-
IPL 2024: క్రికెట్ అభిమానులకు ఆర్టీసి ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్..
ఐపీఎల్-2024 సందర్భంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఈరోజు (05-04-2024) సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ని వీక్షించడానికి భారీగా అభిమానులు వెళ్లనున్నారు. దీంతో స్టేడియం పరసర ప్రంతాల్లో సాధారణ ప్రయాణీకులకు ఎదురయ్యే ఇబ్బందులను గురించి ట్విట్టర్ లో ఆర్టీసి ఎండీ సజ్జనార్ "ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ #Hyderbad వర్సెస్ #Chennai సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే #IPL మ్యాచ్ కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టండి. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెళ్లే క్రికెట్ అభిమానుల కోసమే హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాల నుంచి 60 ప్రత్యేక బస్సులను ఉప్పల్ స్టేడియానికి #TSRTC నడుపుతోంది. ఈ బస్సులు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి బయలుదేరుతాయి. వీటిని ఉపయోగించుకుని క్షేమంగా స్టేడియానికి వెళ్లి క్రికెట్ మ్యాచ్ ని వీక్షించాలని #TSRTC యాజమాన్యం కోరుతోందని తెలిపారు". క్రికెట్ అభిమానులకు విజ్ఞప్తి!? ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ #Hyderbad వర్సెస్ #Chennai సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే #IPL మ్యాచ్ కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా… pic.twitter.com/FxQT9joKAl — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) April 5, 2024 -
దశాబ్ది ఉత్సవాలు: తెలుగు సినిమా, సీరియల్స్ డబ్బింగ్ కళాకారుల సందడి!
హైదరాబాద్: శ్రీ నగర్ కాలనీ శ్రీ సత్యసాయి నిగమాగమంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలుగు సినిమా, సీరియల్స్కి సంబంధించిన డబ్బింగ్ కళాకారులు పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. DAATT అధ్యక్షుడు, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ RCM రాజు మాట్లాడుతూ ఇన్ని గళాలతో కలిసి పండగ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది, రోజంతా బిజీగా గడిపే మా జీవితాలకు అన్ని పండగలు కలిసి ఓకే రోజు చేసుకున్నట్టుగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా సీనియర్ నటి రోజా రమణి, తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వినోద్ బాల, కాదంబరి కిరణ్, మ్యూజిక్ డైరెక్టర్ బంటి , DAATT కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్ వర్మ, టీవీ విఎస్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: ‘మ్యూజింగ్ ఆఫ్ ఏ టీనేజ్ గర్ల్’ ఆవిష్కరణ -
యాదాద్రిలో ఘనంగా జరుగుతున్న అమ్మవారి పూజలు
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని శుక్రవారం విశేష పూజలు కొనసాగాయి. వేకువజామున స్వయంభూలను కొలిచిన ఆచార్యులు.. ప్రధానాలయంలోని ముఖ మండపంలో 108 బంగారు, వెండి కలశాలలో శుద్ధజలం, సుగంధ ద్రవ్యాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాటితో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకించారు. అమ్మవారి సేవను ఊరేగిస్తున్న ఆచార్యులు అంతకుముందు హోమం నిర్వహించారు. భక్తులు గిరిప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, అధికారులు గజివెల్లి రఘు, దొమ్మాట సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కనుల పండువగా ఊంజలి సేవ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఊంజలి సేవ కనుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టించి ఊంజలి సేవ చేపట్టారు. -
మూడేళ్లుగా ముందుకుసాగని పథకం.. విత్తనోత్పత్తికి అంతరాయం!
రైతుల్లో స్వయం ప్రతిపత్తిని పెంపొందించడానికి ఉద్దేశించిన గ్రామ విత్తనోత్పత్తి పథకానికి మంగళం పాడినట్లే కనపడుతోంది. 50శాతం సబ్సిడీపై రైతుకు ఫౌండేషన్ సీడ్ (మూల విత్తనం) అందించి నాణ్యమైన విత్తనాలు రైతులే ఉత్పత్తి చేసుకునే అవకాశం ఇక లేకుండా పోయింది. మూడేళ్లుగా ఈ పథకం ఊసే లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. వానాకాలానికి సంబంధించి 5.80లక్షలు ఎకరాల్లో పంటలు సాగవుతుంటాయి. ఇందులో వరి, పత్తి, మొక్కజొన్న, కంది తదితర పంటలు ఉంటాయి. యాసంగికి సంబంధించిన వివిధ రకాల పంటలు 3.5లక్షల ఎకరాలకుపైగా సాగులోకి వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులందరికీ నాణ్యమైన విత్తనం అందించడం ప్రభుత్వానికి కష్టతరంగా మారుతోంది. ఈ దుస్థితిని నివారించి రైతుల్లో స్వయం ప్రతిపత్తిని పెంపొందించడానికి గతంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విత్తనోత్పత్తి పథకాన్ని అమలు చేశారు. సిద్దిపేట జిల్లాను విత్తన హబ్గా తయారు చేయాలనే సంకల్పంతో పనిచేశారు. ప్రతిసారి ఏదో పంటను ఎంచుకొని ఈ పథకం అమలు చేసేవారు. ఏటా జిల్లాలోని పలు గ్రామాల్లో వానాకాలానికి సంబంధించి వరి, కంది, మొక్కజొన్న, యాసంగిలో శనగ పంటల్లో విత్తనోత్పత్తి చేసేవారు. దీని ద్వారా రైతులకు 50శాతం సబ్సిడీపై మూల విత్తనం అందిస్తారు. పరిశోధనా స్థానాల నుంచి నేరుగా వచ్చే వీటి వల్ల విత్తనోత్పత్తికి అవకాశముంటుంది. విత్తనాలు అందించిన తర్వాత వ్యవసాయశాఖ విత్తనం వేసింది మొదలు.. పంట చేతికొచ్చేసరికి మూడుసార్లు శిక్షణ అందించి నాణ్యమైన విత్తన ఉత్పత్తికి బాటలు వేసేవారు. ఉత్పత్తిగా వచ్చిన విత్తనాలను రైతులే స్వయంగా తెలిసిన రైతులకు అమ్ముకోవడం, లేదా ప్రభుత్వమే విత్తన కంపెనీలతో అగ్రిమెంట్ చేయించి మార్కెటింగ్ చేసేవారు. కొంత కాలం ఈ పథకం సత్ఫలితాలనిచ్చింది. క్రమేపి ఈ విధానం వల్ల ఆశించిన ఫలితాలు రాక మొగ్గుబడిగా సాగింది. రైతులు ఉత్పత్తి చేసిన విత్తనాలు నాణ్యాత ప్రమాణాలు కలిగి ఉన్నాయా? లేదా అనే విషయం తెలియక కొనుగోలు చేయడానికి చుట్టు పక్కల గ్రామాల రైతులు ఆసక్తి చూపలేదు. కంపెనీలతో అగ్రిమెంట్ చేయించే విషయంలో వ్యవసాయ శాఖ చొరవ చూపలేదు. మరీ మూడేళ్ల నుంచి అయితే పథకం ఊసే కరువైంది. ఫలితంగా ఆసక్తి ఉన్న రైతులకు ఫౌండేషన్ సీడ్ను కూడా అందలేదు. దీనిని బట్టి చూస్తే ఈ పథకానికి నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కొత్త ప్రభుత్వం చొరవపైనే ఆశలు.. కొత్త ప్రభుత్వం చొరవ చూపితేనే ఈ గ్రామ విత్తనోత్పత్తి పథకం సమర్థవంతంగా అమలయ్యే అవకాశముంది. ప్రధానంగా రైతులకు నాణ్యమైన విత్తన సబ్సిడీతోపాటు ఎరువులు, క్రిమిసంహారకాలను సబ్సిడీపై అందించాల్సి ఉంది. దీంతోపాటు రైతులు ఉత్పత్తి చేసే విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కొనుగోలు చేసేలా రైతులకు ఒప్పందం కుదిరిస్తే.. రైతుల ఉత్పత్తులకు మంచి ధర లభించి భారీ ప్రయోజనం జరిగే అవకాశముంది. ఇవేకాకుండా ఆత్మకమిటీల పనితీరు మెరుగుపరచడం, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) పథకాలను సైతం పునరుద్ధరించాల్సి ఉంది. ఇవి చదవండి: కృష్ణా బోర్డు ప్రాజెక్టుల నిర్వహణకు ఏపీ,తెలంగాణ అంగీకారం! -
Sakshi Whatsapp Channel: ఫాలో సాక్షి @ వాట్సాప్
వాట్సాప్ వాడుతున్నారు కదా.. ఓ అడుగు ముందుకేయండి. ఇప్పుడు వాట్సాప్ ఛానల్స్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. అంటే మీకు నచ్చిన కంటెంట్ను, మీకు అనుకూలమైన సమయంలో, మీకు నచ్చినట్టుగా చూడొచ్చన్నమాట. దీనికోసం మీరు లోతుగా సెర్చ్ చేయాల్సిన పనే లేదు. మీ ఛాయిస్ .. వాట్సాప్ ఛానల్ వాట్సాప్ అంటే మెసెజ్లు, ఫోటోలు, వీడియోలే కాదు. గ్రూప్లు వచ్చినా.. చాలా లిమిటేషన్స్. కొత్తగా వచ్చిన ఫీచరే వాట్సాప్ ఛానెల్. దీని ద్వారా మీకు నచ్చిన మీడియాను ఎంచుకుని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాలో ఎలాగైతే ఎంపిక చేసుకుంటున్నామో.. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీ వ్యక్తిగత వివరాలు ఎవరికీ కనిపించవు. సాక్షి వాట్సాప్ ఛానల్ ఎందుకంటే.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విశ్వసనీయమైన సమాచారం, సమకాలీన రాజకీయాలు, విశ్లేషణలు, పిక్టోగ్రాఫ్స్ వివరణలు, లేటేస్ట్ అప్డేట్స్ ఒకటేంటీ.. కావాల్సిన ముఖ్యమైన సమాచారన్నంతా.. వేగంగా మీ ముందుంచుతోంది సాక్షి. తెలుగు ప్రజలు కోరుకునే న్యూస్ను అత్యుత్తమ స్థాయిలో ఎంపిక చేసి సాక్షి వాట్సాప్ ఛానల్ మీకందిస్తోంది. ఫాలో అవ్వండిలా.. వాట్సప్లో మీకు పైన మూడు ఆప్షన్లు కనిపిస్తాయి... Chats, Updates, Calls. వీటిలో Updates క్లిక్ చేయండి. స్టేటస్లు దాని దిగువన ఛానెల్స్ కనిపిస్తాయి. మీకు Find Channel ఫైండ్ ఛానెల్ ఆప్షన్ కనిపిస్తుంది. సెర్చ్ చేస్తే Sakshi Telugu News మీకు కనిపిస్తుంది. దీని పక్కనే ఉన్న ప్లస్ (+) సింబల్ క్లిక్ చేయడం ద్వారా ఈ ఛానెల్ను ఫాలో కావొచ్చు. లేదా కింద కనిపిస్తోన్న QR కోడ్ స్కాన్ చేస్తే నేరుగా చేరొచ్చు. ప్రయోజనాలేంటీ? ఒక సారి ఫాలో అయితే అప్డేట్స్ వాటంతటే అవి కనిపిస్తాయి నోటిఫికేషన్స్ తరహాలో మిమ్మల్ని ఎక్కడా చికాకు పెట్టవు మీకు నచ్చిన సమయంలోనే లింకు క్లిక్ చేసి చూడొచ్చు లేటేస్ట్ అప్డేట్స్ క్షణాల్లో అందుకోవచ్చు వార్తలపై ఎమోజీ ద్వారా ఫీడ్బ్యాక్ ఇవ్వొచ్చు మీ వ్యక్తిగత సమాచారం ఎవరికీ కనిపించదు మీ ఫోటో, నెంబర్ కూడా కనిపించవు -
'ఆల్ ది బెస్ట్' టీమ్ ఇండియా..!
సాక్షి: ఐసీసీ మెన్స్ క్రికెట్ వన్డే వరల్డ్ కప్– 2023 తుది సమరానికి సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియంలో నేడు జరిగే ఫైనల్ మ్యాచ్లో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడనుంది. మెగా టోర్నీలో భారత్ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగి లీగ్ మ్యాచ్ నుంచి ఫైనల్ వరకు ఓటమి లేకుండా అద్భుత ప్రదర్శన ను కనబరిచింది. జట్టులోని కీలక ఆటగాళ్లు ఫామ్లో ఉండడంతో ఈసారి ప్రపంచ విజేతగా రోహిత్ సేన నిలుస్తుందని సగటు క్రికెట్ అభిమాని ఆశిస్తున్నా రు. ఫైనల్ సమరాన్ని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నా రు. పలు హోటళ్లు, టీసెంటర్స్, బార్లు, రెస్టారెంట్లలో అభిమానులు, ప్రేక్షకులు మ్యాచ్ను చూసేందుకు పెద్ద పెద్ద స్క్రీన్లను ఇప్పటికే సిద్ధం చేశారు. పలువురు అభిమానులు ప్రపంచకప్ న మూనాను తలపై కత్తిరించుకొని తమ అభిమానాన్ని చాటుకున్నా రు. క్రికెట్ వరల్డ్కప్ నేపథ్యంలో పలువురి అభిప్రాయాలు.. -
'నన్ను మోసం చేశాడంటూ..' యువకుడి ఇంటి ముందే.. యువతి
సాక్షి, ఆదిలాబాద్: నిశ్చితార్థం అయ్యాక పెళ్లికి నిరాకరించిన యువకుడి ఇంటి ఎదుట న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం రాత్రి ఓ యువతి ఆందోళన చేపట్టింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని సంజీవయ్య కాలనీకి చెందిన ప్రకాశ్కు ఆరు నెలల క్రితం ఆసిఫాబాద్ మండలం బురుగూడకు చెందిన శిరీషతో నిశ్చితార్థం జరిగింది. పెళ్లి జరగాల్సిన క్రమంలో పలు కారణాలతో వాయిదా పడింది. తాజాగా ప్రకాశ్ పెళ్లికి నిరాకరించడంతో శిరీష యువకుడి ఇంటికి వచ్చింది. దీంతో యువకుడి కుటుంబ సభ్యులు ఆమెను ఇంట్లో నుంచి బయటకు పంపించారు. దీంతో తీవ్ర చలిలోనే ప్రకాశ్ ఇంటి ముందు యువతి ఆందోళనకు దిగింది. సమాచారం తెలుసుకున్న పట్టణ ఎస్సై ఎంబడి శ్రీకాంత్ అక్కడకు చేరుకొని ఇరు పక్షాల నుంచి వివరాలు సేకరించారు. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని, నచ్చజెప్పే ప్రయత్నం చేసినా యువతి వినకుండా ఆందోళన కొనసాగిస్తోంది. ఇవి చదవండి: వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే.. -
ఘనంగా బతుకమ్మ వేడుకలు!
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండుగ రోజున 'గౌరమ్మను' పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పండుగను అంగరంగా వైభవంగా జరుపుతారు. ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. పార్వతి గురించి పాటలాగా పాడుతూ.. ఆనందంతో బతుకమ్మను జరుపుకుంటారు. ఆడపడచులు, యువకులు, పిల్లలు, పెద్దలు తమ ఆనందాన్ని చూపే కన్నుల పండుగగా.. తెలంగాణ ప్రజలకు ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ ఈ బతుకమ్మ. ఈ సందర్భంగా పల్లెలు, పట్టణాల్లో ఆలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మ ఆడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో పల్లెలు, పట్టణాలు తీరొక్క పూల శోభ సంతరించుకోనుంది. ఈ క్రమంలో చెరువుల వద్ద నిమజ్జన ప్రదేశాల్లో రంగుల ఆహ్లాదం ఎంతో చూడముచ్చట. పౌష్టికాహారం, చిరుధాన్యాలు, కూరగాయలు, గాజులు, చేతివృత్తులతో తయారు చేసిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణీయం. బతుకమ్మ పండుగ కేవలం కటుంబాలకు, ఇంటికే పరిమితం కాదు, తెలంగాణలోని అన్నీ రంగాలవారిగా.. విద్యా, వైద్యా, సాంకేతిక, వివిధ పరిశ్రమల్లో బతుకమ్మ వేడుకల నిర్వహణ ఎంతో కన్నుల పండుగగా చెప్పవచ్చు అనడానికి నిదర్శనంగా.. 'డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ కార్యాలయంలో' శనివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. 'డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ విభాగం' డైరెక్టర్ వి ఫణిభూషణ్శర్మ ఈ వేడుకలకు హాజరయ్యారు. 'జాయింట్ డైరెక్టర్లు' హెచ్ శైలజారాణి, పి రజిని, తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. రంగారెడ్డి హైదరాబాద్ 'పే అండ్ అకౌంట్ ఆఫిసర్స్' మహ్మద్ ఆరిఫ్, ఆర్ వి రామగోపాల్ అండ్ స్టాఫ్, ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగ సిబ్బంది, తదితరులు బతుకమ్మ వేడుకల సందర్భంగా హాజరయ్యారు. బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళల్ని మరింత ప్రోత్సహించే దిశలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఇలాంటి మరెన్నో పండుగలు జరుపుకోవాలని డైరెక్టర్ కోరుతూ.. అందుకు అందరి ప్రోత్సాహం ఎంతో అవసరమని తెలిపారు. -
దోస్త్ ద్వారా 6,843 సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) ఖాళీ సీట్ల భర్తీకి చేపట్టిన ప్రత్యేక దశ కేటాయింపులో 6,843 మంది సీట్లు పొందినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. వీరిలో మొదటి ప్రాధాన్యత ద్వారా 6,061 మందికి, రెండో ప్రాధాన్యత ద్వారా 782 సీట్లు వచి్చనట్టు తెలిపారు. ఆర్ట్స్లో 1,026, కామర్స్లో 2,131, లైఫ్ సైన్స్లో 2,240, ఫిజికల్ సైన్స్లో 618, డేటాసైన్స్లో 61, బీఎస్సీ ఆనర్స్ (కంప్యూటర్ సైన్స్)లో 43, బీఎస్సీ (బయో–టెక్నాలజీ)లో 20, అప్రెంటిస్íÙప్ ఎంబెడెడ్ ప్రోగ్రామ్లో 104, ఇతర బ్రాంచీల్లో 600 సీట్లు కేటాయించినట్టు వెల్లడించారు. సీట్టు పొందిన వారు శనివారంలోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. ఇదే రోజు నుంచి అక్టోబర్ 3 వరకూ అన్ని కాలేజీల్లో ఇంట్రా–కాలేజ్ ఫేజ్–2కి వెబ్ ఆప్షన్లు ఇచ్చే అవకాశం కలి్పస్తున్నట్లు తెలిపారు. -
చోటు.. నీకు సెల్యూట్!
రహమత్నగర్(హైదరాబాద్): ఓ ముస్లిం యువకుడు తొమ్మిదేళ్లుగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తూ మత సామరస్యాన్ని చాటుకుంటున్నాడు. కార్మికనగర్కు చెందిన షేక్ చోటు స్థానికంగా స్టార్ కేబుల్ను నిర్వహిస్తుంటాడు. ఆటోస్టాండ్ వద్ద ఏటా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తుంటాడు. గణనాథుడిని ప్రతిష్టించినప్పటి నుంచి నిమజ్జనం వరకు అన్నీ తానై చూసుకుంటాడు. ఈ క్రమంలోనే మట్టితో తయారు చేయించిన గణపతి విగ్రహాన్ని గురువారం రాత్రి మండపం వద్ద నిమజ్జనం చేశాడు. ఈ కార్యక్రమంలో బస్తీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
రేపు ‘భారత్ దాల్’ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: పప్పుధాన్యాలకు ప్రత్యామ్నాయంగా శనగపప్పు (చనా) వినియోగాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహార, ప్రజాపంపిణీ సంస్థ ‘భారత్ దాల్‘ బ్రాండ్ పేరుతో ప్యాక్ అందుబాటులోకి తెస్తోంది. కేంద్రం వద్ద ఉన్న శనగపప్పు స్టాక్లో 20 శాతం రిటైల్ సరఫరాగా మార్చి సబ్సిడీ ధరలకు అందించనుంది. ఈ మేరకు వన్ నేషన్ వన్ ప్రైస్ ధరలను అమలు చేస్తోంది. కిలో కేజీ శనగపప్పు ప్యాకెట్ రూ.60, 30 కిలోల ప్యాకెట్కు కిలోకు రూ.55 చొప్పున రూ.1,650కి అందించనున్నారు. హాకాకు 50 వేల టన్నులు.. ఇక దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాలలో ‘భారత్ దాల్‘ బ్రాండ్ శనగపప్పు పంపిణీ బాధ్యతలను రాష్ట్రానికి చెందిన హైదరాబాద్ అగ్రికల్చరల్ కో–ఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ (హాకా)కు అప్పగించింది. రిటైలర్లు, హోల్సేల్ వ్యాపారులకు, ప్రాథమిక సహకార సంఘాలు (ప్యాక్స్), మెట్రో, రిలయన్స్, టాటా రిటైల్ చైన్ హైపర్ మార్కెట్లు, అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ వంటి ఇ–కామర్స్ ప్లాట్ఫారమ్లకు హాకా నేరుగా సరఫరా చేయనుంది. రేపు అధికారికంగా ప్రారంభం హాకా పంపిణీ చేసే శనగపప్పు భారత్ దాల్ బ్రాండ్ను ఆదివారం అధికారికంగా ప్రారంభించనున్నారు. నెక్లెస్రోడ్లో ని అంబేడ్కర్ విగ్రహం వద్ద హాకాచైర్మన్ మచ్చా శ్రీనివాస్రావు అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో మంత్రి నిరంజన్రెడ్డి, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి రోహిత్కుమార్ సింగ్ పాల్గొననున్నారు. -
మళ్లీ మావోల పాగా!
సాక్షి ప్రతినిధి, వరంగల్: సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణలో ఎన్నికల బహిష్కరణ నినా దం వినిపించేందుకు సిద్ధమవుతోంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులోని గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు సమాయత్తమవుతోంది. డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో తెలంగాణలో పాగా వేసేందుకు సరైన సమయంగా పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్వ ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని గోదావరి పరీవాహక ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి చేరే అవకాశం ఉందని పోలీసులను రాష్ట్ర ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఇదే సమయంలో ఛత్తీస్గఢ్–తెలంగాణ సరిహద్దు ములుగు జిల్లా పేరూరు శివారు కర్రెగుట్ట ప్రాంతంలో బుధవారం మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరగడం గమనార్హం. చంద్రన్న నేతృత్వంలో సాయుధ దళాలు.. రాష్ట్ర విభజనకు ముందు ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా వ్యవహరించిన పుల్లూరు ప్రసాదరావు అలియాస్ చంద్రన్న నేతృత్వంలో సాయుధ దళాలు మళ్లీ రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. కేంద్ర కమిటీ సభ్యుడిగా, తెలంగాణ ఇన్చార్జ్గా ఉన్న చంద్రన్న.. రాబో యే ఎన్నికలే లక్ష్యంగా భారీ దాడులకు వ్యూహరచనతో తెలంగాణలో ప్రవేశించే క్రమంలో పేరూరు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో 30–40 మంది మావోయిస్టులు ఈ నెల 26న సమావేశమైనట్లు చెబుతున్నారు. బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, కొయ్యడ సాంబయ్య అలియాస్ గోపన్న, కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్లతోపాటు ఓగోలపు మల్లయ్య, భద్ద్రు, ముచ్చకి ఉంగల్ (రఘు), కొవ్వాసి గంగ (మహె‹Ù, జనార్దన్), నల్లమారి అశోక్ (విజెందర్), సాంబయ్య (అజాద్), ముస్సాకి దేవల్ (కరుణాకర్), పొడియం కొసయ్య అలియాస్ మాసాలతోపాటు సుమారు 40 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీనిపై కచి్చతమైన సమాచారం అందుకున్న ములుగు, ఛత్తీస్గఢ్ పోలీసులు గ్రేహౌండ్స్ బలగాలతో 2రోజులు అడవులను జల్లెడ పట్టారు. పేరూరు అటవీ ప్రాంతం కర్రెగుట్ట వద్ద వారికి మావోయిస్టులు తారసపడ్డారు. ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పు లు జరగ్గా ఆయుధాలతో మావోయిస్టులు తప్పించుకున్నారు. అయితే పెద్ద మొత్తంలో కిట్ బ్యాగులు, మందులు, బ్యాటరీ చార్జర్లు, వాట ర్ క్యాన్లు, సోలార్ ప్లేట్లు, సుతిలి బాంబులు, పార్టీ సాహిత్యం, వంట సామగ్రి లభ్యం కావడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. అగ్రనేతలు లక్ష్యంగా కూంబింగ్ మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మళ్లీ తెలంగాణ సరిహద్దుకు చేరారన్న సమాచారంతో పోలీసులు ఆ పార్టీ సాయు«ధ దళాల కదలికలపై దృష్టి పెట్టారు. ఉత్తర తెలంగాణ నుంచి మొత్తం 82 మంది వివిధ నక్సల్స్ గ్రూపులలో పనిచేస్తుండగా 8 మంది ప్రజాప్రతిఘటన, ఇద్దరు న్యూడెమోక్రసీలలో, మావోయిస్టు పారీ్టలో 72 మంది పనిచేస్తుండగా, 54 మంది ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఏవోబీ తదితర ప్రాంతాలలో వివిధ కేడర్లలో ఉన్నారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో పనిచేస్తున్న వారిలో 16 మంది పూర్వ వరంగల్కు చెందినవారు కాగా, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ (కేకేడబ్ల్యూ), డివిజన్ కమిటీలను ఎత్తేసి ఎన్టీఎస్జడ్సీని తెలంగాణ రాష్ట్ర కమిటీ (టీఎస్సీ)గా మార్చింది. రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ మృతి తర్వాత చంద్రన్న పర్యవేక్షణలో ఆ బాధ్యతలను బడే దామోదర్ చూస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతోపాటు కంకనాల రాజిరెడ్డి, బండి ప్రకాశ్ అలియాస్ క్రాంతి అలియాస్ ప్రభాత్, మైలారపు ఆదెల్లు అలియాస్ భాస్కర్, కొయ్యడ సాంబయ్య తదితర నేతల నిర్బంధం కారణంగా దండకారణ్యానికి మారారు. ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో సాయుధ దళాల రక్షణతో మళ్లీ తెలంగాణలో అడుగిడుతుండగా పోలీసులు ఆ దళాలు లక్ష్యంగా కూంబింగ్ ముమ్మరం చేశాయి. -
కాలంచెల్లిన సాఫ్ట్వేర్.. రూ.12 కోట్లు పెన్షనర్ల అకౌంట్లోకి
సాక్షి,హైదరాబాద్: కాలంచెల్లిన కంప్యూటర్లు తెలంగాణ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్కు పెద్ద కష్టాన్నే తెచి్చపెట్టాయి. సాఫ్ట్వేర్ లోపాలు ఉద్యోగులకు శాపాలుగా మారాయి. నిధుల కొరతతో ప్రతి రూపాయి విడుదల కోసం ఆర్థికశాఖ ఆచీతూచి నిర్ణయాలు తీసుకుంటుంటే ఇక్కడ మాత్రం రూ.12 కోట్లను పెన్షనర్ల అకౌంట్లలో జమచేసింది. ప్రతినెలా వారికి ఇవ్వాల్సిన పెన్షన్ కంటే అధికంగా చెల్లించింది. ఇందుకు ప్రధానకారణం కాలంచెల్లిన సాఫ్ట్వేర్ కారణమని తేల్చారు. పెన్–13 నుంచి ఇంపాక్ట్ సాఫ్ట్వేర్గా మార్పు జరిగిన అనంతరం పెన్షన్ డేటాలో లోపాలున్నాయని పలు జిల్లాల నుంచి డైరెక్టరేట్కు ఫిర్యాదులొచ్చాయి. అయినా సరిదిద్దకపోవటం వల్ల ఒక నంబర్ టైప్ చేస్తే, మరో నంబర్ అటోమెటిక్గా అప్లోడ్ కావటంతో చాలాకాలంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పెన్షనర్ల ఖాతాలకు వాస్తవ పెన్షన్ కంటే ఎక్కువగా చెల్లించారు. ప్రస్తుతం వినియోగిస్తున్న సాఫ్ట్వేర్ను థర్డ్పార్టీ తనిఖీ లేకుండానే నేరుగా తమపై రుద్దారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రమశిక్షణాచర్యలంటూ సిబ్బందికి హెచ్చరికలు: తాము చెల్లించిన ఎక్కువ మొత్తాన్ని తిరిగి చెల్లించాలంటూ తాజాగా ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ అధికారులు పెన్షనర్లకు నోటీసులు పంపుతున్నారు. మరోవైపు అధికచెల్లింపులు చేసిన సిబ్బందిపై క్రమశిక్షణాచర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తుండటంతో ట్రెజరీస్ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. లోపాలు, అధిక చెల్లింపుల విషయాన్ని తాము అనేకమార్లు డైరెక్టరేట్ దృష్టికి తీసుకుపోయినా, కనీస నివారణచర్యలు తీసుకోకుండా తమపై క్రమశిక్షణాచర్యలు తీసుకోవాలని చూస్తే ఆందోళన చేస్తామని ట్రెజరీస్ అకౌంట్స్ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. పెన్షనర్లు కూడా తాము ఇప్పుడు చెల్లించలేమన్న నిస్సహాయతను వ్యక్తం చేస్తుండటంతో డైరెక్టరేట్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
చాట్జీపీటీతో ఉద్యోగ మార్పులు తథ్యం!
వృత్తి నిపుణల నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ లింక్డిన్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇటీవలే ఈ సంస్థ జనరేటివ్ ఏఐ తీరుతెన్నులు ఎలా ఉన్నాయనేది తెలుసుకునేందుకు హైదరాబాద్లో ఓ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగుల్లో 79 శాతం మంది జనరేటివ్ ఏఐ తాము చేసే ఉద్యోగాల్లో కచి్చతంగా మార్పులు తీసుకొస్తుందని అనుకుంటున్నారు. అదే సమయంలో ఏఐ వల్ల తమ పని ఎంతో కొంత సులువు అవుతుందని 66 శాతం మంది భావిస్తున్నారు. కెరీర్లో ముందడుగు వేసేందుకు ఏఐ పనికొస్తుందని కూడా వారు విశ్వసిస్తున్నారు. కొంచెం వివరంగా చూస్తే చాట్జీపీటీ వంటి జనరేటివ్ ఏఐ సాఫ్ట్వేర్లు అందుబాటులోకి రావడంతో దాదాపు ప్రతి రంగంలోనూ వినూత్న మార్పులు రావడం తెలిసిందే. మార్కెటింగ్, సేల్స్ వంటివే కాకుండా చిన్నచిన్న ప్రోగ్రామ్లు రాయడం, కస్టమర్ల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడం వంటి అనేక విషయాల్లో ఇది ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలోనే లింక్డిన్ సర్వేకు ప్రాధాన్యం ఏర్పడింది. జనరేటివ్ ఏఐలో వస్తున్న మార్పులను, కొత్త అప్లికేషన్లను దృష్టిలో పెట్టుకుంటే ఏడాది కాలంలో టెక్ రంగంలోనూ గణనీయమైన మార్పులు వస్తాయని హైదరాబాద్లోని ఐటీ వృత్తి నిపుణులు అంటున్నారు. సర్వే చేసిన ప్రతి 10 మందిలో దాదాపు 8 మంది ఈ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. జనరేటివ్ ఏఐ విస్తృత వాడకంతో చాలా ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనపైనా టెకీలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఏఐ రంగంలో వస్తున్న మార్పులను పట్టించుకోకుంటే ఉద్యోగాలకు ఇబ్బందన్నది నిజమేనని 42 శాతం మంది పేర్కొన్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఏఐ గురించి తెలుసుకొనేందుకు దాన్ని తమ ఉద్యోగాల్లో భాగం చేసుకునేందుకు సుమారు 69 శాతం మంది సిద్ధంగా ఉండటం! కంచర్ల యాదగిరిరెడ్డి మేమిప్పటికే వాడేస్తున్నాం.. సర్వే చేసిన వారిలో సుమారు 64 శాతం మంది ఇప్పటికే తాము ఏఐను ఉద్యోగాల్లో భాగంగా వాడుతున్నట్లు చెప్పారు. అలాగే చాట్జీపీటీ వంటి జనరేటివ్ ఏఐను వాడే ప్రయత్నం చేస్తున్నామన్న వాళ్లు సగానికిపైగా ఉన్నారు. దేశం మొత్తమ్మీద చూస్తే చాట్జీపీటీని వినియోగించే వాళ్లలో 54 శాతంతో మిలినియల్స్ ముందు వరుసలో ఉన్నారు. జెన్–జీకి చెందిన వారు 46 శాతంతో రెండోస్థానంలో ఉన్నారు. అంతేకాదు హైదరాబాద్లోని వృత్తి నిపుణులు జనరేటివ్ ఏఐతో జట్టు కట్టేందుకు కూడా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నట్లు ఈ సర్వే తెలిపింది. ఏఐతో అయ్యే పనులేమిటి? ఏఐతో చేయగల పనులకు హద్దుల్లేవని ఐటీ నిపుణులు అంటున్నారు. తమ ఉద్యోగ జీవితాన్ని మార్చేస్తుందని దాదాపు అందరూ గట్టిగా నమ్ముతున్నారు. అందుకే తాము ఏఐని ఉద్యోగాల్లో ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్నామని 98 శాతం మంది పేర్కొనడం గమనార్హం. ఇందుకు తగ్గట్టుగానే ఉద్యోగ ప్రకటనల్లోనూ చాట్జీపీటీ, ఏఐ టెక్నాలజీల ప్రస్తావన ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయిందని లింక్డిన్ చెబుతోంది. ‘జనరేటివ్ ఏఐ మీ ఉద్యోగ జీవితాన్ని ఎలా మెరుగు పరుస్తుంది?’అని హైదరాబాద్లోని వృత్తి నిపుణులను అడిగినప్పుడు కావాల్సిన సమాచారం తక్షణమే అందుబాటులోకి వస్తుంది కాబట్టి చేసే పనిని మరింత సమర్థంగా, విశ్వాసంతో చేయగలమని 66 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఉత్పాదకత విషయంలోనూ ఏఐ తమకు సహాయకారి కాగలదని భావిస్తున్నారు. పనిలో ఎదురయ్యే ఇబ్బందులను సులువుగా అధిగమించేందుకు ఏఐని వాడాలని 83 శాతం మంది ఆలోచిస్తుండగా సహోద్యోగులను అడిగేందుకు ఇబ్బంది పడే ప్రశ్నలకు ఏఐ ద్వారా సమాధానాలు తెలుసుకుంటున్నట్లు 77 శాతం మంది చెప్పారు. ఏఐ కోర్సులు.. - హౌ టు రీసెర్చ్ అండ్ రైట్ యూజింగ్ జనరేటివ్ ఏఐ టూల్స్ – డేవ్ బిర్స్ - వాట్ ఈజ్ జనరేటివ్ ఏఐ? – పినార్ సెహాన్ డెమిర్డాగ్ - జనరేటివ్ ఏఐ ఫర్ బిజినెస్ లీడర్స్ – టోమర్ కోహెన్ - నానో టిప్స్ ఫర్ యూజింగ్ చాట్జీపీటీ ఫర్ బిజినెస్ – రాచెల్ వుడ్స్ - మెషీన్ లెరి్నంగ్ విత్ పైథాన్: ఫౌండేషన్స్ – ఫ్రెడిక్ న్వాన్గాంగా - గెట్ రెడీ ఫర్ జనరేటివ్ ఏఐ – ఆష్లీ కెన్నెడీ - ఇంట్రడక్షన్ టు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫర్ జనరేటివ్ ఏఐ – రోనీ షీర్ - పైథాన్ డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథమ్స్ – రాబిన్ ఆండ్రూస్ - ప్రాంప్ట్ ఇంజనీరింగ్: హౌ టు టాక్ టు ద ఏఐస్ – జేవియన్ అమాట్రియాన్ - జీపీటీ–4, ద న్యూ జీపీటీ రిలీజ్ అండ్ వాట్ యూ నీడ్ టు నో – జోనథన్ ఫెర్నాండెజ్ సాఫ్ట్ స్కిల్స్ తోడైతే.. భవిష్యత్తులో వృత్తి జీవితంలో రాణించాలంటే కేవలం ఏఐపైనే ఆధారపడటం తగదని, సాఫ్ట్ స్కిల్స్ను పెంపొందించుకోవడమూ చాలా అవసరమని లింక్డిన్ సర్వేలో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం, వ్యూహాత్మక ఆలోచనల వంటి నైపుణ్యాలు ఉన్న వారి అవసరం భవిష్యత్తులో ఎక్కువగా ఉంటుందన్నది హైదరాబాద్లోని వృత్తి నిపుణల లెక్క. రోజువారీ చేయాల్సిన, బోర్ కొట్టించే పనుల భారాన్ని ఏఐ టూల్స్ చక్కబెట్టగలవు కాబట్టి తాము ఆసక్తికలిగించే, నైపుణ్యం ఉన్న విషయాలపై ఎక్కువ సమయం వెచి్చంచవచ్చునని, ఇది వృత్తి సంతృప్తిని అందిస్తుందని వారు విశ్లేషించారు. అలాగే వృత్తికి.. జీవితానికి మధ్య సమతౌల్యత పెరిగేందుకూ ఏఐ తోడ్పడుతుందని సర్వేలో పాల్గొన్న వారిలో 73 శాతం మంది అభిప్రాయపడ్డారు. ‘‘వచ్చే ఐదేళ్లలో ఏఐ తమ ఉద్యోగాల్లో ఎన్నో సానుకూల మార్పులు తీసుకొస్తుందని హైదరాబాద్ వృత్తినిపుణుల్లో 86% మంది భావిస్తున్నారు. ఏఐ రాకతో తమకు సమయం ఆదా అవుతుందని, దాన్ని కొత్త నైపుణ్యాలను నేర్చుకునేందుకు, సృజనాత్మక, వ్యూహాత్మక పనులు చేసేందుకు వాడుకుంటామని చెబుతున్నారు’’ – నిరాజితా బెనర్జీ, లింక్డిన్ -
ఆహా పాము రుచి..! తినరా మైమరచి!!
సాక్షి, హైదరాబాద్: పాము దొరికిందంటే అతనికి పసందైన విందే.. దాన్ని చంపి తోలు ఒలిచి పచ్చిదే ఆరగిస్తుంటాడు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగలగూడూరు గ్రామానికి చెందిన పుల్లన్నకు పాములు తినే అలవాటుంది. గతంలో చిన్నచిన్న పాములను పట్టుకుని తినే పుల్లన్న సోమవారం చనిపోయిన ఆరడుగుల పామును మెడలో వేసుకుని కొరుక్కుని తింటూ గ్రామ వీధుల్లో తిరిగాడు. ఈ ఘటన చూసిన గ్రామస్తులు విస్తుపోయారు. దీనిపై పుల్లన్నను ప్రశ్నించగా పామును తినడం తనకు అలవాటేనని, కోడికూర తిన్నట్లే ఉంటుందని చెప్పాడు. అయితే ఈ పాము బాగా ముదిరిపోయి ఉన్నందున మూరెడు ముక్క మాత్రమే తినగలిగానని చెప్పాడు. – పుట్లూరు -
వినబడకున్నా.. కనిపిస్తుంది! ఖమ్మం కుర్రాడి ఆవిష్కరణ!
సాక్షి, హైదరాబాద్: ద్విచక్రవాహనాలు నడిపే చెవిటి, మూగ దివ్యాంగులకు శుభవార్త. వెనుక నుంచి వస్తున్న వాహనాల హారన్ శబ్దం వినిపించక దివ్యాంగులు ప్రమాదాలకు గురవుతున్నారు. అలాంటివారి కోసం ఖమ్మం జిల్లాకు చెందిన ఎస్కే రజలిపాషా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వినూత్న హెల్మెట్ను తయారు చేశారు. వెనుక నుంచి వచ్చే వాహనాలు హారన్ మోగించినప్పుడు.. వెంటనే హెల్మెట్ ముందుభాగంలో దీపం వెలుగుతుంది. అలా వెలగడంతో ఆ కాంతి హెల్మెట్ అద్దంపై కనిపిస్తుంది.దీంతో అప్రమత్తమై వాహనాన్ని మరింత జాగ్రత్తగా నడపవచ్చు. హారన్ నుంచి వచ్చే ధ్వని తరంగాల ఆధారంగా ఈ హెల్మెట్ దీపాలు వెలిగేలా రూపకల్పన చేయడం విశేషం. -
రంగులు మార్చే చీర!
సాక్షి, సిరిసిల్ల, హైదరాబాద్: చీరను కదిలిస్తే చాలు.. రంగులు మారతాయి.. బంగారు, వెండి పోగులు మెరిసిపోతాయి. వనితల దేహంపై మెరిసిపోతాయి. బంగారం, వెండి పోగులు, పట్టుదారంతో పట్టు చీర నేశాడు సిరిసిల్లకు చెందిన నేత కళాకారుడు నల్ల విజయ్కుమార్. నెల రోజులపాటు మగ్గంపై శ్రమించి ఈ చీరను నేశాడు. 30 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండిపోగులతోపాటు పట్టు పోగులతో రూపొందించాడు. ఈ చీర పొడవు 6.30 మీటర్లు ఉండగా.. 48 అంగుళాల వెడల్పుతో 600 గ్రాముల బరువుంటుంది. ప్రముఖ వ్యాపారి దూరపూడి విష్ణు ఆర్డర్ మేరకు రూ.2.8 లక్షలు వెచ్చించి ఈ చీరను నేసినట్లు విజయ్కుమార్ తెలిపారు. ఈ చీరను మంత్రి కె.తారక రామారావు సోమవారం సెక్రటేరియట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేత కళాకారుడు నల్ల విజయ్కుమార్ను మంత్రి అభినందించారు. -
కాయిర్ జియో టెక్స్టైల్ టెక్నాలజీతో బీటీ రోడ్డు..!
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలో సరికొత్త మార్పులు, ప్రయోగాలకు సిద్దిపేట కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్డు నిర్మాణంలో మరో కొత్త విధానానికి ఇక్కడే శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో కాయిర్ జియో టెక్స్టైల్ (కొబ్బరినార) సాంకేతికతతో తొలిసారిగా రోడ్డు నిర్మించడంతో.. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సాధారణంగా రోడ్ల నిర్మాణం చేసేటప్పుడు ముందుగా నేలను చదును చేస్తారు. ఆ తర్వాత వివిధ సైజుల్లో ఉన్న కంకరను పొరలు పొరలుగా పోసి రోలర్ సాయంతో తొక్కిస్తారు. ఆ మార్గం గట్టిపడిందని నిర్ధారించుకున్న తర్వాత బ్లాక్టేప్ (బీటీ) మిశ్రమంతో రోడ్డును నిర్మిస్తారు. లేదంటే నేరుగా సిమెంట్ రోడ్డును నిర్మించడం ఇప్పటివరకు చూశాం. అయితే, ఇటీవల సిద్దిపేటలో కొత్తగా కొబ్బరినారతో రోడ్డును నిర్మించారు. కాయిర్ జియో టెక్స్టైల్ టెక్నాలజీతో హుస్నాబాద్లో ఉమ్మాపూర్ నుంచి పోతారం(ఎస్) వరకు నాగారం మీదుగా 3.5 కి.మీ. నిడివితో బీటీ రోడ్డు వేశారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద రూ.2.31 కోట్లు కేటాయించారు. అయితే నేషనల్ రూరల్ రోడ్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్ఆర్ఆర్డీ) సూచనలతో కాయిర్ జియో టెక్స్టైల్ టెక్నాలజీతో ఈ రోడ్డు నిర్మించారు. ఈ విధానంలో తాగి పడేసిన కొబ్బరి బొండాల నుంచి నారును వేరు చేశారు. దీన్ని ఒక మిషన్లో వేసి జాలీ మాదిరిగా అల్లారు. ముందుగా నేలను చదునుగా చేసి రోలర్తో తొక్కించిన తర్వాత కొబ్బరి నారతో చేసిన జాలీని పరిచారు. దీనిపై 5 అంగుళాల సన్న కంకరను ఒక పొరగా వేసి.. దానిపై 6 అంగుళాల మందంతో కంకరను మరో పొరగా పోసి రోలర్తో తొక్కించారు. అనంతరం పై నుంచి బ్లాక్టేప్ డాంబర్ వేసి రోడ్డును వేశారు. రాష్ట్రంలో తొలిసారిగా వేసిన ఈ రోడ్డును పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఇటీవల పరిశీలించారు. ఇలాంటి రోడ్ల నిర్మాణానికి డబ్బు ఆదా అవుతుందని, నాణ్యత కూడా బాగా ఉంటుందని ఆయన చెప్పారు. ఖర్చు తక్కువ.. సాధారణ రోడ్ల నిర్మాణంలో 9 అంగుళాలు, 6 అంగుళాల మందంతో కూడిన కంకరను వినియోగిస్తారు. దీని వల్ల ఖర్చు పెరుగుతుంది. పైగా రోడ్డు వాడకంలోకి వచ్చాక వాహనాల బరువుతో కలిగే ఒత్తిడి వల్ల 9 అంగుళాల మందమున్న కంకర స్థానభ్రంశం చెంది రోడ్డు కుంగిపోతుంది. ఇలా వచి్చన పల్లపు ప్రాంతంలో వర్షపు నీరు, డ్రైనేజీ నీరు నిలుస్తుంది. దీని వల్ల బ్లాక్టేప్లో ఉండే పటుత్వం తగ్గుతుంది. ఫలితంగా రోడ్డులో గుంతలు ఏర్పడతాయి. అదీగాక, 15 అంగుళాల ఎత్తుతో రోడ్డు నిర్మించడం వల్ల రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్ల కంటే రోడ్డు ఎక్కువ ఎత్తుగా కనిపిస్తుంది. రోడ్డు నిర్మాణంలో కొబ్బరి పీచు వాడితే నిర్మాణ వ్యయం ప్రతీ కిలోమీటరుకు రూ.2 లక్షల వరకు తక్కువ అవుతుంది. దీంతోపాటు వృథాగా ఉంటూ దోమల పెరుగుదలకు కారణమయ్యే కొబ్బరి బొండాల సమస్యకు పరిష్కారం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. రోడ్డుపై వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా హుస్నాబాద్లో కాయిర్ జియో టెక్స్టైల్ టెక్నాలజీతో రోడ్డు నిర్మించాం. రోడ్డు పైన పడే వర్షపు నీరు భూమిలోకి వెళ్లకుండా కొబ్బరి పీచులోకి ఇంకుతుంది. తర్వాత ఈ నీరు బయటకు రావడం వల్ల రోడ్డు చాలా రోజులు మన్నికగా ఉంటుంది. గుంతలు పడే అవకాశాలు తక్కువ. ఇదే విధంగా మరిన్ని రోడ్లను నిర్మించాలని ప్రభుత్వం చెప్పింది. –సదాశివరెడ్డి, డీఈ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ -
వామ్మో..! చిరుత పులి పిల్లలా.. అడవి పిల్లులా ?
సాక్షి, నల్గొండ: దామరచర్ల మండలం ఇర్కిగూడెంలోని కృష్ణా పరీవాహక ప్రాంతంలో చిరుత పులి పిల్లలవిగా భావిస్తున్న పాదముద్రలు కలకలం రేపాయి. స్థాని కులు ఫారెస్ట్, పోలీసు శాఖల అధికారులకు సమాచారం ఇవ్వడంతో శనివారం ఇర్కిగూడెం అటవీ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అద్దంకి– నార్కట్పల్లి రహదారి పక్కన కృష్ణానది సమీపంలో రెండు చిరుతపులి పిల్లలు తిరుగుతున్నాయని కొందరు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, పోలీసు అధికారులు పరిసర ప్రాంతాలను గాలించారు. పాదముద్రలను పరిశీలించి ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అవి చిరుత పిల్లలు కావని అడవి పిల్లికి చెందిన పాదముద్రలుగా ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. రాత్రి వేళ అటవీ సిబ్బందిని నిఘా ఉంచామని, అవి పులి పిల్లలా, అడవిపిల్లులా అనేది నిర్ధారణ అవుతుందన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ ఆనంద్రెడ్డి, మిర్యాలగూడ సీఐ సత్యనారాయణ, వాడపల్లి ఎస్ఐ రవికుమార్, బీట్ ఆఫీసర్ ముఖేష్, బీట్ ఆఫీసర్లు ప్రవీణ్కుమార్, ఆజం పాల్గొన్నారు. -
సెప్టెంబర్ 17 : BRS పునరుజ్జీవనం vs BJP విమోచనం
సెప్టెంబర్ 17 వచ్చిందంటే రాజకీయ పార్టీలు కొత్త వివాదాన్ని తీసుకొస్తున్నాయి. చరిత్రలో ఇలా జరిగింది.. ఇది మా వాదన అంటూ ఒక్కో రకంగా చెప్పుకుంటున్నాయి. నిజంగా ఏం జరిగిందన్నది మరుగునపడి పార్టీలు తీసుకొస్తున్న కొత్త వాదన మీద వర్తమానం నడుస్తోంది. నాడు ఏం జరిగిందన్న లోతుల్లోకి వెళ్తోన్న రాజకీయనాయకులు జరిగిన దానికి తమదైన భాష్యం చెప్పుకుంటున్నాయి. సాక్షికి ఇచ్చిన వ్యాసాల్లో రెండు విరుద్ధ భావాలను పంచుకున్నాయి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు. బీఆర్ఎస్ తరపున మంత్రి శ్రీనివాసగౌడ్, బీజేపీ తరపును విద్యాసాగర్రావు అందించిన ప్రత్యేక వ్యాసాలు ఇవి. BRS : పునరుజ్జీవనం : ప్రత్యేక తెలంగాణ కల సాకారమైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్యమంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. కృష్ణా–గోదావరీ జలాలను తెలంగాణలోని చేను చెల్కలను తడపడానికీ, చెరువులను నింపడానికీ, తాగు నీరు, పారిశ్రామిక అవసరాలకి మళ్లించే కార్యక్రమానికీ ప్రథమ ప్రాధాన్యం ఇచ్చింది. అలా చేపట్టిన ప్రాజెక్టుల్లో ప్రతిష్ఠాత్మకమైనది ‘పాలమూరు–రంగారెడ్డి.’ తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్ లైన్ ‘నీళ్లు, నిధులు, నియామకాలు.’ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ ఆకాంక్ష, ప్రజల స్వప్నంగా ఉన్న కృష్ణా–గోదావరీ జలాలను చేను చెల్కలకు, చెరువులను నింపడానికి తాగు నీరు, పారిశ్రామిక అవసరాలకి మళ్లించే కార్యక్రమాన్ని ప్రథమ ప్రాధాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంది. వింధ్య సాత్పురా పర్వతాల మధ్య ఉన్న దక్కన్ పీఠభూమి శిఖరంగా ఉన్న తెలంగాణను ఆకుపచ్చ సీమగా మలిచే బృహత్తర కార్యక్రమాన్ని కేసీర్ నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. నూతన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో సమాంతరంగా నీటి నిల్వ సామర్థ్యం, భూగర్భ జలాల పెంపు ప్రాతిపదికగా ప్రజల భాగ స్వామ్యంతో చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ అపూర్వ ఫలితాలను ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ గ్రామీణ ఆర్థిక సామాజిక సాంస్కృతిక వికాసం పునరుజ్జీవం పొందుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలకుల దాష్టీకాల వలన తెలంగాణ సంక్షుభితంగా మారింది. పాలమూరు జిల్లాలో మానవ జీవన విధ్వంసం పతాక స్థాయికి చేరుకుంది. ఇక్కడ మనిషికి మనుగడకు మహా యుద్ధమే జరిగింది. ‘నీరు పల్లమెరుగు’ అనే కాలం చెల్లిన నమూనాతో తెలంగాణలో అత్యధిక చెరువులు ఉన్న ఉమ్మడి పాలమూరుపై నిర్లక్ష్యం చేసి బిరా బిరా కృష్ణమ్మను రానివ్వకుండా దగా చేశారు. తమ కళ్ళముందు పారుతున్న నీటిని కూడా చెరువులో నిల్వ కాకుండా చేశారు. అదే కృష్ణా– గోదావరులతో కోస్తా ప్రాంతాన్ని సుభిక్షంగా మార్చుకున్నారు. గతి తప్పిన రుతువులు, బోర్ బావులతో వ్యవసాయం బావురుమన్నది. నీరు లభ్యం కాని స్థితిలో తీవ్ర దుర్భిక్షం నడుమ జీవితం నిత్య మరణంగా మారిన నేపథ్యంలో బతకడానికి దేశ విదేశాలలో వలస కూలీలుగా కట్టు బానిస జీవితం వెల్లబోస్తున్న దైన్యానికి పాలమూరు ప్రజానీకం నెట్టబడింది. మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని అంతిమ విజయతీరం వైపు చేర్చడానికి కేసీఆర్ చేపట్టిన అనేక ప్రజాస్వామ్య ఉద్యమ వ్యూహాల్లో భాగంగా 2009 లోక్సభ ఎన్నికలలో మహబూబ్ నగర్ నుండి ఎన్నికైనారు. ఈ ప్రాంత ప్రజల అవసరాలు, భోగోళిక స్థితిగతులను అవగాహన చేసుకున్నారు. జీవ వైవిధ్యానికి అనువుగా నల్ల రేగళ్లు, ఎర్ర చెల్కలు, ఇసుక భూములు ఉన్నాయక్కడ. నీరు అందితే దక్కన్ అన్నపూర్ణగా విలసిల్లే భవిష్యత్ ఉందని నిర్ధారించుకున్నారు. వలసలు వెళ్లిన ఇక్కడి ప్రజలు తిరిగి రావడమే కాదు, పక్క ప్రాంతాల నుండి ఉపాధి కోసం ఇక్కడికి వచ్చే దశకు చేరుకోవాలని కోరుకున్నారు. ఈ ప్రాంత లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం సాధించిన సంతోషంలో కృతజ్ఞతను చాటుతూ ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేయాలనుకున్నారు. పాలమూరును పడావు పెట్టి కృష్ణా నీటిని తరలించుకుపోయిన అప్పటి ప్రాంతీయ ద్రోహులను ఎండగట్టారు. 2014లో రాష్ట్ర సాకారం తర్వాత ఉద్యమ క్రమంలోనే రూపకల్పన చేసుకున్న ఉత్తర తెలంగాణ కోసం ‘కాళేశ్వరం’, దక్షణ తెలంగాణ కోసం ‘పాలమూరు–రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం కార్యాచరణ ప్రారంభించారు. చైనా నిర్మించిన సుప్రసిద్ధ ‘త్రీ గార్జెస్’ ప్రాజెక్ట్ కంటే గొప్పగా స్టేట్ ఆఫ్ ఆర్ట్ సాంకేతికతతో, ఎలక్ట్రో మెకానికల్ ఇంజనీరింగ్ అద్భుతాలతో కూడిన ‘పాలమూరు –రంగారెడ్డి' సాగునీటి ప్రాజెక్ట్కు 2015 జూన్ 11న శంఖు స్థాపన చేశారు. శ్రీశైలం ఎగువ భాగాన కొల్లాపుర్ మండలం ‘ఎల్లూరు’ గ్రామం వద్ద వర్షాకాలంలో 120 టీఎంసీల కృష్ణా జలాలను తరలిస్తూ పాలమూరు జిల్లాలో 7 లక్షల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలు, నల్లగొండలో 30 వేల ఎకరాల భూమికి సాగునీరు, అలాగే 1,228 గ్రామాలకి త్రాగునీరు అందించడం దీని లక్ష్యం. కృష్ణమ్మ నీరు గ్రావిటీ కెనాల్ ద్వారా నార్లాపూర్ అంజనగిరి, ఏదుల వీరాంజనేయ, వట్టెం వెంకటాద్రి, కరివేన కురుమూర్తి జలాశయాల గుండా ప్రవహించి లిఫ్ట్ ద్వారా రంగారెడ్డిలోని ఉద్దండాపూర్, లక్ష్మీ దేవిపల్లి జలాశయాలకు చేరుతుంది. సెప్టెంబర్ 16న ‘రంగారెడ్డి–పాలమూరు’ ప్రాజెక్ట్ను కొల్లాపూర్ మండలంలో ‘సింగోటం’ వద్ద కేసీర్ ప్రజలకి అంకితం చేస్తున్నారు. నీటి శబ్దం, నీటి స్పర్శ మానవ భావోద్వేగాలకు ప్రతీకగా ఇక్కడ జరిగే ఉద్వేగ మహత్తర అంకిత సభకు ప్రాజెక్ట్ పరిధిలోని గ్రామాల సర్పంచ్లతో పాటు అశేష ప్రజానీకం తరలి రానున్నారు. కృష్ణమ్మ నీటిని కలశాలలో తీసుకొని వెళ్లి ఆయా గ్రామ దేవాలయాల స్వామి పాదాలకు అభిషేకం చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఆనతి కాలంలోనే తెలంగాణలో 78 శాతం ప్రజలు ఆధారపడే వ్యవసాయాన్ని పండుగగా మార్చే గౌరవప్రద జీవన భూమికను కేసీఆర్ పోషిస్తున్నారు. పరవళ్ళు తొక్కుతూ వస్తున్న నీటిని, కళ్ళ ముందునుంచి పారిపోతున్న నీటిని దోసిళ్ళతో ఒడిసిపట్టుకుంటున్న సంస్కృతిని సాగుచేస్తున్నారు. జీవన సంక్షోభం ద్వారా వచ్చిన ఆత్మన్యూనత స్థానంలో అభివృద్ధి సుభిక్ష ఆత్మ గౌరవ పతాకాన్ని జన మనో కేతనంగా మార్చిన యుగ కర్తగా నిలిచిపోతారు కేసీఆర్. పాలమూరు బిడ్డగా, ఇక్కడి ప్రజల విధేయుడిగా, కేసీఆర్ ఉద్యమ సహచరుడిగా, ప్రభుత్వ పాలనలో తన అనుచరుడిగా ఇతిహాసాన్ని తలపించే పాలమూరు పునరుజ్జీవన చరిత్ర నిర్మాణంలో నేనూ ఒకడిగా ఉండడం పరమానందంగా ఉంది. నిరసనోళ్ల శ్రీనివాస గౌడ్ - వ్యాసకర్త రాష్ట్ర మంత్రివర్యులు ------------- BJP : విమోచనం : హైదరాబాదు సంస్థానంలో ఉన్న వారందరూ భారతదేశంలో అంతర్భాగంగా ఉండి సామాజికంగా, సాంస్కృతికంగా కలిసి వున్నారు. ఈ సంస్థానాన్ని ఇస్లాం దేశంగా మార్చాలనీ, ఉర్దూను అధికార భాషగా రుద్దాలనీ నిజాం విషపూరితంగా ఆలోచించిన తర్వాతే పరిస్థితులు మారిపోయాయి. భారత ప్రభుత్వం ‘పోలీసు చర్య’ను మొదలుపెట్టి, ప్రజలకు ఆ నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగించింది. హైదరాబాద్ సంస్థాన విమోచనకు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలిస్తే ‘భారత ప్రభుత్వ దౌత్యం, సామాన్య ప్రజల త్యాగం, యుద్ధం, విలీనం’ లాంటివి చరిత్ర పుటలలో కనబడుతాయి. ఆనాడు, తెలంగాణా, మరాఠ్వాడ, కర్ణాటకలో విస్తరించి ఉన్న ప్రాంతాలలో ఇప్పటికీ వీటి భయానక ఛాయలు కనబడతాయి. హైదరాబాద్ సంస్థానంలో బ్రిటిష్ వారికీ, నిజాముకూ మధ్య జరిగిన ఒప్పందానికి వ్యతిరేకంగా 1800 సంవత్సరంలోనే స్వాతంత్య్ర పోరాటం పురుడు పోసుకుంది. హిందువులు, ముస్లింలు కలిసి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. హిందూ – ముస్లిం ఐక్యతకు ఇది దర్పణం. ఆంగ్లేయులు సంపదను విచ్చలవిడిగా దోచుకొని దేశాన్ని ఆర్థికంగా నిర్వీర్యం చేశారు. 1857 జూలై 17న మౌల్వి అల్లాఉద్దిన్, తుర్రేభాజ్ ఖాన్ నాయకత్వంలో వందలాది మంది హిందూ, ముస్లింలు కోఠీలో గల బ్రిటిష్ రెసిడెన్సీపై దాడిచేశారు. ఫలితంగా తుర్రేభాజ్ ఖాన్ను హతమార్చి శవాన్ని కోఠీలో వేలాడదీశారు. అల్లాఉద్దిన్ అండమాన్ జైళ్లో 1884లో కన్నుమూశారు. అప్పుడే పుంజుకున్న రాంజీ గోండ్ తిరుగుబాటు తరువాత, వీరులను ప్రభుత్వం నిర్మల్ పట్టణంలో మఱి -
నల్గొండ 'నాగిరెడ్డిపల్లి' లో ‘గేమ్ ఛేంజర్’ గా కనిపించిన హీరో రాంచరణ్..
నల్గొండ: భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామ పరిధిలో గల శ్రీ భీమరావ్ రైస్ గోదాములో హీరో రాంచరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ శుక్రవారం కొనసాగింది. ఈ సందర్భంగా గోదాములోని కల్తీ బియ్యం పట్టుకునే సన్నివేశాలు చిత్రీకరించారు. శంకర్ దర్శకత్వంలో దిల్రాజ్ నిర్మాతగా ఎస్వీసీ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ చిత్రంలోని గోదాముకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ శనివారం కూడా ఇక్కడే కొనసాగనుంది. -
హనుమాన్ విగ్రహం లభ్యం!
ఆదిలాబాద్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని కన్నెపెల్లి శివారులోని వాగులోకి కొట్టుకువచ్చిన హనుమాన్ విగ్రహం బాలుడికి లభించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కన్నెపెల్లికి చెందిన స్వాతిక్ అనే బాలుడు పత్తి చేనులో పక్కనే ఉన్న వాగు పరిసర ప్రాంతాల్లో ఆడుకుంటున్నాడు. అక్కడ రంగులతో కూడిన రాయి కనిపించగా వెళ్లి చూసే సరికి హనుమాన్ విగ్రహం ఉందని గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ విషయం ప్రజలకు తెలియడంతో పెద్ద ఎత్తున విగ్రహాం వద్దకు చేరుకుని పూజలు చేశారు. ఈ విగ్రహాన్ని గ్రామంలో ప్రతిష్టిస్తామని గ్రామస్తులు తెలిపారు. -
ట్రాక్టర్ మునిగినా.. ఈదుతూ బయటపడిన రైతు..
మహబూబాబాద్: మానుకోటి జిల్లా కురవి మండలంలోని గుండ్రాతిమడుగు(విలేజి) శివారు బంగారుగూడెం జీపీ పరిధిలోని చౌళ్ల తండా వద్ద పొలాలు దున్నేందుకు వెళ్లిన ట్రాక్టర్ మున్నేరువాగు వరద నీటిలో గురువారం మునిగిపోయింది. బంచరాయి తండా గ్రామానికి చెందిన రైతు బానోత్ లచ్చిరాం చౌళ్ల తండాకు చెందిన పొలాలను దున్నేందుకు ట్రాక్టర్ తీసుకుని వెళ్లాడు. ఈక్రమంలో మున్నేరు వాగు ప్రవాహం పెరిగింది. రెండువైపులా నీరు వచ్చి చేరుతుండడంతో నీటిలో ట్రాక్టర్ మునిగిపోయింది. దీంతో లచ్చిరాం ట్రాక్టర్ను అక్కడే వదిలి ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. నీటిలో ట్రాక్టర్ మునిగిపోయిన విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. -
అంగన్వాడీలో కుళ్లిన గుడ్లు!
వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు స్వచ్ఛమైన ఆహారాన్ని అందించాలని చేపట్టిన సంకల్పాన్ని పలువురు మధ్య దళారులు చిన్నాభిన్నం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న అధికారుల నిర్లక్ష్యంతో పలువురు నీరు గార్చుతున్నారు. కొన్నె గ్రామంలో సోమవారం కోడిగుడ్లను పంపిణీ చేయగా అవి వండుకున్న వారు గుడ్లు కుళ్లిపోయి వాసన వస్తుందని, అవి తింటే అనారోగ్యం పాలుకావడం ఖాయమని వాపోతున్నారు. అధికారులు సంబంధిత కాంట్రాక్టర్పై చర్య తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
ద్విచక్రవాహనం ఎక్కిన పాము..
ఖమ్మం: మండలంలోని పాలేరు గ్రామంలో ఓ వ్యక్తి టీవీఎస్ మోపెడ్ పైకి పాము ఎక్కడంతో సదరు వ్యక్తి భయాందోళనకు గురయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.. సమీప గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పాలేరు కిరాణా సరుకుల నిమిత్తం రాగా అతను సరుకులను కొనుగోలు చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. కొద్దిదూరం వెళ్లగానే హ్యాండిల్పైకి పాము పాకుతూ కనిపించింది. దీంతో అతను కంగారుగా వాహనాన్ని నిలిపివేయగా అటుగా వెళ్తున్నవారు పామును చంపివేశారు.
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
సింగరేణిని అమ్మేందుకు కాంగ్రెస్ కుట్ర
విషాదం నింపిన క్యాన్సర్
No Headline
అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
రూ.14.05లక్షలు పట్టివేత
రాజన్న సేవలో ఐజీ
పుంజుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు
జిల్లా ప్రజలను నిరాశపరచిన ప్రధాని మోదీ
వెండితెరపై పల్లెటూరు పిల్లాడు
విద్యుత్షాక్తో యువకుడి మృతి
తప్పక చదవండి
- రొమాంటిక్ సీన్స్.. ఒళ్లంతా దద్దుర్లు వచ్చేశాయి: టాలీవుడ్ హీరోయిన్
- ‘అద్భుతం కంటే తక్కువేం కాదు’.. కేజ్రీకు మద్యంతర బెయిల్పై
- నవ్వుతారేమో అనుకున్నా: లాపతా లేడీస్ ప్రతిభ ఇంట్రస్టింగ్ జర్నీ
- ‘సంతోషం’.. కేజ్రీవాల్కు మద్యంతర బెయిల్పై దీదీ
- నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
- సింపతీ కోసమే కేజ్రీవాల్ అరెస్ట్
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement