
పట్నా: భారీ వర్షాలు, వరదలతో బిహార్లోని కోషి నది ఉప్పొంగుతోంది. వరద ఉధృతికి నేల కోతకు గురవడంతో నది ఒడ్డున ఉన్న ఓ స్కూల్ భవనం చూస్తుండగానే కుప్పకూలింది. ఈ సంఘటన భగల్పూర్లో జరిగింది. భవన శిథిలాలు నదిలో కొట్టుకుపోయాయి. కరోనా లాక్డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడటంతో ప్రమాదం తప్పిందని స్థానికులు చెప్పారు. పాఠశాల భవనం నదిలోకి జారిపోతున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
(చదవండి: అక్కడ మరోసారి పూర్తిస్థాయి లాక్డౌన్!)