మంత్రికి నాన్బెయిలబుల్ వారెంట్ జారీ | Non-bailable warrant issued against UP minister | Sakshi
Sakshi News home page

మంత్రికి నాన్బెయిలబుల్ వారెంట్ జారీ

Apr 11 2015 12:10 PM | Updated on Oct 17 2018 6:34 PM

ఉత్తర్ ప్రదేశ్ విద్యుత్ శాఖామంత్రి యాసిర్ షాకు శుక్రవారం నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.

లక్నో:   ఉత్తర్ ప్రదేశ్ విద్యుత్ శాఖమంత్రి యాసిర్ షాకు   నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.   ఒక  కేసు విచారణకు హాజరు కాకుండా, సమన్లను సైతం ధిక్కరించిన మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేసిన  చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్  బర్బాంకీ సర్వజీత్ శుక్రవారం ఈ  వారెంట్ను జారీ చేశారు.

అధికారుల సమాచారం  ప్రకారం... 2007లో ఒక  వ్యక్తిని గృహ నిర్బంధం చేసినట్లు మంత్రి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విషయంలో పలుమార్లు సమన్లు జారీ అయిప్పటికీ , ఆయన కోర్టుకు గైర్హాజరవుతూ వచ్చారు.  ఈ నేపథ్యంలోనే మంత్రి యాసిర్తో సహా 32మందికి  నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది.  మే12, 13ల్లో జరిగే విచారణకు కోర్టు ముందు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు.

కాగా  భారీ ఎత్తున మత్తు మందులు కలిగి ఉన్నాడనే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అక్రమంగా నిర్బంధంలో ఉంచిన  కేసులో పలువురు పోలీసులు సహా, మంత్రి యాసీర్ షాపై  నాన్పరా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement