భారత్ తో జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది.
సిడ్నీ: ప్రపంచకప్ లో భాగంగా గురువారమిక్కడ భారత్ తో జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. 25 ఓవర్లలో వికెట్ నష్టపోయి 132 పరుగులు పూర్తిచేసింది.
ఫించ్(47), స్మిత్(66) క్రీజ్ లో ఉన్నారు. 15 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ ను నిలకడైన ఆటతీరుతో జట్టు స్కోరును 100 పరుగులు దాటించారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 132 బంతుల్లో 114 పరుగులు జోడించారు.