు.బ్రాహ్మణ ఎంటర్ ప్రెన్యూయల్ స్కీం ఆఫ్ తెలంగాణ (బెస్ట్) కింద దరఖాస్తు చేసుకొని, ఎంపికైన 497 మందికి సంబంధించిన రూ.16 కోట్లు విడుదల చేయాలి. 706 మందికి ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తి చేసి, 2023-24 సంవత్సరానికి దరఖాస్తు చేసుకున్న 1869 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించాలి'' అని హరీష్రావు డిమాండ్ చేశారు. -
బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్లోకి ఎమ్మెల్సీ నవీన్కుమార్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నారు.ఇప్పటికే ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరగా.. 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేరారు. కాంగ్రెస్ గూటికి మరో ఎమ్మెల్సీ నవీన్కుమార్ చేరనున్నారు. త్వరలో సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరడానికి రెడీ అయినట్లు సమాచారం. కాగా, కాంగ్రెస్లో చేరేందుకు మరో ఎమ్మెల్యే రెడీ అయ్యారు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ప్రకాశ్ గౌడ్ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. -
మాకు ఆ గౌరవం ఏదీ? ప్రొటోకాల్పై మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: తాము అత్యున్నత రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నా అధికారులు కనీసంప్రొటోకాల్ పాటించడం లేదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాల పర్యటనకు వెళ్తున్న సందర్భాల్లో ప్రొటోకాల్ నిబంధనల మేరకు తమను గౌరవించడం లేదన్నారు. శాసనసభ ప్రాంగణంలో మండలి చైర్మన్ గుత్తా, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నతాధికారులతో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రొటోకాల్ అంశంలో తాము ఎదుర్కొంటున్న సమస్యల జాబితాను వివరించారు. అనంతరం డీజీపీ జితేందర్, ఇతర పోలీసు ఉన్నతాధికారులతోనూ చైర్మన్, స్పీకర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ భేటీలో ప్రొటోకాల్ అంశంపై వీరిద్దరు ఉన్నతాధికారులను హెచ్చరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో జరిగిన భేటీలో పలు అంశాలను ప్రస్తావించారు. తమను గౌరవించాల్సిన తీరుపై కిందిస్థాయి అధికారులకు అర్థమయ్యే రీతిలో సందేశాలు, సంకేతాలివ్వాలని గుత్తా, గడ్డం ప్రసాద్ చెప్పారు. చైర్మన్, స్పీకర్ అభ్యంతరాలు ఇవే.. తాము జిల్లా పర్యటనకు వెళ్లిన సమయంలో కనీసం ఆర్డీఓ లేదా తహసీల్దార్ స్థాయి అధికారులు స్వయంగా వచ్చి స్వాగతం చెప్పాల్సిన ఉన్నా ఎవరూ రావడం లేదు. తమ పర్యటనలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని ప్రొటోకాల్ విభాగం జిల్లా అధికారులకు పంపించడం లేదు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వ పరంగా జరిగే అభివృద్ధి కార్యక్రమాలకూ ఆహ్వానించడం లేదు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలకు మాత్రమే సమాచారం ఇస్తున్నారు. సాధారణంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో బదిలీలపై వచ్చే అధికారులు మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ను మర్యాదపూర్వకంగా కలవాలనే ఆనవాయితీని పాటించడం లేదు. దీంతో ఏ అధికారి ఏ స్థానంలో పనిచేస్తున్నారో కనీస సమాచారం కూడా ఉండట్లేదు. జాతీయ పండుగలైన పంద్రాగస్టు, గణతంత్ర దినోత్సవం, రాష్ట్ర అవతరణ వేడుకలు తదితర సందర్భాల్లో తాము జాతీయ పతాకాన్ని ఏ జిల్లాలో ఎగురవేయాలో చివరి నిమిషం వరకు చెప్పడం లేదు. ⇒ పర్యటనలకు వెళ్లిన సందర్భంలో కనీసం ఎస్ఐ స్థాయి అధికారి బందోబస్తు ఇవ్వాల్సి ఉన్నా ఎక్కడా కనిపించడం లేదు. దీనికి వాహనాల కొరత, మంత్రుల వెంట వెళ్లడం తదితర కారణాలను సాకుగా చూపుతున్నారు. ఎయిర్పోర్టు వీఐపీ లాంజ్లో సినిమా తారలు, ఇతరులను కూర్చోబెడుతూ మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ వెళ్లిన సందర్భంలో అధికారిక ఏర్పాట్లేవీ చేయడం లేదు. అటవీ ప్రాంతాలు, మారుమూల గ్రామాలకు వెళ్లినపుడు భద్రతా ఏర్పాట్లు ఉండటం లేదు. 25 లేదా 26న రాష్ట్ర బడ్జెట్? రాష్ట్ర అసెంబ్లీ వార్షిక బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. కేంద్ర బడ్జెట్ ఈనెల 23న ప్రవేశపెడుతున్న నేపథ్యంలో, రాష్ట్ర బడ్జెట్ ఈనెల 25 లేదా 26న ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం ఉన్నతాధికారులతో జరిగిన భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ సమీక్ష నిర్వహించారు. సమావేశాలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. డీఎస్సీ, గ్రూప్స్ పరీక్షలపై విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాసనసభ, మండలి లెజిస్లేచర్ సెక్రటేరియట్లో పెండింగులో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాల్లో ప్రొటోకాల్ వివాదాలు తలెత్తకుండా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పారు. ఈ సమీక్షలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, లెజిస్లేచర్ సెక్రెటరీ నరసింహాచార్యులు, విప్ రామచంద్రు నాయక్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు . -
గత ప్రభుత్వంకంటే ఇప్పుడే ఎక్కువ అవినీతి
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వంలో కంటే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ పాలనలో ఎక్కువ అవినీతి, చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం జీవోలను పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా చీకటి ఒప్పందాలతో కాంట్రాక్టర్లకు దోచిపెడుతోందని ధ్వజమెత్తారు. రహస్య జీవోలతో సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లాలో ఓ బడా కాంట్రాక్టర్కు రూ.1,100 కోట్ల కాంట్రాక్ట్ పనులు ఇచ్చారని ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర పథకం అమృత్ స్కీమ్లో కూడా రూ.3 వేల కోట్ల మేర కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడ్డారని అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా హాలులో ఆయన మాట్లాడుతూ ఎక్సైజ్ కుంభకోణంలో ఉన్న రేవంత్ బావమరిదికి చెందిన ఓ కంపెనీకి రూ.400 వందల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చా రని తెలిపారు. ఆయా పనులను 30 నుంచి 35 శాతం తక్కువకు చేసేందుకు ఇతర కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నా ఇష్టారీతిన అంచనాలు పెంచి, కావాల్సిన వారికి కాంట్రాక్ట్లు ఇచ్చారని విమర్శించారు. ఇటీవల వివిధ పనుల్లో రూ.1,200 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి తమ్ముడు, బావమరిది భాగస్వామ్యంతో ఉన్న కంపెనీలకు కాంట్రాక్టులు ధారాదత్తం చేస్తున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంపై తాను చేస్తున్న ఆరోపణలపై విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. అలాగే కరీంనగర్లో వివిధ కాంట్రాక్ట్లలో సీఎం తమ్ముడు భాగస్వామిగా ఉన్నట్టు చెబుతున్నారని ఆరోపించారు. కొడంగల్లో త్వరలో పిలిచే టెండర్లలో కూడా ఓ బడా కంపెనీకి పెద్దపీట వేయబోతున్నారన్నారు. తాను లేవనెత్తిన ప్రశ్నలకు రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అవినీతి వ్యవహారాలపై ఈడీ, సీబీఐ విచారణ కోరతామని మహేశ్వర్రెడ్డి తెలిపారు. -
బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు కావడం వల్లనే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఆశించిన మేర సీట్లు రాలేదని ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన, ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. కొన్ని స్థానాల్లో మాత్రం ఎమ్మెల్యేల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందలేదని, ఇతర పార్టీల నుంచి చేరికలు కూడా కలసి రాలేదని చెప్పారు. ఈ మేరకు లోక్సభ ఎన్నికల్లో పార్టీ పనితీరుపై పోస్టుమార్టం నిర్వహించేందుకు హైకమాండ్ పంపిన కురియన్ కమిటీకి తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ కురియన్తోపాటు అస్సాం ఎమ్మెల్యే రకీబుల్ హుస్సేన్ గురువారం గాంధీభవన్కు వచ్చారు. మూడు రోజుల షెడ్యూల్లో భాగంగా తొలి రోజు ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు, ఓడిపోయిన అభ్యర్థులతో వీరిరువురూ భేటీ అయ్యారు. 17 మంది అభ్యర్థులకుగాను 16 మంది హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న కారణంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కమిటీ ముందుకు రాలేదు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్గౌడ్, సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంత రావు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, టీజీ ఫుడ్స్ చైర్మన్ ఫహీం, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్చౌదరి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ తదితరులు కూడా కురియన్ కమిటీని మర్యాదపూర్వకంగా కలిశారు. మొత్తం సీన్ మారిపోయింది... తొలి రోజు షెడ్యూల్లో భాగంగా ఉదయమే గాం«దీభవన్లో కురియన్ కమిటీ ఎంపీ అభ్యర్థులతో సమావేశమైంది. ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన చామల కిరణ్కుమార్రెడ్డి, మల్లురవి, రఘువీర్రెడ్డి, బలరాం నాయక్, కడియం కావ్య, సురేశ్ షెట్కార్, రామసహాయం రఘురామిరెడ్డి, ఓడిపోయిన అభ్యర్థులు ఆత్రం సుగుణ, దానం నాగేందర్, సఫీవుల్లా, సునీతా మహేందర్రెడ్డి, గడ్డం రంజిత్రెడ్డి, వెల్చాల రాజేందర్రావు, చల్లా వంశీచందర్రెడ్డి, నీలం మధు, జీవన్రెడ్డిలు కమిటీ ముందు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా జరిగిందని, కానీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా జరిగిందని వెల్లడించినట్టు తెలిసింది. ‘అసెంబ్లీ ఎన్నికల సమీకరణలు లోక్సభ ఎన్నికల్లో లేవు. పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. బీఆర్ఎస్ బాహాటంగానే బీజేపీకి మద్దతిచ్చింది. తాము గెలవకపోయినా కాంగ్రెస్ గెలవొద్దని, బీజేపీని గెలిపించడం ద్వారా తమ రాజకీయ ప్రయోజనాలను రక్షించుకోవాలనేది బీఆర్ఎస్ ఉద్దేశం’అని వెల్లడించారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న కురియన్ బీజేపీ అంటే బీఆర్ఎస్కు కోపం ఉండాలి కదా... ఓట్లు వేసి సహకరించుకునే సాన్నిహిత్యం ఆ రెండు పార్టీల మధ్య ఉందా అని ప్రశ్నించినట్టు తెలిసింది. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని మొదటి నుంచీ తెలంగాణ ప్రజల్లో అభిప్రాయం ఉండేదని, రాజకీయ క్షేత్రంలో బీఆర్ఎస్, బీజేపీల మధ్య వైరుధ్యం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కొంత ఉండేదని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాత్రం మారిపోయిందని చెప్పారు. కేసుల్లో ఇరుక్కుపోయిన బీఆర్ఎస్ నేతలు బీజేపీకి సహకరించారని వెల్లడించారు. ఎమ్మెల్యేలు సహకరించలేదు... కొందరు ఓడిపోయిన అభ్యర్థులు మాత్రం తమకు ఎన్నికల్లో సహకరించని ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల పేర్లను కూడా కురియన్ కమిటీకి చెప్పారని తెలుస్తోంది. మహబూబ్నగర్లో చాలా స్వల్ప తేడాతో ఓడిపోయామని, అక్కడ బీజేపీ అభ్యరి్థగా పోటీ చేసిన డి.కె.అరుణ కాంగ్రెస్ నుంచి ఎదిగారని, దీంతో చాలా స్వల్పంగా అయినా కాంగ్రెస్ కేడర్ ఆమెకు సహకరించిందని, ఈ నియోజకవర్గంలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా సరిగా పనిచేయలేదనే చర్చ జరిగినట్టు సమాచారం. అలాగే మెదక్ నియోజకవర్గంలోనూ పూర్తిస్థాయిలో సహకారం అందలేన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ఇక, ఇంద్రకరణ్రెడ్డి, కోనేరు కోనప్ప, వేణుగోపాలాచారి లాంటి నేతల చేరికలు పార్టీకి కలసి రాలేదని, వాళ్ల ఓట్లు కూడా పడలేదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు టికెట్లు ఇవ్వడం కూడా కొంత ప్రభావం చూపిందని చెప్పినట్లు సమాచారం. కరీంనగర్ లాంటి స్థానాల్లో అభ్యర్థుల ఖరారు కోసం చివరి నిమిషం వరకు ఆగకుండా ఉండాల్సిందనే అభిప్రాయాలు కూడా వెల్లడైనట్లు తెలిసింది. కాగా, శుక్రవారం కమిటీ లోక్సభ ఎన్నికల ఇంచార్జులు, పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ భేటీ కానుంది. వారి అంతర్గత పొత్తుతోనే: ఎంపీ చామల కిరణ్ కురియన్ కమిటీతో భేటీ అనంతరం భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ అభిప్రాయాలను కురియన్ కమిటీకి వివరించామని చెప్పారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు రాష్ట్రంలో 12–13 స్థానాలు వచ్చేవని, బీజేపీ–బీఆర్ఎస్ల అంతర్గత పొత్తు కారణంగానే ఎనిమిది సీట్లకు పడిపోయామని చెప్పారు. కొన్ని స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల స్థాయి కంటే తక్కువ ఓట్లను పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పొందిందని, పార్లమెంటు ఎన్నికల నాటికి సమీకరణాలు మారిపోయాయని చెప్పారు. -
కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ సిటీ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ నగర పరిధిలోని ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్ (రాజేంద్రనగర్), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి) శుక్రవారం సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. వారితోపాటు కొందరు మున్సిపల్ చైర్మన్లు కూడా తమ పార్టీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు బీఆర్ఎస్ నుంచి ఏడుగురు ఎమ్మెల్యే లు కాంగ్రెస్లో చేరగా.. ఈ ఇద్దరి చేరిక పూర్తయితే ఆ సంఖ్య తొమ్మిదికి చేరనుంది.ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తర్వాతే..ప్రకాశ్గౌడ్, అరికెపూడి గాంధీ ఇద్దరూ 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచి.. తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరూ బీఆర్ ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నిక య్యారు. నిజానికి ఈ ఇద్దరు నేతలు కూడా టీడీపీలో కొన సాగినకాలంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర బాబునాయుడుకు అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇక్కడ టీడీపీ ఉనికి కోల్పోవడంతో బీఆర్ఎస్లో చేరారు. మరోవైపు ఇటీవల ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తాజాగా హైదరాబాద్కు వచ్చారు. ప్రకాశ్గౌడ్, అరికెపూడి గాంధీ ఈ నెల ఏడున చంద్రబాబుతో భేటీ అయి చర్చించారు. తర్వాత వారం రోజుల లోపలే వారిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఆదేశాల మేరకే వారు కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. -
ఎవరు సన్నాసో వాళ్లే చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చేందుకు విద్యార్థులను వాడుకున్న రాహుల్ గాందీ, రేవంత్రెడ్డిలలో ఎవరు సన్నాసో వారే చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు వ్యాఖ్యానించారు. విద్యార్థులను, నిరుద్యోగులను అవమానపరిచేలా మాట్లాడిన సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాడులు చేస్తున్న పోలీసుల పేర్లను డైరీలో నమో దు చేస్తున్నామని, అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్లోని తన నివాసంలో గురువారం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులతో కేటీఆర్ సమావేశమయ్యా రు. ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం పోలీసుల చేతిలో దెబ్బతిన్న విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా భరించలేని నిరంకుశ మనస్తత్వంతో సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులపైనా పోలీసులు దుర్మార్గంగా దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ అంటూ రాహుల్ గాంధీ బొమ్మ తో దినపత్రికలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రకటనలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ మేరకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామనే హామీని ప్రశ్నిస్తున్న నిరుద్యోగులు, యువతకు రేవంత్ రాజకీయాలు అంటగడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి తలలు, వీపులు పగలగొట్టడమే మీ మార్కు ప్రజాపాలనా అని కేటీఆర్ ప్రశ్నించారు. కొత్త రూపంలో పాత అరాచకాలు పాత అరాచకాల కాంగ్రెస్ మోసపూరితంగా కొత్త రూపంలో వచ్చిందని విమర్శించిన కేటీఆర్ ఈ విషయాన్ని ప్రజలు ఆరు నెలల్లోనే అర్థం చేసుకున్నారని చెప్పారు. హామీల అమలును ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయడమేమిటని నిలదీశారు. గతంలో ప్రైవేటు యూనివర్సిటీలపై రాద్ధాంతం చేసిన కాంగ్రెస్ ప్రస్తుతం ఏడు యూనివర్సిటీలకు కొత్తగా ఎలా అనుమతులు ఇచ్చిందని ప్రశ్నించారు. గతంలో 50వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ వేస్తామని ప్రకటించి ప్రస్తుతం ఆరు వేల అదనపు ఉద్యోగాలతో యువతను మోసం చేస్తోందని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 1.62 లక్షల ఉద్యోగాల భర్తీతో పాటు 40వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించామన్నారు. విద్యారంగంలో జరిగే అన్యాయాలపై బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆందోళన చేయాలని కేటీఆర్ సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. హైదరాబాద్ దెబ్బతింటే దేశానికీ నష్టమే: ‘ఎక్స్’లో కేటీఆర్ పాలనానుభవం లేని నాయకత్వ ఫలితం రాజధాని హైదరాబాద్ మొదలుకొని రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలోనూ కనిపిస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ మసకబారిందని, దశాబ్దకాలంగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో ప్రజల జీవితాలకు భద్రత లేకుండా పోయిందన్నారు. సీఎం స్వయంగా కమాండ్ కంట్రోల్ సెంటర్కు వస్తున్నా శాంతిభద్రతలపై నియంత్రణ లేదని ఆరోపించారు. నగరంలో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిందని, పెట్టుబడులు తరలిపోతుండటంతో యువతకు ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయని, విద్యుత్ కోతలు, నేరాలు హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎంకు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర రాజధానిపై లేదన్నారు. హైదరాబాద్ కేవలం రాష్ట్ర రాజధాని మాత్రమే కాదని, తెలంగాణకు ఆర్థిక ఇంజిన్ అనీ, హైదరాబాద్ దెబ్బతింటే కేవలం తెలంగాణకే కాకుండా దేశానికి కూడా నష్టమేనని కేటీఆర్ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో పేర్కొన్నారు. -
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు.. హైకోర్టులో విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనల తర్వాత ఈ పిటిషన్పై విచారణను హైకోర్ట్ సోమవారానికి వాయిదా వేసింది.కాగా, బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావులపై అనర్హత వేటు వేయాలని పిటిషన్లో బీఆర్ఎస్ పేర్కొంది. కాగా, ఈ పిటిషన్పై అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఇప్పటికే వాదనలు వినిపించారు. దీంతో, తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. -
బీఆర్ఎస్ గట్టి షాక్.. రేపు కాంగ్రెస్లోకి మరో ఎమ్మెల్యే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్కు కష్టకాలం నడుస్తోంది. ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతూ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేపు(శుక్రవారం) హస్తం గూటికి చేరుతున్నారు.కాగా, సీఎం రేవంత్ సమక్షంలో రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ప్రకాశ్ గౌడ్తో పాటు మరో ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు కూడా హస్తం పార్టీలో చేరుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇక, ప్రకాశ్ గౌడ్ చేరికలో కాంగ్రెస్లోకి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. -
బండి సంజయ్కు లేఖ రాసిన కేటీఆర్.. విషయం ఏంటంటే?
సాక్షి, హైదరాబాద్: పదేళ్లుగా ప్రతీ బడ్జెట్లో తెలంగాణకు కేంద్రం మొండిచెయ్యి చూపించిందన్నారు కేటీఆర్. కేంద్రమంత్రిగా బండి సంజయ్ సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ను తీసుకురావాలని కోరారు.కాగా, కేంద్రమంత్రి బండి సంజయ్కు తాజాగా కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో..‘ఈసారి కేంద్ర బడ్జెట్లో సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ను తీసుకురండి. పదేళ్లుగా ప్రతీ బడ్జెట్లో కేంద్రం తెలంగాణకు మొండిచెయ్యి చూపింది. అనేకసార్లు పవర్ లూమ్ క్లస్టర్ కోసం కేంద్రానికి లేఖలు, స్వయంగా కలిసి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను.ఈసారైనా సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ను తెప్పించండి. కేంద్ర మంత్రిగా మీకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తే ఇక్కడి నేతన్నల కష్టాలు కొంత మేరకు తీరుతాయి. క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికులు, వనరులు ఈ ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయి. ♦️ ఈసారి కేంద్ర బడ్జెట్ లో సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ ను తీసుకురండి ♦️ కేంద్రమంత్రి బండి సంజయ్ కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS బహిరంగ లేఖ♦️ పదేళ్లుగా ప్రతి బడ్జెట్ లో కేంద్రం తెలంగాణకు మొండిచెయ్యి చూపింది♦️ అనేకసార్లు పవర్లూమ్ క్లస్టర్ కోసం పది సార్లు… pic.twitter.com/Gc1VCfn7VY— BRS Party (@BRSparty) July 11, 2024 కాంగ్రెస్ పాలకుల వైఫల్యం వల్ల చేనేత రంగం సంక్షోభంలోకి వెళ్లింది. నేతన్నలను ఆదుకోవడంలో తెలంగాణ సర్కార్ ఫేయిల్ అయ్యింది. ఈసారి కేంద్ర బడ్జెట్లో సిరిసిల్లకు గుడ్ న్యూస్ వచ్చేలా చూడాలని సూచన చేస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. -
కేటీఆర్.. 2014కు ముందకు మీ ఆస్తులెంత?: కడియం శ్రీహరి
సాక్షి, జనగామ: జనగామ నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా, లక్ష్యంగా కాంగ్రెస్లో చేరినట్టు చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇదే సమయంలో గత పదేళ్లలో కల్వకుంట్ల కుటుంబం అవినీతి పెరిగిపోయిందని సంచలన ఆరోపణలు చేశారు.కాగా, కడియం శ్రీహరి గురువారం స్టేషన్ ఘనపూర్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకత్వం మీద నమ్మకం లేకనే రాజీకీయ వలసలు జరుగుతున్నాయి. రాజకీయ వలసలు మీరు చేస్తే ఒకటి.. వేరే వాళ్లు చేస్తే మరొకటా?. గత 10 ఏళ్లలో కల్వకుంట్ల కుటుంబం అవినీతి పెరిగింది. 2014కు ముందు వారి ఆస్తులు ఎంత.. 2024 తర్వాత ఎంతో ప్రజలకు చెప్పాలి.బీఆర్ఎస్ పార్టీ నేతలు నిరుద్యోగులను పట్టించుకోవడంలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాబోయే సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ను విడుదల చేయబోతున్నాం. యువతను రెచ్చగొడుతున్న బీజేపీని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఏడాదికి లక్ష ఉద్యోగాలు అన్న బీజేపీ ఎక్కడ భర్తీ చేశారు. కాంగ్రెస్ను విమర్శిస్తున్న బీఆర్ఎస్ నాయకులు ఆలోచించుకోవాలి. కుటుంబానికే పరితమై అవినీతి, అహంకారం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది.రాజకీయ పార్టీలను విలీనం చేసుకుని, రాజకీయ విలువలు లేకుండా చేసి భ్రష్టు పట్టించిన చరిత్ర బీఆర్ఎస్ది. కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత, సంతోష్ కుమార్ ఆస్తులు 2014కు ముందు.. ఇప్పటికీ.. ఎన్నో ప్రజల ముందు చెప్పండి. ముందు బీఆర్ఎస్.. పార్టీ కార్యాచరణపై దృష్టి పెట్టండి. ఇంటిని చక్కపెట్టుకునే ప్రయత్నం చేయండి. నాయకత్వం మీద నమ్మకం లేకనే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వలసలు మొదలయ్యాయి. ఇప్పటికైనా పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టండి.. లేకపోతే బీఆర్ఎస్ కనుమరుగవుతుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.నియోజకవర్గ అభివృద్ధిపైన సీఎం రేవంత్కు విన్నవించాను. వివిధ పనులకు సంబంధించిన ఎస్టిమేట్స్ అన్ని రేవంత్ రెడ్డికి అందించాను. నియోజకవర్గ కేంద్రంలో పేద ప్రజలకు వైద్యాన్ని అందించాలని 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరాను. రెవెన్యూ డివిజన్లో డివిజనల్ కార్యాలయాలు పనిచేసే విధంగా సౌకర్యాలు లేవు. అందుకే 15 కార్యాలయాలు గుర్తించడం జరిగింది.అన్నీ ఒకే చోట పనిచేసే విధంగా ఇంటిగ్రేటెడ్ డివిజనల్ కార్యాలయాల ఏర్పాటుకు వినతి పత్రం ఇచ్చాను. సాగునీటి కోసం స్టేషన్ ఘనపూర్ నుండి నవాబుపేట రిజర్వాయర్కు కాలువ నిర్మాణం చేపట్టాలి. కనీసం 20 వేల ఎకరాలకు కూడా సాగునీరు అందించలేకపోతున్నాం. ఆర్ అండ్ బీలో ఆరు ప్రధాన రోడ్లను రూ.125 కోట్లతో నిర్మించాలని కోమటి రెడ్డికి వినతి పత్రం ఇచ్చాము’ అంటూ కామెంట్స్ చేశారు. -
హైదరాబాద్కు కిషన్ రెడ్డి ఏం తెచ్చాడు?: మంత్రి పొన్నం ఫైర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్రెడ్డి హైదరాబాద్కు ఏం తెచ్చాడు? అని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అలాగే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ అసమర్థుడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.కాగా, మంత్రి పొన్నం తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్కు కౌంటరిచ్చారు. మంత్రొ పొన్నం ప్రభాకర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘హైదరాబాద్ ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా కిషన్రెడ్డి మాట్లాడటాన్ని ఖండిస్తున్నాను. హైదరాబాద్కు కిషన్ రెడ్డి ఏం తెచ్చాడు?. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు హైదరాబాద్ను నిర్లక్ష్యం చేశాయి.తెలంగాణకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. కిషన్ రెడ్డి కేంద్రమంత్రి కాగానే హైదరాబాద్ ఇంచార్జీ మంత్రిగా కలిశాను. కేటీఆర్ కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయాడు. కేటీఆర్ పెద్ద అసమర్థుడు. హైదరాబాద్ అస్తవ్యస్తం కావడానికి కారణం కేటీఆరే. ఉద్యోగ క్యాలెండర్ తప్పకుండా ఇస్తాం. ఉద్యోగ నియామకాలు జాప్యం అవుతున్నాయని మొన్నటి వరకు ప్రశ్నించి, ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయండి అంటున్నారు. రాజకీయ నాయకుల ఉచ్చులో విద్యార్థులు పడకండి. విద్యార్థుల న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరిస్తాం’ అని కామెంట్స్ చేశారు. -
ఇకనైనా కాంగ్రెస్ సర్కారు మేల్కొనకపోతే: కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు. హస్తం పార్టీ పాలనతో మహా నగరమైన హైదరాబాద్లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వత్తాసు పలికే ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు కూడా “ఈ నగరానికి ఏమైంది?" అని ఫ్రంట్ పేజిలో వార్తలు రాస్తోంది అంటే హైదరాబాద్ పరిస్ధితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. పరిపాలనా అనుభవం లేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాద్ నుంచి తెలంగాణ పల్లెటూరు వరకూ అంతటా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అంటే.. కేవలం రాజధాని కాదని.. తెలంగాణ ఎకనమిక్ ఇంజన్ అని తెలిపారు. ఇకనైనా కాంగ్రెస్ సర్కారు మేల్కొనకపోతే.. మన హైదరాబాద్ దెబ్బతినే పరిస్థితి ఉందన్నారు. దీని వల్ల రాష్ట్రానికి కష్టమే కాదు.. యావత్ దేశానికి కూడా నష్టం.. అంటూ కేటీఆర్ ట్విట్ చేశారు."ఈ మహా నగరానికి ఏమైంది..?"ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ప్రముఖ పత్రికలు కూడా “ఈ నగరానికి ఏమైంది?" అని ఫ్రంట్ పేజిలో వార్తలు రాస్తోంది అంటే నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని అర్థం!పరిపాలనా అనుభవం లేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాదు నుండి తెలంగాణ పల్లెటూరు వరకూ అంతటా… pic.twitter.com/RF7aVlR7x6— KTR (@KTRBRS) July 11, 2024 -
ఫలితాలపై పోస్ట్మార్టమ్.. గాంధీభవన్లో కురియన్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులతో ఏఐసీసీ ఏర్పాటు చేసిన త్రీ మెన్ కమిటీ ప్రత్యేకంగా భేటీ అయ్యింది. అభ్యర్థులతో విడివిడిగా మాట్లాడుతున్న కురియన్ కమిటీ.. ఒక్కో అభ్యర్థికి 30 నిమిషాలు సమయం కేటాయించింది. తమ వాదన సైతం కురియన్ కమిటీకి వినిపిస్తామంటున్నారు టికెట్ రాని నేతలు.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాల్లో ఏఐసీసీ నిజనిర్ధారణ కమిటీలు వేసింది.మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలలో నిజనిర్ధారణ కమిటీలు వేసింది. కురియన్తో పాటు రక్హిబుల్ హుసేన్, పర్గత్ సింగ్లతో తెలంగాణ కమిటీ ఏర్పాటు చేశారు. రెండు మూడు రోజుల పాటు తెలంగాణలోనే ఉండి పలు నియోజకవర్గాల్లో కురియన్ కమిటీ తిరగనుంది.పార్లమెంటు ఎన్నికల్లో ఎందుకు ఓటమి చెందారు? పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ, లోక్సభ ఫలితాల్లో వచ్చిన ఓటింగ్ శాతం ఎంత? లోపాలు ఏంటి? వంటి అంశాలపై కురియన్ కమిటీ ఆరా తీస్తోంది. ఓటమికి కారణాలపై వివరాలను కురియన్ కమిటీ అభ్యర్థుల నుంచి సేకరిస్తోంది.