‘మా కుటుంబ విషయాల్లో సీఎం జోక్యం చేసుకుంటున్నారు’

Congress Leader Blames MP Govt For Family Dispute - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అర్జున్‌ సింగ్‌ కుమారుడు అజయ్‌ సింగ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌పై పలు ఆరోపణలు చేశారు. తమ కుటుంబ వ్యహహారాల్లో సీఎం జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు. తన కుమారులు వేధిస్తున్నారని, ఇంట్లో నుంచి బలవంతంగా బయటకు గెంటేస్తున్నారని అర్జున్‌ సింగ్‌ భార్య సరోజ్‌ కుమారి(83) అజయ్‌ సింగ్‌, తన భార్య సునీతపై ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

గృహ హింస నుంచి మహిళలకు రక్షణ కల్పించే చట్టం 2005 ప్రకారం తన కుమారులు, కోడలుపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తన తల్లి కేసు పెట్టడం వెనుక సీఎం శివరాజ్‌ సింగ్‌ హస్తం ఉందని, రాజకీయంగా తనను దెబ్బతీయాలనే ఉద్దేశంతో తన కుటుంబ వ్యహహారాల్లో సీఎం జోక్యం​ చేసుకుంటున్నారని అజయ్‌ విమర్శించారు. తన మీద వచ్చిన విమర్శిలపై శివరాజ్‌సింగ్‌ తీవ్రంగా స్పందించారు. అజయ్‌వి చౌకబారు ఆరోపణలని, వారి కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని సీఎం స్పష్టంచేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top