ఆయన నీతులు చెప్పటం హాస్యాస్పదం | YSRCP Spokesperson Ambati Rambabu Fire On AP Speakar Kodela Siva Prasad Rao In Guntur | Sakshi
Sakshi News home page

ఆయన నీతులు చెప్పటం హాస్యాస్పదం: అంబటి

Feb 27 2019 7:25 PM | Updated on Jul 29 2019 2:44 PM

YSRCP Spokesperson Ambati Rambabu Fire On AP Speakar Kodela Siva Prasad Rao In Guntur - Sakshi

విలేకరులతో మాట్లాడుతోన్న అంబటి రాంబాబు( అంతర చిత్రంలో కోడెల శివప్రసాద రావు)

అప్పట్లో ఎవరింట్లో బాంబులు పేలాయో దేశమంతా చూసిందని, అలాంటి కోడెల..

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌, టీడీపీ నేత కోడెల శివప్రసాద రావుపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడుతూ.. తొండపి గ్రామంలో జరిగిన ఘటనలకు కోడెల శివప్రసాద్‌ రావే కారణమన్నారు. కోడెల ఒక ఫ్యాక్షనిస్టు అని ఆరోపించారు. అప్పట్లో ఎవరింట్లో బాంబులు పేలాయో దేశమంతా చూసిందని, అలాంటి కోడెల శివ ప్రసాద రావు ఇప్పుడు నీతులు చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

మీ(కోడెల శివప్రసాద్‌) పిల్లల వల్ల మీకు రాజకీయ జీవితం లేకుండా పోతుందని హెచ్చరించారు. అవినీతి చేయలేదని త్రికోటేశ్వర స్వామి సాక్షిగా కోడెల ప్రమాణం చేయగలరా అని సూటిగా అడిగారు. సత్తెనపల్లిలో దోపిడీచేసి రూ.200 కోట్లతో మాల్‌ కట్టింది ఎవరో ప్రజలందరికీ తెలుసునని పరోక్షంగా కోడెలనుద్దేశించి విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement