ముంబైలో కుప్పకూలిన భవనం.. ఒకరు మృతి
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గురువారం భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలకు నగరంలోని ఓ అయిదంతస్తుల భవనం కూలి ఒకరు మృతి చెందగా, మరో నలుగురిని రెస్క్యూ టీమ్ సురక్షితంగా బయటికి తీసింది. సుమారు 20 మందికిపైగా శిధిలాల కింద ఇరుక్కుని ఉంటారని భావిస్తున్నారు. ఫైరింజన్లలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి సహాయక చర్యలు చేపడుతున్నారు