నగరంలో ఏం జరిగింది? | What is happening in city | Sakshi
Sakshi News home page

నగరంలో ఏం జరిగింది?

Oct 19 2015 12:49 AM | Updated on Sep 3 2017 11:10 AM

నగరంలో ఏం జరిగింది?

నగరంలో ఏం జరిగింది?

హైదరాబాద్‌లో జరిగే వినాయకుడి నిమజ్జనాన్ని కళ్లారా చూడాలని నలుగురు యువకులు తమ గ్రామం నుంచి నగరానికి వస్తారు.

 హైదరాబాద్‌లో జరిగే వినాయకుడి నిమజ్జనాన్ని కళ్లారా చూడాలని నలుగురు యువకులు తమ గ్రామం నుంచి నగరానికి వస్తారు. అక్కడ ఊహించని సంఘటనలు ఎదుర్కొంటారు. ఆ సంఘటనలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపుకి కారణం అయ్యాయి? అనే కథాంశంతో చంద్రమహేశ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రెడ్ అలర్ట్’. హెచ్.హెచ్. మహదేవ్, అంజనా మీనన్ జంటగా పీవీ శ్రీరామ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన తొలి సినిమాగా ‘ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ని సాధించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ‘‘కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి భారీ ఎత్తున ప్రేక్షకాదరణ లభించింది. తెలుగులో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చంద్రమహేశ్ తెలిపారు.

రవి, అమర్, తేజ, సుమన్, కె. భాగ్యరాజా, అలీ, పోసాని తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: శ్రీరామ్ చౌదరి, సంగీతం: రవివర్మ, కెమెరా: కల్యాణ్ సమి, సమర్పణ: యస్. త్రిలోక్‌రెడ్డి, సహనిర్మాత: శ్రీమతి  పిన్నింటి శ్రీరామ్ సత్యరెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె. జైపాల్‌రెడ్డి.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement