కలకలం: కరోనాతో ఏసీపీ మృతి

Punjab ACP Departed Of Coronavirus In Ludhiana - Sakshi

చంఢీగడ్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దానికి తోడు మృతుల సంఖ్య కూడా రెట్టింపు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కరోనా వైరస్‌ సోకి పంజాబ్‌లోని లూథియానా ఏసీపీ (అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌)అనిల్‌ కోహ్లి మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇటీవల ఆయనకు వైరస్‌ లక్షణాలు కనిపించడంతో వైద్యుల పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలోనే లూథియానాలోని ఎస్‌పీఎస్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఈ మేరకు ఏసీపీ మృతిని స్థానిక అధికారులు ధృవీకరించారు. కాగా పంజాబ్‌ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 202కి చేరగా ఇప్పటి వరకు 14 మంది మరణించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top