కేరళకు మరిన్ని సహాయక బృందాలు | More Assistance To Kerala | Sakshi
Sakshi News home page

కేరళకు మరిన్ని సహాయక బృందాలు

Aug 19 2018 6:15 PM | Updated on Aug 20 2018 9:18 PM

More Assistance To Kerala  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

వరదలతో అతలాకుతలం అవుతోన్న కేరళకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని సహాయక బృందాలను పంపింది.

సాక్షి, హైదరాబాద్‌: వరదలతో అతలాకుతలం అవుతోన్న కేరళకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని సహాయక బృందాలను పంపింది. ఇండియన్‌ ఆర్మీకి చెందిన 5 మెడికల్‌ టీంలు, 2 కాలమ్‌లు(ప్రతీ కాలమ్‌లో 50 నుంచి 60 మంది సిబ్బంది ఉంటారు), 2 అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాఫ్టర్లు, 2 చేతక్‌ హెలికాఫ్టర్‌లు సహాయంగా పంపించారు.

ఇండియన్‌ నేవీ నుంచి 10 రెస్క్యూ టీంలు, 10 మోటారు బోటులు, ఒక అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాఫ్టర్‌, మరొక సీకింగ్‌ హెలికాఫ్టర్‌లు పంపారు. ఇండిన్‌ ఎయిర్‌ఫోర్స్‌ నుంచి రెండు ఎంఐ-17 హెలికాఫ్టర్లు, ఒక అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాఫ్టర్‌లు పంపారు.ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ నుంచి 6 మోటారు బోట్లు, 4 సాధారణ బోట్లు, 21 హైర్డ్‌ బోట్లులు పంపించారు. 

అలాగే ఐసీజీఎస్‌ విజిత్‌ నౌక ద్వారా 40 టన్నుల సహాయక సామగ్రి పంపించారు. నౌక ముంబై నుంచి కొచ్చికి ఇదివరకే బయలుదేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement