వైఎస్సార్‌సీపీలో చేరికల జోరు

Venkatagiri Mayor Joins YSR Congress Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి. వైఎస్సార్‌సీపీలో చేరే నాయకుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తాజాగా నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ దొంతు శారద, ఆమె భర్త దొంతు బాలకృష్ణ మంగళవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో పార్టీలోకి వచ్చారు. వీరికి వైఎస్‌ జగన్‌ పార్టీ కండువాలతో సాదర స్వాగతం పలికారు.

మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావ్ తమ్ముడు, గుంటూరు మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళి కూడా వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అంబటి రాంబాబు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన ఆయనకు వైఎస్‌ జగన్‌ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. (చదవండి: ఇదేంది.. నారాయణ ఇట్లా చేస్తున్నావు..)


తాడిశెట్టి మురళిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న వైఎస్‌ జగన్‌, పక్కనే  అంబటి రాంబాబు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top