breaking news
National crime record bureau
-
ప్రేమ హత్యలే అధికం!
సాక్షి, అమరావతి: దేశంలో అధిక శాతం హత్యలకు ప్రేమ వ్యవహారాలే కారణమవుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వెల్లడించింది. ఎన్సీఆర్బీ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో 28% హత్యలు ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాల వల్లే జరుగుతున్నాయి. 2001–2017 మధ్య కాలంలో జరిగిన హత్యలకు మూడో అతిపెద్ద కారణం ప్రేమ వ్యవహారాలే. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్రల్లో జరిగిన హత్యల్లో అత్యధిక శాతం ప్రేమ వ్యవహారాలవే ఉన్నాయి. ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రెండో స్థానంలో ప్రేమ హత్యలున్నాయి. 2001లో దేశవ్యాప్తంగా 36,202 హత్య కేసులు నమోదుకాగా, 2017లో 21 శాతం తగ్గి 28,653 కేసులు నమోదయ్యాయి. వ్యక్తిగత కక్షతో చేసే హత్యలు 4.3% తగ్గగా, ఆస్తి వివాదాల వల్ల జరిగే హత్యలు 12% తగ్గాయి. 2016లో 71 పరువు హత్య కేసులు నమోదు కాగా, 2017లో 92 కేసులు నమోదయ్యాయి. -
2015 రోడ్డు ప్రమాదాల గణాంకాలు విడుదల
హైదరాబాద్: 2015కు సంబంధించి రోడ్డు ప్రమాదాల గణాంకాలను గురువారం నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో(ఎన్సీఆర్బీ) విడుదల చేసింది. 2014లో కంటే 2015 సంవత్సరంలో 2.5 శాతం ప్రమాదాలు పెరగగా, 4.6 శాతం మరణాలు సంభవించినట్టు వెల్లడించింది. రోజుకు సగటున 1,374 రోడ్డుప్రమాదాలు జరుగుతుండగా, 400 మరణాలు సంభవిస్తున్నట్టు పేర్కొంది. అయితే రోడ్డుప్రమాదాల మృతుల్లో 54.1 శాతం మంది 15 నుంచి 34 ఏళ్ల లోపువారేనని తెలిపింది. ఇదిలా ఉండగా రోడ్డు ప్రమాద మరణాల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తొలిస్థానంలో ఉంది. ఏడోస్థానంలో ఆంధ్రప్రదేశ్, తొమ్మిదో స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నట్టు ఎన్సీఆర్బీ ఒక ప్రకటనలో వెల్లడించింది.