ఆయన నీతులు చెప్పటం హాస్యాస్పదం: అంబటి

YSRCP Spokesperson Ambati Rambabu Fire On AP Speakar Kodela Siva Prasad Rao In Guntur - Sakshi

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌, టీడీపీ నేత కోడెల శివప్రసాద రావుపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడుతూ.. తొండపి గ్రామంలో జరిగిన ఘటనలకు కోడెల శివప్రసాద్‌ రావే కారణమన్నారు. కోడెల ఒక ఫ్యాక్షనిస్టు అని ఆరోపించారు. అప్పట్లో ఎవరింట్లో బాంబులు పేలాయో దేశమంతా చూసిందని, అలాంటి కోడెల శివ ప్రసాద రావు ఇప్పుడు నీతులు చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

మీ(కోడెల శివప్రసాద్‌) పిల్లల వల్ల మీకు రాజకీయ జీవితం లేకుండా పోతుందని హెచ్చరించారు. అవినీతి చేయలేదని త్రికోటేశ్వర స్వామి సాక్షిగా కోడెల ప్రమాణం చేయగలరా అని సూటిగా అడిగారు. సత్తెనపల్లిలో దోపిడీచేసి రూ.200 కోట్లతో మాల్‌ కట్టింది ఎవరో ప్రజలందరికీ తెలుసునని పరోక్షంగా కోడెలనుద్దేశించి విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top