బొజ్జా తారకంకు హైకోర్టు ఘన నివాళి | high court pays tribute to bojja tarakam | Sakshi
Sakshi News home page

బొజ్జా తారకంకు హైకోర్టు ఘన నివాళి

Sep 21 2016 3:10 AM | Updated on Apr 3 2019 6:20 PM

బొజ్జా తారకంకు హైకోర్టు ఘన నివాళి - Sakshi

బొజ్జా తారకంకు హైకోర్టు ఘన నివాళి

ఇటీవల మృతిచెందిన సీనియర్ న్యాయవాది బొజ్జా తారకంకు ఉమ్మడి హైకోర్టు ఘనంగా నివాళులు అర్పించింది.

సాక్షి, హైదరాబాద్: ఇటీవల మృతి చెందిన సీనియర్ న్యాయవాది బొజ్జా తారకంకు ఉమ్మడి హైకోర్టు మంగళవారం ఘనంగా నివాళులు అర్పించింది. తారకంకు నివాళులు అర్పించేందుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
 
ఈ కార్యక్రమంలో తారకం కుటుంబ సభ్యులు, తెలంగాణ అదనపు ఏజీ రామచంద్రరావు, ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వర్లు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. న్యాయవ్యవస్థకు తారకం చేసిన సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారని ఏసీజే అన్నారు. తారకం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం అంతా రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement