బీపీసీఎల్‌ రిఫైనరీలో భారీ పేలుడు, మంటలు

Fire breaks out at Bharat Petroleum refinery in Mumbai, explosions heard - Sakshi

సాక్షి,ముంబై: ముంబైలోని భారత పెట్రోలియం కార్పొరేషన్‌ రిఫైనరీలో భారీ పేలుడు సంభవించింది. పలుమార్లు ఈ పేలుళ్లు జరగడంతో మంటలు ఎగిసి పడ్డాయి. ముంబై మహల్‌ రోడ్‌ చెంబూర్‌ ప్రాంతంలోని రిఫైనరీలో ఈ విస్ఫోటనం సంభవించింది. పేలుళ్ల తరువాత భారీ ఎత్తున మంటలు అంటుకున్నాయని అగ్నిమాపక అధికారులు వెలడించారు. 7అగ్నిమాపక శకటాలు, 2 ఫోం టెండర్లు, జంబో ట్యాంకర్లతో  మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారని తెలిపారు.  ఈ ప్రమాదంలో దాదాపు 21 మంది  తీవ్రంగా గాయపడినట్టు  ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top