'గాంధీ ఇండియా కాదు.. మోదీ ఇండియా' | Now, ink attack on J-K MLA Engineer Rashid, this is Modi's India, he says | Sakshi
Sakshi News home page

'గాంధీ ఇండియా కాదు.. మోదీ ఇండియా'

Oct 19 2015 5:10 PM | Updated on Jul 11 2019 6:33 PM

'గాంధీ ఇండియా కాదు.. మోదీ ఇండియా' - Sakshi

'గాంధీ ఇండియా కాదు.. మోదీ ఇండియా'

జమ్మూ కశ్మీర్ కు చెందిన స్వతంత్ర్య ఎమ్మెల్యే ఇంజినీర్ రషీద్ పై ఢిల్లీలో నల్ల ఇంకుతో దాడి చేశారు

ఢిల్లీ: జమ్మూ కశ్మీర్ కు చెందిన స్వతంత్ర్య ఎమ్మెల్యే ఇంజినీర్ రషీద్ పై ఢిల్లీలో నల్ల ఇంకుతో దుండగులు దాడి చేశారు. బీఫ్ పార్టీ ఇచ్చినందుకు ఇదివరకే రషీద్ను తోటి సభ్యులు జమ్మూకశ్మీర్ అసెంబ్లీలోనే చితకబాదిన విషయం తెలిసిందే. అయితే ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రషీద్ మోహం పై ఇంకు కుమ్మరించారు. 'గో మాతాకీ జై అంటూ' నినాదాలు చేస్తూ ఉద్రిక్తతను రాజేశారు.

'భారత్లోకూడా తాలీబన్ల సంస్కృతి వస్తోంది. ఇది మోదీ ఇండియా, గాంధీ ఇండియా కాదు.. నా పై దాడికి పాల్పడింది ఎవరో తెలియదు. కానీ 80,000 మంది  కశ్మీరీలను రాష్ట్రం కోల్పోయింది. నాపై ఇంకు చల్లితే సమస్య పరిష్కరం కాదంటూ' రషీద్ ఉద్యేగభరితంగా మీడియాతో మాట్లాడారు. ఈ దాడికి పాల్పడింది తామే అంటూ 'హిందూ సేన' ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement