వచ్చే ఎన్నికల్లో త్రిబుల్‌ బెడ్‌రూం అంటారేమో! | Jana Reddy comments on TRS | Sakshi
Sakshi News home page

వచ్చే ఎన్నికల్లో త్రిబుల్‌ బెడ్‌రూం అంటారేమో!

Feb 7 2017 3:41 AM | Updated on Mar 18 2019 7:55 PM

వచ్చే ఎన్నికల్లో త్రిబుల్‌ బెడ్‌రూం అంటారేమో! - Sakshi

వచ్చే ఎన్నికల్లో త్రిబుల్‌ బెడ్‌రూం అంటారేమో!

వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ త్రిబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చినా ఆశ్చర్యపో నవసరం లేదని సీఎల్పీ నేత కె. జానారెడ్డి ఎద్దేవా చేశారు.

సీఎం కేసీఆర్‌పై సీఎల్పీ నేత జానారెడ్డి విసుర్లు

కేతేపల్లి: వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ త్రిబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చినా ఆశ్చర్యపో నవసరం లేదని సీఎల్పీ నేత కె. జానారెడ్డి ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చ లేదని మండిపడ్డారు. నల్లగొండ జిల్లా కేతేపల్లిలో పునఃప్ర తిష్ఠించిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాన్ని సోమవారం ఆయన ఆవిష్క రించారు.

కేసీఆర్‌ సర్కార్‌పై ధ్వజమె త్తారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణను బంగారు పల్లెంలో పెట్టి అప్పజెబితే గడిచిన రెండేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆయన  ధ్వజమెత్తారు. 

Advertisement
 
Advertisement
Advertisement