తల్లి, దర్శకురాలు అపర్ణాసేన్ నుంచి పొందిన స్ఫూర్తితో సినీపరిశ్రమలోకి అడుగుపెట్టిన కొంకణాసేన్ ఖాతాలో విజయాలు తక్కువేనని చెప్పాలి. అయితే నటనపరంగా చూస్తూ మిగతా నటీనటులకంటే ఆమెకే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఈ విషయమై అస్ట్రేలియాలోని సత్యజిత్ రే ఇన్స్టిట్యూట్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ... ‘మిస్టర్ అండ్ మిస్సెస్ అయ్యర్ సినిమా తర్వాత పరిశ్రమలో నాకు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాలో నటనకుగాను నాకు జాతీయ అవార్డు వచ్చింది. చిత్రీకరణ సమయంలో నటనలోని అన్ని కోణాలను చాలా దగ్గరగా చూశాననే అనుభూతి కలిగింది.
నిజానికి ఆ సినిమా అంగీకరించే సమయంలో నాకు నటనలో పెద్దగా అనుభం లేదనే చెప్పాలి. కానీ నా తల్లి, దర్శకురాలు అపర్ణాసేన్ ప్రోత్సాహంతో ఆ పాత్రను ఒప్పుకున్నాను. నటనకు సంబంధించి ఎన్నో మెళకువలు ఆమె వద్ద నేర్చుకున్నాను. సినిమాలో నా పాత్ర కోసం ఓ పరిశోధన జరిగిదంనే చెప్పాలి. పాత్ర తీరుతెన్నులు ఎలా ఉండాలనే విషయాన్ని తెలుసుకునేందుకు అమ్మ చెన్నై వెళ్లింది. తనపాటు అసిస్టెంట్గా నన్ను తీసుకెళ్లింది. అలా తీసుకెళ్లడం నాకెంతో ఉపయోగపడింది. మొత్తానికి సినిమా బాగా వచ్చింది. ఆ తర్వాత అవార్డుల గురించి మీకు తెలిసిందే.
అయితే సినిమాకు అవార్డులు వచ్చే సమయంలో నేను ఢిల్లీలో ఓ జాబ్లో స్థిరపడిపోయాను. కానీ అవార్డు తర్వాత అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. ఇంగ్లిష్, బెంగాలీ, హిందీ సినిమాల్లో నటించాను. బాల నటిగా 1983లోనే ‘ఇందిరాహ్’తో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన నాకు తొలి చిత్రంలోనే బాలుడిలా కనిపించేందుకు వెంట్రుకలు కత్తిరించుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి సినిమా కోసం ఏదైనా చేయాలనే అభిప్రాయానికి వచ్చాను. అదే నన్ను జాతీయ అవార్డు దక్కించుకునేలా చేసింద’ని చెప్పింది.
‘మిస్టర్ అండ్ మిస్సెస్ అయ్యర్’ సినిమా తర్వాత పరిశ్రమలో మంచి గుర్తింపు
Published Sat, May 10 2014 10:46 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement