మావోయిస్టుల ఘాతుకం : బీజేపీ ఎమ్మెల్యే మృతి

BJP MLAconvoy attacked by Maoists in Chhattisgarh Five People Dead - Sakshi

చత్తీస్‌గడ్‌ : చత్తీస్‌గడ్‌లో నక్సల్స్‌ మరోసారి విరుచుకుపడ్డారు. దంతేవాడ జిల్లాలో బీజేపీ కాన్వాయ్‌పై  మావోయిస్టులు దాడికి తెగబడ్డారు.  ఈ దాడిలో బీజేపీ ఎంఎల్‌ఏ భీమా మాండవి  దుర్మరణం చెందారు. వీరితోపాటు మరో ఆరుగురు భద్రతా సిబ్బంది అక్కడిక్కడే ప్రాణాలు  కోల్పోయారు.  మరోవైపు భద్రతా బలగాలు , మావోయిస్టుల మధ్య  కాల్పులు కొనసాగుతున్నట్టు  తెలుస్తోంది.  దంతెవాడలోని సకులనార్‌లో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top