2015 రోడ్డు ప్రమాదాల గణాంకాలు విడుదల | Road accidents death records of 2015 has been released | Sakshi
Sakshi News home page

2015 రోడ్డు ప్రమాదాల గణాంకాలు విడుదల

Jun 9 2016 4:09 PM | Updated on Aug 30 2018 4:07 PM

2015కు సంబంధించి రోడ్డు ప్రమాదాల గణాంకాలను గురువారం నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసింది.

హైదరాబాద్‌: 2015కు సంబంధించి రోడ్డు ప్రమాదాల గణాంకాలను గురువారం నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసింది. 2014లో కంటే 2015 సంవత్సరంలో 2.5 శాతం ప్రమాదాలు పెరగగా, 4.6 శాతం మరణాలు సంభవించినట్టు వెల్లడించింది. రోజుకు సగటున 1,374 రోడ్డుప్రమాదాలు జరుగుతుండగా, 400 మరణాలు సంభవిస్తున్నట్టు పేర్కొంది.

అయితే రోడ్డుప్రమాదాల మృతుల్లో 54.1 శాతం మంది 15 నుంచి 34 ఏళ్ల లోపువారేనని తెలిపింది. ఇదిలా ఉండగా రోడ్డు ప్రమాద మరణాల్లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం తొలిస్థానంలో ఉంది. ఏడోస్థానంలో ఆంధ్రప్రదేశ్‌, తొమ్మిదో స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నట్టు ఎన్‌సీఆర్‌బీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement