హైదరాబాద్‌​లో మరో ఎన్నారై మోసం | wife-complaint-against-nri-husband | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌​లో మరో ఎన్నారై మోసం

Feb 16 2017 3:59 PM | Updated on Jul 6 2019 12:47 PM

హైదరాబాద్‌​లో మరో ఎన్నారై మోసం - Sakshi

హైదరాబాద్‌​లో మరో ఎన్నారై మోసం

నగరంలో మరో ఎన్నారై భర్త మోసం వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్‌: నగరంలో మరో ఎన్నారై మోసం వెలుగులోకి వచ్చింది. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని.. రెండేళ్లు గడవక ముందే కట్టుకున్న భార్యను, ఆర్నెళ్ల బిడ్డను ఎయిర్‌పోర్ట్‌లో వదిలివెళ్లాడో ఎన్నారై. వివరాలు.. నగరంలోని రామాంతపూర్‌కు చెందిన యాలాల శిరీషకు రెండేళ్ల క్రితం కీర్తిసాయిరెడ్డి అనే ఎన్నారైకి వివాహం అయింది. పెళ్లి తర్వాత శిరీషను అమెరికా తీసుకెళ్లిన భర్త అక్కడ ఆమెను చిత్రహింసలు పెట్టాడు.
 
అంతేకాకుండా ఆరు నెలల బాబుకు తల్లి పాలు ఇవ్వకుండా అడ్డుకొని వేధింపులకు గురిచేశాడు. భర్త, అత్త కలిసి తల్లి నుంచి చిన్నారి వేరు చేసి చిత్రహింసలకు గురుచేసినట్టు సమాచారం. ఈ నేపధ్యంలో బుధవారం అర్ధరాత్రి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఆరు నెలల బాబుతో పాటు శిరీషను వదలి వెళ్లాడు కీర్తిసాయిరెడ్డి. దీంతో ఆమె గురువారం తల్లిదండ్రుల సహాయంతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. భర్తను తనను కలపాలని కోరుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement