వివాదం సృష్టించిన ప్రమాదం.. 15 మంది మృతి

In China Bus Driver Fights With Woman Then Bus Plunges Into River - Sakshi

బీజింగ్‌ : డ్రైవింగ్‌ చేసేటప్పుడు డ్రైవర్లు చాలా జాగ్రత్తగా.. సహనంతో వ్యవహరించాలి. ప్రయాణికులు కూడా వారికి సహకరిస్తేనే క్షేమంగా గమ్యానికి చేరగలం. లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో చైనాలో జరిగిన ఈ ప్రమాదం  చూస్తే అర్థం అవుతోంది. ప్రయాణికురాలికి, డ్రైవర్‌కి మధ్య జరిగిన గొడవ దాదాపు 15 మంది మృతికి కారణమయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియోను చైనా అధికారిక మీడియా విడుదల చేసింది.

అధికారులు తెలిపిన దాని ప్రకారం పరధ్యానంగా ఉన్న డ్రైవర్‌ని ఓ మహిళ తన ఫోన్‌తో అతని తలపై కొట్టింది. దాంతో డ్రైవర్‌ స్టీరింగ్‌ మీద నుంచి చెయ్యి తీసి సదరు మహిళతో గొడవ పడటం ప్రారంభించాడు. దాంతో కంట్రోల్‌ తప్పిన బస్సు ముందుగా కారును ఢీ కొని​.. ఆపై బ్రిడ్జ్‌ రెయిలింగ్‌కు గుద్దుకుని దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top