న్యూఢిల్లీ: టి-20 ప్రపంచ కప్లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ల మధ్య ఈ నెల 19న ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్పై అనిశ్చితి ఏర్పడింది. ఈ మ్యాచ్కు తగిన భద్రత కల్పించలేమని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కేంద్ర హోం శాఖకు ఈ మేరకు లేఖ రాశారు. భారత్, పాక్ మ్యాచ్కు భద్రత కల్పించడం రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యంకాదని లేఖలో పేర్కొన్నారు. పాక్తో మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వరాదని హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్ను ఎక్కడ నిర్వహిస్తారు? బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుదన్నది సందిగ్ధంగా మారింది.
కాగా హిమాచల్ ప్రదేశ్ నిర్ణయాన్ని బీసీసీఐ కార్యదర్శి, బీజేపీ ఎంపీ అయిన అనురాగ్ ఠాకూర్ తప్పుపట్టారు. ధర్మశాల వేదికగా భారత్-పాక్ మ్యాచ్ నిర్వహించనున్న విషయం కొన్ని నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసని, ఆ సమయంలో ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ విషయంలో రాజకీయాలు చేయరాదని అన్నారు. టి-20 ప్రపంచ కప్ వేదికలను ఏడాది క్రితమే బోర్డు ఖరారు చేసిందని, ఆరు నెలల ముందు మ్యాచ్లను కేటాయించామని స్పష్టం చేశారు. భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు కూడా అమ్మారని, ఆఖరు నిమిషంలో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం సరికాదన్నారు. దీనివల్ల భారత ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పారు. దక్షిణాసియా గేమ్స్ సందర్భంగా పాకిస్తాన్ క్రీడాకారులకు అసోం ప్రభుత్వం భద్రత ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.
ఇంతకీ భారత్, పాక్ మ్యాచ్ ఎక్కడ?
Published Tue, Mar 1 2016 4:03 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement