అభివృద్ధి ఉత్తిమాటే! | ysrcp leader koyya prasad reddy slams ap cm over development | Sakshi
Sakshi News home page

అభివృద్ధి ఉత్తిమాటే!

Oct 9 2016 11:18 AM | Updated on Aug 18 2018 6:11 PM

అభివృద్ధి ఉత్తిమాటే! - Sakshi

అభివృద్ధి ఉత్తిమాటే!

విశాఖ నగరాన్ని నాయుళ్లిద్దరూ దోచేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత కొయ్య ప్రసాదరెడ్డి ఆరోపించారు.

► నాయుళ్లిద్దరూ దోచేస్తున్నారు 
► స్టీల్‌ప్లాంట్‌ను బడాబాబులకు 
కట్టబెట్టే ప్రయత్నాలు 
► టీడీపీ హయాంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం 
► ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ 
నాయకుడు కొయ్య ప్రసాదరెడ్డి
 
డాబాగార్డెన్: విశాఖ నగరాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్నామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్న మాటలకు అర్థం లేదని, విశాఖ ప్రజలను దోచుకునేందుకే వీరు ఉన్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి ఆరోపించారు.

పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ వచ్చే జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ చేస్తున్న దోపిడీని ప్రజల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో కీలకమైన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నష్టాల ఊబిలో కూరుకుపోతే చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు, కనీసం కేంద్ర ఉక్కుశాఖ మంత్రి సందర్శించారా అని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్‌లో లక్షా 50వేల టన్నుల స్టాక్‌ ఉన్నా అమరావతికి 2,500 టన్నులు మాత్రమే సరఫరా చేయడమేమిటని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించి బడాబాబులకు కట్టబెట్టేందుకే నాయుళ్లిద్దరూ ఉన్నారని విమర్శించారు. గతంలో స్టీల్‌ప్లాంట్‌ నష్టాల బాటలో ఉంటే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆదుకున్నారని చెప్పారు. బీజేపీ, టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేâýæ్లయినా బీహెచ్‌ఈఎల్, షిప్‌యార్డ్‌కు ఒక్క ఆర్డరైనా తెప్పించారా అని అడిగారు. హుద్‌హుద్‌ తుపానులో నష్టపోయినా ఒక్కపైసా కూడా ఇన్సూరెన్స్ రాలేదన్నారు.  
 
చంద్రబాబు మాటలు బేతాళకథలు 
 నగర నడిబొడ్డున కోట్లాది రూపాయల స్థలం కబ్జా అవుతోందని తమ పార్టీ నాయకుడు గుడివాడ అమర్‌నాథ్‌ తెరపైకి తెచ్చారని గుర్తు చేశారు. దసపల్లా హిల్స్‌లో రాణిగారి స్థలం(2వేల గజాల్లో)లో టీడీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారన్నారు. చంద్రబాబు మాటలు బేతాâýæ కథల్లా ఉన్నాయని, ఇసుక కుంభకోణంలో 70 మంది ఎమ్మెల్యేలకు ప్రత్యక్ష సంబంధాలున్నా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. కోర్టుల్లో ప్రభుత్వ వాదన సరిగ్గా లేకపోవడంతో భూములు అన్యాక్రాంతమవుతున్నాయని తెలిపారు.

తమ పార్టీకి అనుకూలమైన కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, నగర పోలీస్‌ కమిషనర్‌ను ఇక్కడికి రప్పించుకుని ఆగడాలు సాగిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ తీరుపై న్యాయ పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీసీడీఎఫ్‌ రాష్ట్ర అ«ధ్యక్షుడు పక్కి దివాకర్, వైఎస్సార్‌ సీపీ ప్రచార కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, ప్రచార కమిటీ నగర అధ్యక్షుడు బర్కత్‌ఆలీ, సేవాదళ్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, సాంస్కృతిక విభాగం ప్రతినిధి రాధ పాల్గొన్నారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement