ఉత్తర్ ప్రదేశ్ విద్యుత్ శాఖామంత్రి యాసిర్ షాకు శుక్రవారం నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ విద్యుత్ శాఖమంత్రి యాసిర్ షాకు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఒక కేసు విచారణకు హాజరు కాకుండా, సమన్లను సైతం ధిక్కరించిన మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ బర్బాంకీ సర్వజీత్ శుక్రవారం ఈ వారెంట్ను జారీ చేశారు.
అధికారుల సమాచారం ప్రకారం... 2007లో ఒక వ్యక్తిని గృహ నిర్బంధం చేసినట్లు మంత్రి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విషయంలో పలుమార్లు సమన్లు జారీ అయిప్పటికీ , ఆయన కోర్టుకు గైర్హాజరవుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే మంత్రి యాసిర్తో సహా 32మందికి నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. మే12, 13ల్లో జరిగే విచారణకు కోర్టు ముందు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు.
కాగా భారీ ఎత్తున మత్తు మందులు కలిగి ఉన్నాడనే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అక్రమంగా నిర్బంధంలో ఉంచిన కేసులో పలువురు పోలీసులు సహా, మంత్రి యాసీర్ షాపై నాన్పరా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.