'వాళ్లకు ఇచ్చినా బీసీలకు నష్టం లేదు' | land registration easy in andhra pradesh, says K E Krishna Murthy | Sakshi
Sakshi News home page

'వాళ్లకు ఇచ్చినా బీసీలకు నష్టం లేదు'

Dec 1 2015 10:45 AM | Updated on Mar 28 2019 5:30 PM

'వాళ్లకు ఇచ్చినా బీసీలకు నష్టం లేదు' - Sakshi

'వాళ్లకు ఇచ్చినా బీసీలకు నష్టం లేదు'

అమరావతిలో లంక గ్రామాల భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు.

విజయవాడ : అమరావతిలో లంక గ్రామాల భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడలో కేఈ కృష్ణమూర్తి విలేకర్లతో మాట్లాడుతూ... రిజిస్ట్రేషన్ శాఖలోని సేవలను సులభతరం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.

ఇప్పటికే ఎన్నారై రిజిస్ట్రేషన్లను సులభతరం చేశామని తెలిపారు. రూ. వెయ్యిపైన స్టాంపుల కొనుగోలు ఆన్లైన్లో కొనుగోలు చేసుకోవచ్చని చెప్పారు. రిజిస్ట్రేషన్ శాఖలో రూ. 3500 కోట్ల లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కేఈ కృష్ణమూర్తి వెల్లడించారు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చినా బీసీలకు నష్టం లేదని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement