కన్ఫ్యూజన్లో కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు తనను కన్ఫ్యూజన్కు గురి చేస్తున్నాయని తెలంగాణ మంత్రి కే తారకరామారావు ట్వీట్ చేశారు. న్యూస్ చానెళ్లు అన్నీ వేరు వేరు నెంబర్లను ప్రదర్శిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఏ ప్రాంతంలో ఎవరు ముందంజ లేదా వెనుకంజలో ఉన్నారో తనకు అసలు అర్థం కావడం లేదని చెప్పారు.
అభిప్రాయాలు తదితరాలను తాను అర్థం చేసుకోగలనని తెలిపారు. కానీ, నిజాలు, నెంబర్లు ఎలా మారుతాయని ప్రశ్నించారు. కాగా, కేటీఆర్ ట్వీట్పై నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. ఒకరు టీవీని స్విచాఫ్ చేయమని సలహా ఇస్తే.. అన్నింటికంటే బెటర్ ఈసీని ఫాలో అవ్వండి అటూ సూచన చేశారు.
So confusing with channels reporting different numbers 🙄 on who’s leading & where!!
I can understand entitlement to opinions/views but facts & figures can’t change??!!#GujaratElection2017
— KTR (@KTRTRS) 18 December 2017