అనాథల ప్రేమపాశం

Orphan People Humanity Story in Tamil nadu - Sakshi

చెన్నై,టీ.నగర్‌: మానవత్వం బతికే ఉందని తెలిపే ఘటన నగరంలో చోటుచేసుకుంది. అరవకురిచ్చి– కరూరు రోడ్డు సోమవారం రాత్రి 9 గంటల సమయంలో జనసంచారం లేకుండా నిర్మానుష్యంగా కనిపించింది. ఆ సమయంలో నడవలేని స్థితిలో 70 ఏళ్ల వృద్ధుడు కాళ్లతో దేక్కుంటూ నడిరోడ్డుపై వెళ్లసాగాడు. ఆ సమయంలో ఆ ప్రాంతానికి చెందిన కొందరు వృద్ధున్ని చేతులతో పట్టుకుని రోడ్డు పక్కన కూర్చోబెట్టారు. అతనితో మాటలు కలపగా మతిస్థిమితం లేని వ్యక్తిగా తెలిసింది. అతనికి ఓ మహిళ ఆహారం అందజేయగా, అతను తినడానికి నిరాకరించి నీళ్లు మాత్రం అడిగి తాగాడు. అదే సమయంలో అటువైపుగా వచ్చిన మరో అనాథ ఏదో పాట పాడుకుంటూ వెళ్లసాగాడు. ఆ సమయంలో వృద్ధుడు నిరాకరించిన ఆహారాన్ని అతనికి ఇచ్చారు. వెంటనే అతను ఆహారం తీసుకుని వృద్ధుని దగ్గరకు వెళ్లి, అయ్యా! కొంచెం తినండి.. అని బతిమాలాడు. అందుకు వృద్ధుడు నువ్వు తింటే నేను తింటానని పట్టుబడడంతో సదరు వ్యక్తి ఆ వృద్ధునికి చేతితో గోరుముద్దలు తినిపించి, తానూ తిన్నాడు. అనాథల ప్రేమపాశం అక్కడున్న వారి కళ్లు చెమర్చేలా చేశాయి. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top