
కేరళలో సత్తుసింగ్ అరెస్ట్
'నానక్రాంగూడ' భవన యజమాని సత్తు సింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్: పదకొండు మందిని బలి తీసుకున్న నానక్రాంగూడ భవన యజమాని సత్తు సింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన జరిగినప్పటి నుంచి అతను ఎవరికీ కనిపించకుండా పోయాడు. దీంతో పోలీసులు అతని కోసం గాలించి, చివరికి కేరళలో ఉన్నట్లు తెలుసుకుని పట్టుకున్నారు.
కాగా, ఈ ఘటనలో భవన శిథిలాల తొలగింపు పూర్తయింది. అధికార యంత్రాంగం 28 గంటల పాటు నిర్విరామంగా పనిచేసింది. మొత్తం 11 మంది చనిపోగా ఇద్దరిని మాత్రమే రక్షించ గలిగారు.