విరాట్‌ కోహ్లి సరికొత్త రికార్డు

Virat Kohli accomplishes yet another milestone - Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో ఘనతను సాధించాడు. సోషల్‌ మీడియాలో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న క్రికెటర్‌గా కోహ్లి సరికొత్త రికార్డు సృష్టించాడు. వివిధ సోషల్‌ మీడియా సైట్లలో కలిపి కోహ్లి ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్స్(10 కోట్లు)మార్క్‌కు చేరింది. ఫేస్‌బుక్‌లో 3.7 కోట్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 3.35 కోట్లు, ట్విటర్‌లో 2.94 కోట్ల మంది కోహ్లిని ఫాలో అవుతున్నారు. ఫలితంగా సోషల్‌ మీడియాలో 10 కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న తొలి క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు.

క్రికెట్ గాడ్ గా పేర్కొనే సచిన్ టెండూల్కర్, కెప్టెన్ కూల్ ఎంఎస్‌ ధోని, హిట్ మ్యాన్ రోహిత్ కు కూడా సాధ్యం కాని ఫ్యాన్ ఫాలోయింగ్ కోహ్లికే ఉందనే విషయం తాజా ఘనత ద్వారా స్పష్టమవుతోంది. టీమిండియా ఆటగాడిగా, కెప్టెన్‌గా అత్యుత్తమ ఆటతీరుతో కోహ్లి ఇప్పటికే అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top