పీఎస్‌ఎల్‌వీ సి-37 ప్రయోగ సమయం మార్పు


శ్రీహరికోట: శ్రీహరి కోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ నెల 15 న జరపనున్న పీఎస్‌ఎల్‌వీ సి-37 ప్రయోగ సమయంలో స్వల్ప మార్పులు చేశారు. ఒకేసారి 103 ఉపగ్రహాలను ఆరోజు కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. 15 వ తేదీ ఉదయం 9.32 గంటలకు ప్రయోగం జరుగుతుందని తొలుత ప్రకటించినా దానికి బదులు 9.28 గంటలకే ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు.

 

సతీష్ ధావన్ సెంటర్ నుంచి నుంచి పీఎస్‌ఎల్వీ సి-37 రాకెట్ ద్వారా వివిధ దేశాలకు చెందిన 100 ఉపగ్రహాలతో పాటు 3 భారత ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలను నింగిలోకి పంపుతుండటంతో ప్రపంచ దేశాలు ఈ ప్రయోగంపై ఆసక్తి చూపుతున్నాయి. తక్కువ ఖర్చుతో ఉపగ్రహ ప్రయోగాలు నిర్వహించడంలో ఇస్రోకు ఘనమైన రికార్డు ఉంది. 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top