హంద్వారాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం

Two terrorists killed in encounter in Kupwara - Sakshi

శ్రీనగర్‌ : జమ్ము,కశ్మీర్‌లోని గత మూడు రోజులుగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. తాజాగా కుప్వారా జిల్లా హంద్వారా ఏరియా బాబాగుండ్‌లో ఆదివారం భద్రతాదళాలు...ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. మరోవైపు  ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో రెండు ఇళ్లు, రెండు గోశాలలు ధ్వంసమైనట్టు స్థానిక మీడియా వెల్లడించింది. కాగా గత మూడు రోజులుగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందినవారిలో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, ఇద్దరు జమ్ము,కశ్మీర్‌ పోలీసులు ఉన్నారు. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top