చర్చకు దేవినేని ఉమ సిద్ధమేనా? | Sakshi
Sakshi News home page

చర్చకు దేవినేని ఉమ సిద్ధమేనా?

Published Tue, Feb 27 2018 2:55 PM

Ysrcp Mla Srikanth Reddy challenge to Minister Devineni Uma - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రాజెక్టుల పేరుతో టీడీపీ నేతలు అడ్డగోలుగా దోచుకుంటున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి విమర్శించారు. పని చేయకుం‍డా బిల్లులు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్‌లో ఎస్టిమేషన్లను అమాంతం పెంచి అందినకాడికి దోచుకుంటున్నారని శ్రీకాంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

ప్రాజెక్టుల్లో అవినీతిపై చర్చకు తాము సిద్ధమని, మంత్రి దేవినేని ఉమ సిద్ధమేనా అని ఆయన సవాల్‌ విసిరారు. వ్యవసాయం, ప్రాజెక్టులపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, మనసులో మాట పుస్తకంలోనే ఆ విషయం చెప్పారని ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement