చిల్డ్రన్ హోమ్లో అంబానీ ఫ్యామిలీ..
ముంబై : నగరంలోని ఓ చిల్డ్రన్ హోమ్లో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ సందడి చేసింది. శుక్రవారం ధీరూభాయ్ అంబానీ 16వ వర్థంతి సందర్భంగా వారు చిల్డ్రన్ హోమ్ను సందర్శించారు. ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ, కూతురు ఇషా అంబానీ, కాబోయే కోడలు శ్లోకా మెహతా అక్కడి పిల్లలతో సరదాగా ముచ్చటించారు. ముంబైలోని వృద్ధాశ్రమాలకు, అనాథాశ్రమాలకు కనీస అవసరాలను రిలయన్స్ ఫౌండేషన్ తీరుస్తోంది. దాదాపు 3500 మంది రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా లబ్ధిపొందుతున్నారు. వారికి అవసరమైన ఆహార పదార్థాలను, ఇతర వసతులను సమకూర్చటంలో ఫౌండేషన్ ముందుంటోంది .