టుడే న్యూస్ అప్‌డేట్స్ | today news updates | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్ అప్‌డేట్స్

Apr 30 2016 7:28 AM | Updated on Sep 17 2018 5:18 PM

తెలంగాణ అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సమావేశం శనివారం జరగనుంది. పలు కీలక బిల్లులపై సమావేశంలో చర్చిస్తారు.

పశ్చిమబెంగాల్: నేడు పశ్చిమబెంగాల్ ఐదో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.

తెలంగాణ: తెలంగాణ అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సమావేశం శనివారం జరగనుంది. పలు కీలక బిల్లులపై సమావేశంలో చర్చిస్తారు.
తెలంగాణ: మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు రెండో రోజు పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శనివారం విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్: ఏపీ లా సెట్-2016 దరఖాస్తుల గడువు శనివారంతో ముగిస్తుంది. అపరాధ రుసుం లేకుండా నేటితో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

స్పోర్ట్స్: ఐపీఎల్-9 భాగంగా శనివారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగును.
స్పోర్ట్స్: ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ సెమీ ఫైనల్ శనివారం జరుగనుంది. చైనా క్రీడాకారిణి యిహాన్ వాంగ్‌తో  భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తలపడనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement