అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్సరించుకొని ఈ నెల 21 న ఛండీగడ్ రాష్ట్రంలో అక్కడి ప్రజలతో కలిసి యోగా చేస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో తెలిపారు.
ప్రతీ ఒక్కరూ రోజూ 20 నుంచి 30 నిమిషాలు యోగా చేయాలన్నారు. పేదవాళ్లు వైద్యం కోసం ఎంతో ఖర్చు చేస్తుంటారని, యోగా చేయడం మూలాన అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు.