160 మంది బందీల ఊచకోత | 160 people hostage massacre are Iraq militants | Sakshi
Sakshi News home page

160 మంది బందీల ఊచకోత

Jun 28 2014 2:19 AM | Updated on Sep 2 2017 9:27 AM

160 మంది బందీల ఊచకోత

160 మంది బందీల ఊచకోత

ఇరాక్ మిలిటెంట్ల మారణకాండను హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ ధ్రువీకరించింది. మిలిటెంట్లు ఈ నెల 11-14 మధ్య తిక్రిత్ నగరంలో 160 మందికిపైగా బందీలను హతమార్చారని శుక్రవారం వెల్లడించింది.

ఇరాక్ మిలిటెంట్ల ఘాతుకం  హ్యూమన్ ైరె ట్స్ వాచ్ వెల్లడి
 
బాగ్దాద్: ఇరాక్ మిలిటెంట్ల మారణకాండను హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ ధ్రువీకరించింది. మిలిటెంట్లు ఈ నెల 11-14 మధ్య తిక్రిత్ నగరంలో 160 మందికిపైగా బందీలను హతమార్చారని శుక్రవారం వెల్లడించింది. ఉపగ్రహ ఛాయాచిత్రాలు, మిలిటెంట్లు విడుదల చేసిన ఫొటోల ఆధారంగా ఈ సంగతి తెలుస్తోందని పేర్కొంది. మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని, అయితే మృతదేహాలున్న ప్రాంతాలను గుర్తించడం కష్టమవుతోందని సంస్థ ప్రతినిధి పీటర్ బొకేర్ట్ ఓ ప్రక టనలో పేర్కొన్నారు.

ఉత్తర ఇరాక్‌లో పలు ప్రాంతాలను చేజిక్కించుకున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్(ఐఎస్‌ఐఎల్) జిహాదీలు తాము పట్టుకున్న సైనికులను నేలపై పడుకోబెట్టి కాల్చి చంపుతున్నట్లున్న ఫొటోలను వెబ్‌సైట్‌లో పెట్టడం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement