అన్యాయాన్ని, అక్రమాన్ని అడ్డుకోవాల్సిన పోలీసుల్లో కొందరు అడ్డదారిలో కానిస్టేబుళ్లుగా నియామకమైన విషయం వెలుగులోకి వచ్చింది.
నగర ఖాకీల్లో నకిలీలు
Aug 10 2013 3:02 AM | Updated on Aug 21 2018 5:44 PM
సాక్షి, న్యూఢిల్లీ: అన్యాయాన్ని, అక్రమాన్ని అడ్డుకోవాల్సిన పోలీసుల్లో కొందరు అడ్డదారిలో కానిస్టేబుళ్లుగా నియామకమైన విషయం వెలుగులోకి వచ్చింది. నకిలీ డ్రైవింగ్ లెసైన్స్ సమర్పించి, కానిస్టేబుళ్లుగా ఉద్యోగాలు సంపాదించిన 41 మందిపై పోలీసు ప్రధాన కార్యాల యం డీసీసీ వీఏ గుప్తా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరంతా నకిలీ పత్రాలతో కానిస్టేబుల్(డ్రైవర్) ఉద్యోగాలు సంపాదించారని ఆయన ఆరోపించారు. కానిస్టేబుళ్లుగా ఎంపికైన ఉద్యోగుల దస్తావేజులను పరిశీలించగా వారు సమర్పించిన డ్రైవింగ్ లెసైన్స్లు నకిలీ పత్రాలన్న విషయం వెల్లడైందని చెప్పారు.
నకిలీ పత్రాలతో నియమితులైనట్లుగా గుర్తించిన 41 మం దిలో చాలా మంది హర్యానాకు చెందిన వారున్నారని, వీరిలో పలువురు ఆగ్రా, మథురాల లో డ్రైవింగ్ లెసైన్సులు తయారు చేసుకున్నారని, వెరిఫికేషన్ సమయంలో సదరు పత్రాల ను పరిశీలించగా అవి నకిలీవని తేలిందన్నా రు. దాదాపు రెండేళ్ల కిందట కూడా ఇవే ఆరోపణలతో 250 మందిపై ఇంద్రప్రస్థ ఎస్టేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
అయితే భర్తీ సమయంలోనే వారి బాగో తం బయటపడింది. కానీ ప్రస్తుతం ఉద్యోగం లో చేరాక వారు సమర్పించిన పత్రాలు నకిలీవని తేలింది. ఢిల్లీ పోలీసు రిక్రూట్మెంట్ సెల్ 676 మంది కానిస్టేబుళ్ల ( డైవర్లు) నియా మకం కోసం 2009, ఫిబ్రవరి 19, 21 తేదీల్లో పత్రికా ప్రకటన ద్వారా దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హతా పత్రాలతోపాటు డ్రైవింగ్ లెసైన్సులను కూడా సమర్పించాలని కోరింది. దీంతో వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే భర్తీ ప్రక్రియ సమయంలోనే 250 మంది నకిలీ పత్రాలతో వచ్చినట్లు తేలింది. దీంతో వారిపై కేసులు నమోదు చేశారు.
మిగతావారిని వివిధ ప్రాంతాల్లో కానిస్టేబుళ్లు(డ్రైవర్లు)గా నియమించింది. అయితే భర్తీ అయినవారిలో కూడా ఎవరైనా నకిలీ పత్రాలు సమర్పించారా? అనే అనుమానంతో వెరిఫికేషన్ జరిపారు. దీంతో 41మంది బాగోతం బయటపడింది.
Advertisement
Advertisement