కేపీసీసీ చీఫ్‌గా దినేశ్‌ గుండూరావు | Dinesh Gundu Rao Is New Congress' Karnataka Chief | Sakshi
Sakshi News home page

కేపీసీసీ చీఫ్‌గా దినేశ్‌ గుండూరావు

Jul 5 2018 2:41 AM | Updated on Jul 5 2018 2:41 AM

Dinesh Gundu Rao Is New Congress' Karnataka Chief - Sakshi

దినేశ్‌ గుండూరావు

న్యూఢిల్లీ: కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి(కేపీసీసీ)గా దినేశ్‌ గుండూరావు(48) నియమితులయ్యారు. ప్రస్తుత పీసీసీ చీఫ్‌ జి.పరమేశ్వర సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కూడా కొనసాగుతున్నందున ఈ నియామకం చేపట్టినట్లు ఏఐసీసీ పేర్కొంది. బెంగళూరులోని గాంధీనగర్‌ స్థానం నుంచి ఐదు పర్యాయాలు ఎన్నికైన గుండూరావు కేపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

ఆయన గత కేబినెట్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయనతోపాటు ఎమ్మెల్యేగా ఈశ్వర్‌ ఖంద్రేను కేపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటకలో జేడీఎస్‌–కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం అధికారం చేపట్టిన నేపథ్యంలో ఈ నియామకాలు జరిగాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో యువ రక్తాన్ని నింపాలన్న రాహుల్‌ ఆలోచన మేరకే ఈ మార్పులు చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement