జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్లు ప్రతిపక్షాలకు చోటు లేకుండా చేయాలని టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్యగౌడ్ అన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్లు ప్రతిపక్షాలకు చోటు లేకుండా చేయాలని టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్యగౌడ్ అన్నారు. ఐఎస్ సదన్ డివిజన్ అధ్యక్షుడు మన్నె శ్రీరంగా ఆధ్వర్యంలో వంద మంది యువకులు ఎంపీ బూర సమక్షంలో ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... టీఆర్ఎస్ పార్టీలో యువకులకు సముచిత స్థానం ఉంటుందన్నారు. నిరుద్యోగ సమస్య తీర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కషి చేస్తున్నారని చెప్పారు.